Saturday, October 31, 2009

దశావతారాలు

ఈ క్రింద చెప్పబడిన విషయాలను ఆధ్యాత్మిక దృష్టి ద్వారా లేక మతపరంగా కాకుండా విజ్ఞానదృష్టి తో చూడాలని కోరుతున్నాను.
మనందరికీ తెలుసు శ్రీమహావిష్ణువు యొక్క దశావతరాలు.

అవి వరుసగా చేప,తాబేలు,పంది,నరసింహ,వామన,పరశురామ,శ్రీరామ,శ్రీకృష్ణ,బుద్ధ మరియు కల్కి అని.
ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సృష్టి పరిణామక్రమం,మనిషి జీవనవిధానం అర్థమవుతుంది.

అదెలాగంటే

1.చేప : మొదట నీరు ఏర్పడింది( నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది).కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి.

2.తాబేలు : ఇది ఉభయచరం అనగా భూమిపైన మరియు నీటిలో రెండింటిలో సంచరించునది.

3.పంది : ఇది భూమిపైన మాత్రం సంచరించేది.భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తోంది.

4.నరసింహ : ఇక్కడ మానవుని మొదటిదశ వర్ణింపబడింది.ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణరూపం పొందలేదు.

5.వామన : మానవులు మొదట మరుగుజ్జులుగా ఉండడాన్ని సూచించడం జరిగింది.

6.పరశురామ : ఇచ్చట మనిషి యొక్క పశుప్రవృత్తిని(అంటే చెప్పినది ఆలోచించకుండా చేయడం) సూచిస్తోంది.

7.శ్రీరామ : ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కొరకు జీవించడాన్ని మరియు మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.

8.శ్రీకృష్ణ : ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.

9.బుద్ద : అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచించడం జరిగింది.

10.కల్కి : ఈ అవతారం ఇంకా రాలేదు కనుక దీని విషయం తెలియరావడం లేదు

No comments:

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070