Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

Thursday, February 4, 2010

మద్యం పై పద్యం విజయం

తెలుగు సాహిత్యం...అందులోను పద్యం విలువని చాటిచెప్పే ఒక వార్తని ఇప్పుడే పాత ఈనాడు దిన పత్రికలో చదివాను. వెంటనే దాన్ని అందరితో పంచుకోవాలనిపించింది. ఇక్కడ జత చేస్తున్నాను

Wednesday, February 3, 2010

కొడవటిగంటి రచనా ప్రపంచం




కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవలికను గుర్తు తెచ్చుకుని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.

పది పన్నెండేళ్ళ వయసులోనే నవలలు చదివేసిన నాకు కుటుంబరావు గారి పరిచయం కేవలం పది పన్నెండేళ్ళ క్రితం జరగడం నాకే ఆశ్చర్యం! లోకం గొప్ప రచయితలుగా ముద్ర వేసిన కొందరు రచయితల రచనలు నన్ను అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల గొప్ప రచయితలంటే భయం ఏర్పడి ఆయన రచనల జోలికి పోలేదనుకుంటాను.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుట్ పాత్ మీద కుటుంబరావుగారి నవలలు కొనడంతో ఆయన రచనా ప్రపంచం తలుపు తట్టాను. ఆ నవలికలు నన్ను అద్భుత రస ప్రపంచంలోకి విసిరి కొట్టాయి. మిగిలిన సంపుటాల కోసం ఎంతగా ప్రయత్నించినా అప్పటికే విశాలాంధ్రలో స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు.

కానీ ఆశ్చర్యకరంగా రెండు నవలా సంపుటాలు హ్యూస్టన్ మీనాక్షి ఆలయం లోని పుస్తక విక్రయకేంద్రంలో దొరికాయి.

కుటుంబరావు గారి శైలి గురించి, ఆయన పాత్ర చిత్రణ గురించీ,ఇంకా రచనా చమత్కృతి గురించీ వారి శత జయంతి సందర్భంగా అనేక ఆన్ లైన్ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ వ్యాసాలు వచ్చాయి. అందువల్ల మళ్ళీ ఇక్కడ దాన్ని నా దృష్టి కోణం నుంచి వివరించే ప్రయత్నం, చెయ్యను కానీ ఆయన రాసిన ఒక నవలికను పరిచయం చేయాలనుకుంటున్నాను.

ఆలిండియా రేడియో సీరియల్ గా ప్రసారం చేయడానికి డైరీ రూపంలో ఒక పెద్ద కథ రాయమని కుటుంబరావు గారిని కోరినపుడు ఆయన 'సరితాదేవి డైరీ"ని రాశారు. అది ప్రసారం కూడా అయిపోయాక కుటుంబరావు గారికి అది అసంపూర్ణంగా ఉన్నట్లు తోచింది. ఆయన మాటల్లో ఇలా అంటారు

"కథ అయిపోయింది, అయిపోలేదు కూడా! ఎందుకంటే కథ తాలూకూ చాలా విషయాలు ఈ డైరీలోకి రాలేకపోయాయి.కష్టపడి కథ ఆలోచించిన రచయిత దాన్ని పాఠకులకు(శ్రోతలకు)అందజేయలేకపోయిన రచయిత ఎంత ఆందోళన చెందుతాడో ఎవరైనా సులువుగా ఊహించవచ్చు! సరితా దేవి డైరీతో రేడియో మాసం దాటింది కానీ నా పని గడవలేదు.అందుచేత సరితా దేవి డైరీ కి అనుబంధంగా సరోజ డైరీ రాశాను"!


ఈ రెండు డైరీలలో వచ్చే పాత్రలతో తర్వాత ఆయన "కామినీ హృదయం" అనే నాటిక కూడా రాశారు.


ఒకే కథను రెండు వైపుల నుంచీ ఇద్దరు తల్లీ కూతుళ్ళ డైరీల ద్వారా అద్భుతంగా చెప్పిన కథే ఈ "సరితా దేవి డైరీ" సరోజ డైరీలు!

కథ విషయానికొస్తే ........

సరితాదేవి ఒక మధ్యతరగతి తల్లి. ఆడపిల్ల తల్లి!

కథ చాలా కాలం నాటిది కనుక ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన కూతురికి అప్పుడే పెళ్ళి చెయ్యాలని,గొప్ప వరుడిని తేవాలని ఆరాటపడే సగటు తల్లి! చాలా మంది మధ్యతరగతి వాళ్ళకుండే రోగం....అదే గొప్పింటివాళ్లతో పోటీ పడాలని,ఒక్కోసారి గెలవాలని కూడా అనుకునే అభిజాత్యపు రోగం అంతో ఇంతో సరితాదేవిక్కూడా ఉంది.



రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అమ్మాయి సావిత్రి, సరితా దేవికూతురు సరోజా స్నేహితులు.ఇద్దరూ పెళ్ళికెదిగిన వాళ్ళే! ఈ నేపథ్యంలో సరితా దేవి తమ్ముడు వాసుతో పాటు ఢిల్లీ నుంచి మనోరంజన్ అనే అందగాడూ, మంచి ఉద్యోగస్తుడూ అందునా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలరూ వస్తాడు.

 ఇటు సరితాదేవి, అటు సావిత్రి తల్లీ అతడిని తమ తమ కూతుళ్లకు వరుడిగా చేసెయ్యాలని ఆరాటపడతారు.అతడు తిరిగి ఢిల్లీ వెళ్ళేవరకూ కూతురి పట్ల అతడికి ఆకర్షణ కలిగించాలని,సరోజను మిసెస్ మనోరంజన్ గా చేసెయ్యాలని సరితా దేవి చేసిన ప్రయత్నాలే ఆమె రాసుకున్న డైరీ!



మరో వైపు సరోజ మనో రంజన్ వైపు ఆకర్షితురాలవుతూనే,అతడిని ఇష్టపడుతూనే తన తల్లి చేసే "చవకబారు
ప్రయత్నాలు " తనకెంత చిరాకు పుట్టించాయో తన డైరీలో రాసుకుంటుంది.



సావిత్రితో మనోరంజన్ పెళ్ళి స్థిరమైపోయిందనే వార్త రూఢిగా తెలిశాక సరితాదేవి నిరాశలో కూరుకుపోతుంది.ఇది ఒక రకంగా ఆమెకు ఓటమి కూడా కదా సుశీల ముందు! ఆమె తమ్ముడు వాసు "సరదాగా నాల్రోజులు ఢిల్లీలో గడిపి వస్తుంది సరోజను పంప"మనడం,ఢిల్లీ వెళ్ళాక అక్కడ సరోజ, రంజన్ లు పెద్దవాళ్లకు తెలీకుండా వాసు సహాయంతో రిజిస్టర్ పెళ్ళి చేసుకోవడం కథలో చివరి ట్విస్టు!



మనో రంజన్ తనను ఇష్టపడుతున్నాడనీ, తననే పెళ్ళాడతాడనీ సరోజకు నిశ్చయంగా తెలుసు. మరో వైపు సావిత్రి తల్లి సుశీల చేసే ప్రయత్నాల మీద కూడ ఆమెకు అనుమానంగానే ఉంటుంది.
ఇంకో వైపు తల్లి! ఇలా నలుగుతూనే సరోజ ఈ కథంతా డైరీలా మనకి చెప్తుంది. తేదీల వారీగా రాసే డైరీల మీద కుటుంబరావు గారికి ఆట్టే నమ్మకం లేకపోవడం వల్ల సరితా దేవి, సరోజ... కథ చెప్పుకుంటూ వెళతారంతే!



రెండూ ఒకటే కథ అయినా ఎవరి వైపు నుంచి వారు చెప్పడం వల్ల రెండూ కొత్తగానే అనిపిస్తాయి పాఠకులకి!

ఇదొక అద్భుత రచనా ప్రక్రియ అనిపిస్తుంది చదువుతున్నంత సేపూ, ఒకటే కథ రెండు వెర్షన్లలో ఇంత ఆసక్తి కరంగా మలచడం !.

ఒక మధ్యవయస్కురాలైన తల్లి, ఒక యుక్తవయస్కురాలైన కూతురు ఈ ఇద్దరి మనస్థత్వాలను కొ.కు ఆవిష్కరించిన తీరు అద్భుతంగా తోస్తుంది.


సావిత్రి, తన తల్లి ఎంత చెప్తే అంతని, బుద్ధి మంతురాలనీ , తన కూతురు సరోజ మాత్రం పెంకిదనీ, తన మాట విని బాగుపడతామనే ఆలోచనే లేదనీ సరితాదేవి కంప్లెయింట్!

 మరో పక్క సరోజేమో "సావిత్రి వాళ్ళమ్మ మాట వింటుందనీ నేను వినననీ నా మీద కోపం!నేనూ విందునేమో అమ్మక్కూడా సుశీల గారికున్నంత నాగరికత ఉంటే! 'నేను నీకు అమ్మనని ఎప్పుడైనా అనిపిస్తుందిటే? నేనేం చెప్పినా నీ చెడు కోసమే చెబుతున్నాననుకుంటున్నావా?' అని నన్ను నిలవేస్తుంది. ఆవిడకర్థమయ్యేట్టు చెప్పడం నాకు చాత కావడం లేదు.ఆవిడ నా మీద ఆపేక్షతోనే చెబుతుంది.కానీ ఆవిడ చెప్పినట్లా చేస్తే నేను నవ్వులపాలైపోవలసిందే! ఆవిడ నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. అటువంటి మనిషి ఆపేక్షకు విలువేమిటి?"అని ఆలోచిస్తుంది.



నలుగురిలో కూతురు అందంగా కనిపించాలని ఏ తల్లికైనా ఉంటుంది.ఇదే తాపత్రయం సరితాదేవి కూడా పడి సరోజ ను చిత్తం వచ్చినట్లు అలంకరించి మనోరంజన్ కి కాఫీలు, టీలూ అందించమంటుంది. సరోజేమో సహజంగా ఉండాలనుకుంటుంది.



"నన్ను ఉన్నట్టు ఉండనివ్వక ఏ రాధలాగో, మహాలక్ష్మి లాగో, అనసూయ లాగో చేస్తానంటుంది. నాకు చిరాకెత్తి 'నేనేం బట్టల దణ్ణెం అనుకున్నావా, నీకిష్టమైన చీరల్లా నా మీద వేసి చూడ్డానికి? అని అడిగేస్తాను. దాంతో ఆవిడకు కోపం వచ్చేస్తుంది"అని మనతో వాపోతుంది.



తల్లీ కూతుళ్ళ మధ్య ఇలాంటి తరల అంతరాల గొడవలని ఆ కాలంలోనే(ఎందుకంటే ఇప్పటికంటే అప్పటి ఆడపిల్లలు తల్లి చెప్పినట్లు వినేవాళ్లని కదా అందరం అనుకుంటాం) రచయిత ఎలా పరిశీలించారా అని ఆశ్చర్యం వేస్తుంది.



మనస్థత్వాలను కుటుంబరావు గారు మంచినీళ్ళ ప్రాయంగా అప్పటికప్పుడు విశ్లేషిస్తారని ఆయన రచనలు చదివిన వారికెవరికైనా అర్థం కావలసిందే! "తల్లి లేని పిల్ల" లో "మనుషుల సంస్కారం"అనే విషయాన్ని విశ్లేషించిన తీరు నేను ఎప్పటికీ అబ్బురపడే విషయమే! కొత్తకోడలు నవల్లో హనుమాయమ్మ గారి పాత్ర ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ దాదాపుగా కనపడే తల్లి పాత్ర!

ఈయన ఇన్ని రకాల మనుషుల్ని ఎప్పుడు చదవగలిగారని విస్మయం కలుగుతుంది. ఎందుకంటే ఒక రచనలో కనిపించిన మనో విశ్లేషణ మరో రచనలో కనిపించదు మరి! ఇటువంటి విస్తృత విశ్లేషణ అనేక కథల్లో, నవలల్లో, నవలికల్లో అసంఖ్యాకంగా చూడొచ్చు! ఎన్నని పేర్కొనగలం?

కుటుంబరావు గాని నవలల మీద పరిశోధన చేయదలిస్తే కొన్ని వందల అంశాల మీద వందల కొద్దీ చేయవచ్చు!

విశాలాంధ్ర  పబ్లిషింగ్ హౌస్ శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వంలో వేసిన సంపుటాలన్నీ చాలా రోజుల క్రితమే అందుబాటులో లేకుండా పోయాయి. ఎప్పుడు అడిగినా సరైన సమాధానం అక్కడ దొరకదు. "వస్తాయండీ" అనో "వేయాలని చూస్తున్నారండీ'అనో "చెప్పలేమండీ" అనో తప్పించి!





ఈ లోపు విరసం ఈ బాధ్యతను తీసుకుని "కొడవటిగంటి రచనా ప్రపంచం" పేరుతో ఆయన రచనలన్నింటినీ 16 సంపుటాలుగా అందుబాటులోకి తీసుకురావాలని తలపెట్టడం శుభపరిణామమే!

మార్చి నెలలో దీనిగురించి వేణువు బ్లాగులో కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో ఒక టపా వచ్చింది. ఆ టపా ద్వారానే నేను ఈ సంపుటాలన్నింటికీ తెప్పించే ఏర్పాటు చేయగలిగాను. ఇప్పటికే నాల్గు సంపుటాలు అందాయి కూడా! ఈ కొత్త సంపుటాల్లో విశాలాంధ్ర సంపుటాల్లో లాగా ఫుట్ నోట్స్ లేవు. వివరాలు అవసరమైన చోట్ల ఆ ఫుట్ నోట్స్ ఉంటే బావుండనిపిస్తుంది. కానీ విశాలాంధ్ర సంపుటాల్లో అవి మరీ ఎక్కువై విసుగెత్తిస్తాయి, కథను పక్కదారి పట్టిస్తూ!

ప్రతి సాహిత్యాభిమాని లైబ్రరీ లోనూ  ఉండదగ్గ ఈ పదహారు సంపుటాలూ ప్రీ-పబ్లికేషన్ ఆఫర్ కింద అసలు ధర కంటే తక్కువ ధరకే లభించే సదుపాయం కూడా ఉంది. ( నాకు అలాగే లభించాయి.) విరసం వేసిన సంపుటాలు కావలసిన వారు పూర్తి వివరాల కోసం "కొడవటిగంటి రచనా ప్రపంచం ". టపాలో చూడవచ్చు!

శ్రీ శ్రీ "మహా ప్రస్థానం"- అంకితం

శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి పేరు ఎరుగని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజ దర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టి వీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవిగా శ్రీ శ్రీ పేరు తెలుగుభాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. ఆయన రచనల్లో 1950 లో ప్రచురించబడిన 'మహాప్రస్థానం' అనే కవితాసంపుటి తెలుగు సాహితీ అభిమానుల మనసుల్లోనే కాకుండా.. సామాన్య ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంత గొప్ప కవితా సంపుటిలోంచి అప్పుడప్పుడూ కొన్నీటిని ఈ బ్లాగులో పెట్టడం ద్వారా అందరికీ ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుందని భావిస్తున్నాను. నేనే స్వయంగా టైపు చేసి పెడుతున్నాను. ఒక వేళ ఇలా పెట్టకూడదు అని ఏమైనా కాపీ రైట్ హక్కులు ఉంటే.. ఎవరైనా మిత్రులు తెలుపగలరు. అప్పుడు నేనే సదరు పోస్టులు తీసేస్తాను.

ఈ 'మహా ప్రస్థానం' పుస్తకంలోని చాలా కవితలను శ్రీ శ్రీ గారు 1930-40 మధ్య కాలంలో వ్రాసారట. ఈ మహాప్రస్థానాన్ని శ్రీ శ్రీ గారు ఆయన మిత్రుడు శ్రీ కొంపెల్ల జనార్ధనరావు గారికి అంకితం చేసారు. ఆ అంకిత వాక్యాలు కూడా కవితా రూపంలోనే స్వయంగా శ్రీ శ్రీ నే వ్రాశారు. ఈ పోస్టులో ఆ కవితను ఇస్తున్నాను. చూడండి మీరే.. వారి స్నేహ బంధాన్ని..!
నేస్తం దూరమైన బాధనీ.. తనతో మాట్లాడుతున్నట్టుగా.. ఎంత గొప్పగా చెప్పారో శ్రీశ్రీ గారో.. మీరే చూడండి.


"మహాప్రస్థానం" కొంపెల్ల జనార్ధన రావు కోసం..

తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...

తలపోసినవేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వు, చేయూతా ఇవ్వక...
మురికితనం కరుకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే...
అటు పోతే, ఇటు పోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి,
ఒక్కణ్ణి చేసి వేధించారని, బాధించారని
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా, నేస్తం!

దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్ళిపోయావా, నేస్తం!
చిరునవులనే పరిషేచన చేస్తూ...

అడుగడుగునా పొడచూసే
అనేకానేక శత్రువులతో,
పొంచి చీకట్లో కరవజూసే,
వంచకాల ఈ లోకంతో పొసగక
అచింతానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్, నేస్తం!
ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకుని...
అన్నీ, తన్నివేశావా నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!

బరంపురంలో మనం ఇంకా
నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
"ఉదయిని" సంచికలు పట్టుకు తిరగడం

జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచిక గూళ్ళేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకోని,
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడున్నామో, ఎక్కడకు పోతామో తెలియని,
ఆవేశంతో,
చుక్కల్లో ఆదర్శాలను లెక్కిస్తూ,
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహదృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించించో, శఠించిందో మనల్ని..
తుదకు నిన్ను విష నాగురలలోకి లాగి,
ఊపిరితిత్తులను కొలిమి తిత్తులుగా చేసి,
మా కళ్ళల్లో గంధక జాలలు,
గుండెల్లో గుగ్గిలపు ధూమం వేసి,
మా దారిలో ప్రశ్నార్ధం చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా
తనువులో అణువణువులో
సంవర్త భయంకర
ఝుంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను..
ఎంత మోగించిందయ్యా మమ్ము..
ఎవరు దుఃఖించారులే నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప...
ఆకాశం పడిపోకుండానే ఉంది..
ఆఫీసులకి సెలవు లేదు..
సారా దుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది..
సానుభూతుల సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం...
ఎవరి పనులలో వాళ్లు..
ఎవరి తొందరలో వాళ్లు..
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒక మాటకు బలి అయితే,
కనబడని ఊహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే, నియంత్రిస్తే..
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయిపోతేనేం నువ్వు?
మా బురద రోజూ హాజరు..
మా బురఖా మేము తగిలించుకున్నాం..
మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ములలాగే..
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు..
లేదు నేస్తం! లేదు
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు..
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము..

ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు..
భయం లేదులే అయినప్పటికీ..
నీ సాహసం ఒక ఉదాహరణ..
నీ జీవితమే ఒరవడి..
నిన్న వదలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు..

కావున ఈ నిరాశామయ లోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను..
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను..
అందుకో ఈ చాచిన హస్తం..
ఆవేశించు నాలో..
ఇలా చూడు నీ కోసం..
ఇదే నా మహాప్రస్థానం..!

-- శ్రీ శ్రీ


* ఏమైనా అక్షర దోషాలు కనిపిస్తే సరిచేయగలరని మనవి.

Tuesday, August 25, 2009

భారతంలోని అద్భుత పద్యాలు

భారతంలోని అద్భుత పద్యాలు



తెలుగు సాహిత్యంలోని అందాన్ని ఆస్వాదించాలంటే పండితుడే కానక్కరలేదు . పురాణ గ్రంధాలైన రామాయణ , మహాభారత, భాగవతాలనుండి ఎన్నో పద్యాలు సామాన్య జన జీవనంలో విరివిగా వాడబడ్డాయి. ఆ మహాకావ్యాలలో ప్రస్తావించబడిన ఎన్నో పద్యాలు ఇప్పటికీ మన నిత్య జీవతంలో అన్వయించుకుంటాము కూడా. పోతన కవిత్వం మాధుర్యానికి పెట్టింది పేరు. భాగవతంలో ఎన్నో పద్యాలు తెలుగునాట ప్రతినోటా నానాయి. అలాంటి కొన్ని భాగవత పద్యాలు చూద్దాం. ఇందులో ఎన్నో పద్యాలు స్కూలులో చదివినవే .ఇవి చదువుతుంటే నా స్కూలు రోజులు గుర్తొచ్చాయి. ప్రతి పరీక్షలో ముందు రాయాల్సిన ప్రతిపదార్ధం . అది మొత్తం కరెక్టుగా రాస్తే వచ్చే ఫుల్ మార్కులు.. ఆ తెలుగు టీచర్. ఆవిడని విసిగించిన సంఘటనలు..


మన సారధి ,మన సచివుడు
మన వియ్యము, మన సఖుండు,మన బాంధవుఁడున్
మన విభుడు, గురువు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా.



తమ నేస్తం, సారధి, మంత్రి లా సలహాలు ఇచ్చినవాడు, వియ్యంకుడు, బందువు ఐన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట అర్జునుడు సర్వం కోల్పోయినవాడై దిగులుగా అన్నతో చెప్పిన మాటలివి. మనకు బాగా కావలసిన వాడు, మిత్రుడు , బంధువు చనిపోయినప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా. మనకు సర్వస్వం ఐన వ్యక్తి దూరమైనపుడు సర్వం శూన్యంగా అనిపిస్తుంది.



ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్


గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం తెలుగువారికి చిరపరిచితమే. మొసలి నోట చిక్కిన గజేంద్రుడు ఆ సర్వేశ్వరుడిని శరణు వేడిన విధంబిది. అసలు భగవంతుడు ఎవ్వడు అనే ప్రశ్నకు సమాధానం ఈ పద్యంలో లభించవచ్చు. ఈ జగత్తు ఉద్భవించడానికి కారణం అతడే, జగం అతనిలో ఉంది. అతనితో ముగుస్తుంది. మొదలు, తుది ..సర్వమూ తానే ఐన ఆ భగవంతుడు తనంతట తానుగా జన్మించినవాడు. సృష్టికి మూలకారణము అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన నిజము. అప్పుడు కాని మనిషిలోని గర్వం అణిగి, తానే గొప్ప అని విర్రవీగడు


వారిజాక్షులందు, వైవాహికములందు
బ్రాణ విత్త మాన భంగములందుఁ
జకితగోకులా గ్రజన్మరక్షణమందు
బొంకవచ్చు, నఘము రాదధిప!


వామనావతార ఘట్టములో దానమడగడానికి వచ్చిన బాలుడు మహావిష్ణువు అని తెలుసుకున్న దానవ గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో ఇలా అన్నాడంట. స్త్రీల విషయములో, వివాహ విషయములో, ప్రాణానికి , సంపదకు, మానమునకు హాని కలిగే సందర్భంలో, గోవులను, బ్రాహ్మణులను రక్షించు సమయములో అబద్ధము ఆడ వచ్చును.అందుకే బలిచక్రవర్తిని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని తన ప్రాణాలు కాపాడుకోమని అద్భుతమైన సలహా ఇచ్చాడు ఆ గురువు. పైగా అది తప్పు కాదంట.. కాని ఇపుడు అవసరానికి అలవోకగా అబద్దాలాడేస్తుంటారు చాలా మంది.



ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు . నిజము మహాత్మా !


శ్రీకృష్ణుడి కుశలము తెలుసుకుని రమ్మని వసుదేవుడు తన పూరోహితుడిని పంపిస్తాడు. అతనికి అతిథి సత్కారాలు చేసి నందుడన్న మాటలివి. ఇప్పటికీ మనం ఎవరైన గొప్పవాళ్లు మన ఇంటికి వస్తే ఊరకరారు మహాత్ములు. మాలాంటి సామాన్యులు, పేదవారింటికి మీలాంటి పెద్దలు రావడం శుభకరం అని అంటారు. ఇందులో అవతలి వ్యక్తి సంపూర్ణ గౌరవంతో అన్నాడా? , వెటకారంగా అన్నాడా అన్నది తెలియడం అవసరం. అది అతని ఉచ్చారణలో తెలిసిపోతుంది. ఏమంటారు.. నిజమేకదా..


ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!


బలి చక్రవర్తి వద్ద మూడడుగులు దానంగా స్వీకరించాక పొట్టి వడుగు వామనుడు భూమిని, ఆకాశాన్ని,మబ్బులను, సూర్యచంద్రులను, ధృవుని, మహాలోకాలన్నింటినీ దాటిపోతూ పెరిగిపోయాడు. ఆ చిన్ని వడుగు ముల్లోకాలన్నీ ఆక్రమించేటంతగా ఎదిగిపోయాడు. "ఇంతింతై వటుడింతై" అనే పదం నానుడిగా మారిపోయింది. ఒక వ్యక్తి క్రమంగా ఎదుగుతూ వృద్ధి చెందినప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోయాడు అని అనడం సర్వ సాధారణం. చిన్ని బాలుడైనా కృషితో వామనుడిలా విశ్వరూపం దాల్చవచ్చు , ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని భావం

భారతంలోని అద్భుత పద్యాలు

భారతంలోని అద్భుత పద్యాలు



తెలుగు సాహిత్యంలోని అందాన్ని ఆస్వాదించాలంటే పండితుడే కానక్కరలేదు . పురాణ గ్రంధాలైన రామాయణ , మహాభారత, భాగవతాలనుండి ఎన్నో పద్యాలు సామాన్య జన జీవనంలో విరివిగా వాడబడ్డాయి. ఆ మహాకావ్యాలలో ప్రస్తావించబడిన ఎన్నో పద్యాలు ఇప్పటికీ మన నిత్య జీవతంలో అన్వయించుకుంటాము కూడా. పోతన కవిత్వం మాధుర్యానికి పెట్టింది పేరు. భాగవతంలో ఎన్నో పద్యాలు తెలుగునాట ప్రతినోటా నానాయి. అలాంటి కొన్ని భాగవత పద్యాలు చూద్దాం. ఇందులో ఎన్నో పద్యాలు స్కూలులో చదివినవే .ఇవి చదువుతుంటే నా స్కూలు రోజులు గుర్తొచ్చాయి. ప్రతి పరీక్షలో ముందు రాయాల్సిన ప్రతిపదార్ధం . అది మొత్తం కరెక్టుగా రాస్తే వచ్చే ఫుల్ మార్కులు.. ఆ తెలుగు టీచర్. ఆవిడని విసిగించిన సంఘటనలు..


మన సారధి ,మన సచివుడు
మన వియ్యము, మన సఖుండు,మన బాంధవుఁడున్
మన విభుడు, గురువు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా.



తమ నేస్తం, సారధి, మంత్రి లా సలహాలు ఇచ్చినవాడు, వియ్యంకుడు, బందువు ఐన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట అర్జునుడు సర్వం కోల్పోయినవాడై దిగులుగా అన్నతో చెప్పిన మాటలివి. మనకు బాగా కావలసిన వాడు, మిత్రుడు , బంధువు చనిపోయినప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా. మనకు సర్వస్వం ఐన వ్యక్తి దూరమైనపుడు సర్వం శూన్యంగా అనిపిస్తుంది.



ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్


గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం తెలుగువారికి చిరపరిచితమే. మొసలి నోట చిక్కిన గజేంద్రుడు ఆ సర్వేశ్వరుడిని శరణు వేడిన విధంబిది. అసలు భగవంతుడు ఎవ్వడు అనే ప్రశ్నకు సమాధానం ఈ పద్యంలో లభించవచ్చు. ఈ జగత్తు ఉద్భవించడానికి కారణం అతడే, జగం అతనిలో ఉంది. అతనితో ముగుస్తుంది. మొదలు, తుది ..సర్వమూ తానే ఐన ఆ భగవంతుడు తనంతట తానుగా జన్మించినవాడు. సృష్టికి మూలకారణము అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన నిజము. అప్పుడు కాని మనిషిలోని గర్వం అణిగి, తానే గొప్ప అని విర్రవీగడు


వారిజాక్షులందు, వైవాహికములందు
బ్రాణ విత్త మాన భంగములందుఁ
జకితగోకులా గ్రజన్మరక్షణమందు
బొంకవచ్చు, నఘము రాదధిప!


వామనావతార ఘట్టములో దానమడగడానికి వచ్చిన బాలుడు మహావిష్ణువు అని తెలుసుకున్న దానవ గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో ఇలా అన్నాడంట. స్త్రీల విషయములో, వివాహ విషయములో, ప్రాణానికి , సంపదకు, మానమునకు హాని కలిగే సందర్భంలో, గోవులను, బ్రాహ్మణులను రక్షించు సమయములో అబద్ధము ఆడ వచ్చును.అందుకే బలిచక్రవర్తిని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని తన ప్రాణాలు కాపాడుకోమని అద్భుతమైన సలహా ఇచ్చాడు ఆ గురువు. పైగా అది తప్పు కాదంట.. కాని ఇపుడు అవసరానికి అలవోకగా అబద్దాలాడేస్తుంటారు చాలా మంది.



ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు . నిజము మహాత్మా !


శ్రీకృష్ణుడి కుశలము తెలుసుకుని రమ్మని వసుదేవుడు తన పూరోహితుడిని పంపిస్తాడు. అతనికి అతిథి సత్కారాలు చేసి నందుడన్న మాటలివి. ఇప్పటికీ మనం ఎవరైన గొప్పవాళ్లు మన ఇంటికి వస్తే ఊరకరారు మహాత్ములు. మాలాంటి సామాన్యులు, పేదవారింటికి మీలాంటి పెద్దలు రావడం శుభకరం అని అంటారు. ఇందులో అవతలి వ్యక్తి సంపూర్ణ గౌరవంతో అన్నాడా? , వెటకారంగా అన్నాడా అన్నది తెలియడం అవసరం. అది అతని ఉచ్చారణలో తెలిసిపోతుంది. ఏమంటారు.. నిజమేకదా..


ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!


బలి చక్రవర్తి వద్ద మూడడుగులు దానంగా స్వీకరించాక పొట్టి వడుగు వామనుడు భూమిని, ఆకాశాన్ని,మబ్బులను, సూర్యచంద్రులను, ధృవుని, మహాలోకాలన్నింటినీ దాటిపోతూ పెరిగిపోయాడు. ఆ చిన్ని వడుగు ముల్లోకాలన్నీ ఆక్రమించేటంతగా ఎదిగిపోయాడు. "ఇంతింతై వటుడింతై" అనే పదం నానుడిగా మారిపోయింది. ఒక వ్యక్తి క్రమంగా ఎదుగుతూ వృద్ధి చెందినప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోయాడు అని అనడం సర్వ సాధారణం. చిన్ని బాలుడైనా కృషితో వామనుడిలా విశ్వరూపం దాల్చవచ్చు , ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని భావం

Friday, June 26, 2009

తేనె చినుకు తెలుగు పలుకు

తేనె చినుకు తెలుగు పలుకు...

"తరిపి వెన్నెల ఆణిముత్యాల జిలుగు, పునుగు జవ్వాజి ఆమని పూల వలపు, మురళి రవళులు కస్తూరి పరిమళములు కలిసి యేర్పడె సుమ్ము మా తెలుగు బాస!" అంటూ తెలుగు భాష స్నిగ్ద సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పారో కవి.మనదేశంలో ప్రాచుర్యంలో ఉన్న భాషలు ఎన్నో ఉన్నాయి. ఏ భాష గొప్పదనం, అందం ఆ భాషవే. ఐతే తెలుగు భాషకో ప్రత్యేకత ఉంది.ధేశ భాషలందు తెలుగు లెస్స- అంటూ తాను స్వయంగా కన్నడ ప్రభువు అయిఉండీ తెనుగును ప్రస్తుతించారు శ్రీకృష్ణదేవరాయలు. 'ఆముక్తమాల్యద' అనే అద్భుతమైన తెలుగు ప్రబంధాన్ని రాశారాయన. రాయలవారు నిర్వహించిన భువనవిజయపు కవితా గోష్టులను ఈనాటికీ స్మరించుకుంటూనే ఉన్నాం. ఆంధ్రభూమి సస్యశ్యామలమైంది. గోదవరి,కృష్ణ, పెన్న వంటి జీవనదుల విహార భూమి. నిండారు పారు అఖండ గోదావరీ తీరంలోనే ఆంద్ర మహాభారతం రూపుదిద్దుకొంది.కృష్ణాతీరంలో సంకల్పం చెప్పుకొనే భాగవత మహాకావ్యాన్ని ఒంటిచేత్తో పూర్తి చేసారు బమ్మెర పోతన కవి. తెలుగులో వచ్చిన రామాయణ కావ్యాలకు లెక్కేలేదు. తెలుగు భాషతోపాటు ఆంద్ర సాహిత్యానికి ఘనమైన పూర్వచరిత్రే ఉంది. "ప్రాకృత పదమంజరీ కంఠముల హాలుడమృత కావ్య ప్రసాడములు పంచె, భౌధ్ధ సూత్రార్థముల్ ప్రవచించి నాగార్జునుండహింసా ధర్మకాండ నిలిపె, కన్నడనుడికి వంకలు తీర్చి పంపడు తొలకరి రచనకు త్రోవదీసె-" అంటూ ఆంధ్ర భాష సాదించిన విజయాలను అక్షరబధ్ధం చేశారు రాయప్రోలువారు. తెలుగు పాటే తమిళులను మహాగాయకులుగా తీర్చిదిద్దిన వైనం చారిత్రకసత్యమే.

హిందీ తరువాత మనడేశంలో అత్యధిక సంఖ్యకులు మాట్లేడిది తెలుగే ఐనా, 'ఇటాలిఅన్ ఆఫ్ ది ఈస్ట్' అంటూ మన భాష సౌందర్యాన్ని పాశ్చాత్య దేశాలవారు సైతం అభినందించినా తెలుగు గతిరీతులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. తమిళులకు కన్నడిగులకు తమ మాతృభాషపై ఉన్న గౌరవం తెలుగువారికి తమ భాషపై లేదు.పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఒకటి తెలుగులో ఉంది. తెలుగులో ఇంకా ఎన్నో సామెతలున్నా తెలుగు వారికి మాత్రం ఈ సామెతంటేనే ఎక్కువ ఇష్టమేమో! పరాయి భాషలపై చూపే మోజును మనవాళ్ళు తెలుగుపై చూపరు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా సొంత భషను మరిచిపోకూడదన్న సూత్రాన్ని అసలు పట్టించుకోనిది తెలుగువారే. చెన్నైలో ఉండే తెలుగువారు తమిళులను మించి అరవంలో దడదడలాడిస్తారు. కోనసీమనుంచొచ్చినా హైదరాబాద్ లో అడుగుపెట్టేసరికి -క్యా భాయ్- అంటూ హిందీ షోకులు ఒలకపోస్తారు. పదిరోజుల విహార యాత్రకని కోల్ కతా వెళ్ళినవారు తిరిగి వచ్చేటప్పుడు బెంగాలీ యాసను ఒంటపట్టించుకొనే వస్తారు. ఇద్దరు తమిళులు కలుసుకొన్నప్పుడు- వణక్కం- అన్న పలకరింపుతో సంభాషణ ప్రారంభమౌతుంది.ఇద్దరు కన్నడిగులు కలుసుకొన్నప్పుడు- నమస్కార- అన్న మాటతోనే సంభాషణ సాగుతుంది. అదే ఇద్దరు తెలుగువాళ్ళు ఎదురైతే- గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఈవినింగ్ అనో లేదా "హలో... హౌ ఆర్యూ" అనో సంభాషణ మొదలవుతుంది. తెలుగు ఇళ్ళల్లోను స్కూళ్ళల్లోను రాజ్యం చేస్తున్నది ఆంగ్లమే. పరాయిభాషలు నేర్చుకోవద్దని ఎవరూ అనరు. మాతృభాషను నిర్లక్ష్య్యం చేయకూడదు.

తమిళులు పట్టుబట్టి తమ భాషకు ప్రాచీన భాషగా గుర్తింపును సాధించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్కృతం, తమిళ భాషలను గురించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగినా తెలుగుకు ఆ హోదా లభించలేదు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు మూడింటిలోను ఒక శతాబ్ది అటూ ఇటూగా సాహిత్య ఆవిర్భవించిందని చెప్పటానికి తగిన చారిత్రకాధారాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. తమిళ వాఙ్మయంలో అతి ప్రాచీన మైనదిగా భావించే 'అగత్తియం' అనే లాక్షణిక గ్రంథంలో "కొంగణం కన్నడం కొల్లం తెలుంగుం" అనే సూత్రం ఉంది. అమరావతి స్థూపంపైన ఒక రాతి పలక మీద చెక్కిఉన్న 'నాగబు' అనే పదమే తొలి తెలుగు పదమని భావిస్తున్నారు. అతి ప్రాచీనమైన అమరావతి స్థూప నిర్మాణం మూడు అంచెలుగా క్రీస్తుపూర్వం 200 మొదలుకొని క్రీస్తుశకం 200 మధ్య కాలంలో జరిగినట్లుగా పరిశోధకులు గుర్తించారు. క్రీస్తుశకం మూడవ శతాబ్ది నుంచి అప్పటి రాజులు వేయించిన శిలాశాసనాల్లో తెలుగు పదాలు అనేకం ఉన్నాయి. ఈ విశేషాలన్నీ ప్రాచీనత విషయంలో తమిళ, కన్నడ వంటి ఇతర ద్రావిడ భాషలకు తీసిపోదని ఋజువు చేసేవే. ఐతే భాషాభిమానం అధికంగా ఉన్న తమిళ నాయకులు పట్టుబట్టి తమ భాషకు ప్రాచీన భాషగా గుర్తింపును సాధించుకొన్నారు. ఇన్నాళ్ళూ ఈ విషయంపై దృష్టిని సారించని మన నాయకులు తమిళానికి ఆ హోదా లభించాకనే తెలుగుకూ అటువంటి హోదా కల్పించాలని హడావుడీ పడిపోతున్నారు. ఇకనైనా- ఇళ్ళల్లోను విద్యాసంస్థల్లోను తెలుగు భాషకు సముచిత స్థానం దక్కేలా జాగ్రత్తపడాలి. ఎంత ఆంగ్ల మాధ్యంలో చదువుకుంటున్నా మన పిల్లలు ఇంట్లో చక్కని తెలుగు మాట్లాడటం, తెలుగు పుస్తకాలు చదవటం, తెలుగు సాహిత్యం పట్ల అభిమానం పెంచుకోవడం అవసరం. 'తేనె చినుకు కులుకు తెలుగు పలుకు' అని మనవారు మనస్పూర్తిగా గ్రహించినప్పుడే తెలుగు భాష మూడు పువ్వులూ ఆరు కాయలుగా వికసిస్తుంది. ప్రాచీన భాష హోదాతోపాటు దేశ భాషలలో తగిన గౌరవాన్ని సంపాదించుకోగలుగుతుంది!
(The editorial in the EENAADU/26:03:2006)

తేనె చినుకు తెలుగు పలుకు

తేనె చినుకు తెలుగు పలుకు...

"తరిపి వెన్నెల ఆణిముత్యాల జిలుగు, పునుగు జవ్వాజి ఆమని పూల వలపు, మురళి రవళులు కస్తూరి పరిమళములు కలిసి యేర్పడె సుమ్ము మా తెలుగు బాస!" అంటూ తెలుగు భాష స్నిగ్ద సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పారో కవి.మనదేశంలో ప్రాచుర్యంలో ఉన్న భాషలు ఎన్నో ఉన్నాయి. ఏ భాష గొప్పదనం, అందం ఆ భాషవే. ఐతే తెలుగు భాషకో ప్రత్యేకత ఉంది.ధేశ భాషలందు తెలుగు లెస్స- అంటూ తాను స్వయంగా కన్నడ ప్రభువు అయిఉండీ తెనుగును ప్రస్తుతించారు శ్రీకృష్ణదేవరాయలు. 'ఆముక్తమాల్యద' అనే అద్భుతమైన తెలుగు ప్రబంధాన్ని రాశారాయన. రాయలవారు నిర్వహించిన భువనవిజయపు కవితా గోష్టులను ఈనాటికీ స్మరించుకుంటూనే ఉన్నాం. ఆంధ్రభూమి సస్యశ్యామలమైంది. గోదవరి,కృష్ణ, పెన్న వంటి జీవనదుల విహార భూమి. నిండారు పారు అఖండ గోదావరీ తీరంలోనే ఆంద్ర మహాభారతం రూపుదిద్దుకొంది.కృష్ణాతీరంలో సంకల్పం చెప్పుకొనే భాగవత మహాకావ్యాన్ని ఒంటిచేత్తో పూర్తి చేసారు బమ్మెర పోతన కవి. తెలుగులో వచ్చిన రామాయణ కావ్యాలకు లెక్కేలేదు. తెలుగు భాషతోపాటు ఆంద్ర సాహిత్యానికి ఘనమైన పూర్వచరిత్రే ఉంది. "ప్రాకృత పదమంజరీ కంఠముల హాలుడమృత కావ్య ప్రసాడములు పంచె, భౌధ్ధ సూత్రార్థముల్ ప్రవచించి నాగార్జునుండహింసా ధర్మకాండ నిలిపె, కన్నడనుడికి వంకలు తీర్చి పంపడు తొలకరి రచనకు త్రోవదీసె-" అంటూ ఆంధ్ర భాష సాదించిన విజయాలను అక్షరబధ్ధం చేశారు రాయప్రోలువారు. తెలుగు పాటే తమిళులను మహాగాయకులుగా తీర్చిదిద్దిన వైనం చారిత్రకసత్యమే.

హిందీ తరువాత మనడేశంలో అత్యధిక సంఖ్యకులు మాట్లేడిది తెలుగే ఐనా, 'ఇటాలిఅన్ ఆఫ్ ది ఈస్ట్' అంటూ మన భాష సౌందర్యాన్ని పాశ్చాత్య దేశాలవారు సైతం అభినందించినా తెలుగు గతిరీతులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. తమిళులకు కన్నడిగులకు తమ మాతృభాషపై ఉన్న గౌరవం తెలుగువారికి తమ భాషపై లేదు.పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఒకటి తెలుగులో ఉంది. తెలుగులో ఇంకా ఎన్నో సామెతలున్నా తెలుగు వారికి మాత్రం ఈ సామెతంటేనే ఎక్కువ ఇష్టమేమో! పరాయి భాషలపై చూపే మోజును మనవాళ్ళు తెలుగుపై చూపరు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా సొంత భషను మరిచిపోకూడదన్న సూత్రాన్ని అసలు పట్టించుకోనిది తెలుగువారే. చెన్నైలో ఉండే తెలుగువారు తమిళులను మించి అరవంలో దడదడలాడిస్తారు. కోనసీమనుంచొచ్చినా హైదరాబాద్ లో అడుగుపెట్టేసరికి -క్యా భాయ్- అంటూ హిందీ షోకులు ఒలకపోస్తారు. పదిరోజుల విహార యాత్రకని కోల్ కతా వెళ్ళినవారు తిరిగి వచ్చేటప్పుడు బెంగాలీ యాసను ఒంటపట్టించుకొనే వస్తారు. ఇద్దరు తమిళులు కలుసుకొన్నప్పుడు- వణక్కం- అన్న పలకరింపుతో సంభాషణ ప్రారంభమౌతుంది.ఇద్దరు కన్నడిగులు కలుసుకొన్నప్పుడు- నమస్కార- అన్న మాటతోనే సంభాషణ సాగుతుంది. అదే ఇద్దరు తెలుగువాళ్ళు ఎదురైతే- గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఈవినింగ్ అనో లేదా "హలో... హౌ ఆర్యూ" అనో సంభాషణ మొదలవుతుంది. తెలుగు ఇళ్ళల్లోను స్కూళ్ళల్లోను రాజ్యం చేస్తున్నది ఆంగ్లమే. పరాయిభాషలు నేర్చుకోవద్దని ఎవరూ అనరు. మాతృభాషను నిర్లక్ష్య్యం చేయకూడదు.

తమిళులు పట్టుబట్టి తమ భాషకు ప్రాచీన భాషగా గుర్తింపును సాధించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్కృతం, తమిళ భాషలను గురించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగినా తెలుగుకు ఆ హోదా లభించలేదు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు మూడింటిలోను ఒక శతాబ్ది అటూ ఇటూగా సాహిత్య ఆవిర్భవించిందని చెప్పటానికి తగిన చారిత్రకాధారాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. తమిళ వాఙ్మయంలో అతి ప్రాచీన మైనదిగా భావించే 'అగత్తియం' అనే లాక్షణిక గ్రంథంలో "కొంగణం కన్నడం కొల్లం తెలుంగుం" అనే సూత్రం ఉంది. అమరావతి స్థూపంపైన ఒక రాతి పలక మీద చెక్కిఉన్న 'నాగబు' అనే పదమే తొలి తెలుగు పదమని భావిస్తున్నారు. అతి ప్రాచీనమైన అమరావతి స్థూప నిర్మాణం మూడు అంచెలుగా క్రీస్తుపూర్వం 200 మొదలుకొని క్రీస్తుశకం 200 మధ్య కాలంలో జరిగినట్లుగా పరిశోధకులు గుర్తించారు. క్రీస్తుశకం మూడవ శతాబ్ది నుంచి అప్పటి రాజులు వేయించిన శిలాశాసనాల్లో తెలుగు పదాలు అనేకం ఉన్నాయి. ఈ విశేషాలన్నీ ప్రాచీనత విషయంలో తమిళ, కన్నడ వంటి ఇతర ద్రావిడ భాషలకు తీసిపోదని ఋజువు చేసేవే. ఐతే భాషాభిమానం అధికంగా ఉన్న తమిళ నాయకులు పట్టుబట్టి తమ భాషకు ప్రాచీన భాషగా గుర్తింపును సాధించుకొన్నారు. ఇన్నాళ్ళూ ఈ విషయంపై దృష్టిని సారించని మన నాయకులు తమిళానికి ఆ హోదా లభించాకనే తెలుగుకూ అటువంటి హోదా కల్పించాలని హడావుడీ పడిపోతున్నారు. ఇకనైనా- ఇళ్ళల్లోను విద్యాసంస్థల్లోను తెలుగు భాషకు సముచిత స్థానం దక్కేలా జాగ్రత్తపడాలి. ఎంత ఆంగ్ల మాధ్యంలో చదువుకుంటున్నా మన పిల్లలు ఇంట్లో చక్కని తెలుగు మాట్లాడటం, తెలుగు పుస్తకాలు చదవటం, తెలుగు సాహిత్యం పట్ల అభిమానం పెంచుకోవడం అవసరం. 'తేనె చినుకు కులుకు తెలుగు పలుకు' అని మనవారు మనస్పూర్తిగా గ్రహించినప్పుడే తెలుగు భాష మూడు పువ్వులూ ఆరు కాయలుగా వికసిస్తుంది. ప్రాచీన భాష హోదాతోపాటు దేశ భాషలలో తగిన గౌరవాన్ని సంపాదించుకోగలుగుతుంది!
(The editorial in the EENAADU/26:03:2006)

చక్కని తెలుగుకు చాంగుభళా

చక్కని తెలుగుకు చాంగుభళా!

- రావూరి ప్రసాద్‌
మేడలా, మిద్దెలా, కరెన్సీ నోట్లా, కనకాభరణాలా... ఏది నిజమైన ఆస్తి?

ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే-
'ఎవరికైనా ఆస్తిఏముంటుంది? సంగీతంలో సప్తస్వరాలు సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు!'

నిజం. అసంఖ్యాకమైన రాగాలకు ఊపిరిలూదిన ఏడంటే ఏడు స్వరాలకంటే, అసమానమైన రసరమ్య కావ్యాలెన్నింటికో రెక్కలు తొడిగిన యాభైరెండు అక్షరాలకంటే వేరే కలిమి ఎవరికైనా ఏముంటుంది?

అవును. అజరామరమైన ఆ సప్తస్వరాలే తెలుగువాడిగా నా ఆస్తి! అక్షయమైన ఆ యాభైరెండు అక్షరాలే తెలుగువాడిగా నా ఆస్తి!

పట్టుతేనెలోని మధురిమను చిలకరించే నా తెలుగు అక్షరాలకు సాటిరాగల మేడలేవి?

వెన్నెల జలపాతాన్ని కురిపించే నా తెలుగు పదం వన్నెచిన్నెలకు ఏ కనకాభరణాల మిలమిలలు సరితూగగలవు?

నింగీ, నేలా నడుమ నిలువెత్తు సంతకమై నిలిచిన నా తెలుగు వాక్యం ఠీవికి ఏ ఆకాశహర్మ్యం సొగసులు దీటు కాగలవు?

ఆమని సౌందర్యాన్ని తన అక్షరాల్లో సాక్షాత్కరింపజేసే నా తెలుగు 'సరస్వతమ్మ' పలుకుల కలరవాలకు ఎన్ని కరెన్సీ నోట్ల రెపరెపలు సరిపోలగలవు?

రామకథా 'రాగసుధాపానముచేసి' తెలుగు మనసు రంజిల్లడానికి త్యాగయ్య నాదమయం చేసిన సంగీతార్ణవంలోని సప్తస్వరాల క్షీరధారలు నా తెలుగు అక్షరాలు-

తెలుగునేల చీకట్లను పారదోలడానికి వేల సంకీర్తనల్లో అన్నమయ్య వెలిగించిన 'వెన్నెలవంటి శ్రీవేంకటేశు మంత్రము'లోని మణిదీప్తులు నా తెలుగు అక్షరాలు-

మాధవస్వామికి క్షేత్రయ్య అలదిన మధుర పద భక్తిచందనంలోని పరిమళాలు నా తెలుగు అక్షరాలు-

ప్రభువులు సాక్షాత్తు దైవాంశ సంభూతులేనని భావించే కాలంలోనే 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ 'పాలక దేవుళ్ల' నిజరూపాన్ని బయటపెట్టిన పోతన ధిక్కార గళంలోని రణన్నినాదాలు నా తెలుగు అక్షరాలు-

'రాజుల్‌ మత్తులు' అంటూ ఆ రోజుల్లోనే ఎలుగెత్తిన ధూర్జటి ఘంటారావంలోని గర్జనలు నా తెలుగు అక్షరాలు-

'మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని చాటి దోపిడీలకు, అసమానతలకు, దౌర్జన్యాలకు తావులేని 'మరో ప్రపంచం' వైపు పదండి ముందుకు అంటూ శ్రీశ్రీ క్రాంతి గానం మీటిన కత్తి అంచులమీది తళతళలు నా తెలుగు అక్షరాలు-

'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అంటూ వైతాళికుడు గురజాడ వందేళ్ల క్రితమే నినదించిన భవిష్య వాక్కులు నా తెలుగు అక్షరాలు-

నన్నెచోడుని నుంచి నవయుగ కవిచక్రవర్తి జాషువా దాకా, కవిత్రయం నుంచి కృష్ణశాస్త్రి దాకా, వేమన నుంచి విశ్వనాథ దాకా ఎందరెందరో సాహితీ సారస్వతమూర్తులు తమ అమృత కరస్పర్శతో సుసంపన్నం చేసిన తెలుగు అక్షర భాండాగారం మన ఆస్తి!



ద్వారం వెంకటస్వామి నుంచి జనార్దన్‌ వరకు, ఈమని శంకరశాస్త్రి నుంచి షేక్‌ చినమౌలానా వరకు; బాలమురళీకృష్ణ నుంచి నూకల చినసత్యనారాయణ వరకు ఎందరో నాద, గాన యోగులు తమ వేళ్ల కొసలతో, గాత్రమాధుర్యంతో సంపద్వంతం చేసిన సంగీత రసధుని మన ఆస్తి!

ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. 'జాను తెనుగే మేము- జాతి ఘనతే మేము' అంటూ మల్లాది రామకృష్ణశాస్త్రి మోగించిన తెలుగు జయభేరిని సగౌరవంగా అందుకుంటూ తెలుగువారిలో ప్రతి ఒక్కరూ సగర్వంగా ముందుకు సాగాలి!
(Eenadu, 07:11:2008)

చక్కని తెలుగుకు చాంగుభళా

చక్కని తెలుగుకు చాంగుభళా!

- రావూరి ప్రసాద్‌
మేడలా, మిద్దెలా, కరెన్సీ నోట్లా, కనకాభరణాలా... ఏది నిజమైన ఆస్తి?

ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే-
'ఎవరికైనా ఆస్తిఏముంటుంది? సంగీతంలో సప్తస్వరాలు సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు!'

నిజం. అసంఖ్యాకమైన రాగాలకు ఊపిరిలూదిన ఏడంటే ఏడు స్వరాలకంటే, అసమానమైన రసరమ్య కావ్యాలెన్నింటికో రెక్కలు తొడిగిన యాభైరెండు అక్షరాలకంటే వేరే కలిమి ఎవరికైనా ఏముంటుంది?

అవును. అజరామరమైన ఆ సప్తస్వరాలే తెలుగువాడిగా నా ఆస్తి! అక్షయమైన ఆ యాభైరెండు అక్షరాలే తెలుగువాడిగా నా ఆస్తి!

పట్టుతేనెలోని మధురిమను చిలకరించే నా తెలుగు అక్షరాలకు సాటిరాగల మేడలేవి?

వెన్నెల జలపాతాన్ని కురిపించే నా తెలుగు పదం వన్నెచిన్నెలకు ఏ కనకాభరణాల మిలమిలలు సరితూగగలవు?

నింగీ, నేలా నడుమ నిలువెత్తు సంతకమై నిలిచిన నా తెలుగు వాక్యం ఠీవికి ఏ ఆకాశహర్మ్యం సొగసులు దీటు కాగలవు?

ఆమని సౌందర్యాన్ని తన అక్షరాల్లో సాక్షాత్కరింపజేసే నా తెలుగు 'సరస్వతమ్మ' పలుకుల కలరవాలకు ఎన్ని కరెన్సీ నోట్ల రెపరెపలు సరిపోలగలవు?

రామకథా 'రాగసుధాపానముచేసి' తెలుగు మనసు రంజిల్లడానికి త్యాగయ్య నాదమయం చేసిన సంగీతార్ణవంలోని సప్తస్వరాల క్షీరధారలు నా తెలుగు అక్షరాలు-

తెలుగునేల చీకట్లను పారదోలడానికి వేల సంకీర్తనల్లో అన్నమయ్య వెలిగించిన 'వెన్నెలవంటి శ్రీవేంకటేశు మంత్రము'లోని మణిదీప్తులు నా తెలుగు అక్షరాలు-

మాధవస్వామికి క్షేత్రయ్య అలదిన మధుర పద భక్తిచందనంలోని పరిమళాలు నా తెలుగు అక్షరాలు-

ప్రభువులు సాక్షాత్తు దైవాంశ సంభూతులేనని భావించే కాలంలోనే 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ 'పాలక దేవుళ్ల' నిజరూపాన్ని బయటపెట్టిన పోతన ధిక్కార గళంలోని రణన్నినాదాలు నా తెలుగు అక్షరాలు-

'రాజుల్‌ మత్తులు' అంటూ ఆ రోజుల్లోనే ఎలుగెత్తిన ధూర్జటి ఘంటారావంలోని గర్జనలు నా తెలుగు అక్షరాలు-

'మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని చాటి దోపిడీలకు, అసమానతలకు, దౌర్జన్యాలకు తావులేని 'మరో ప్రపంచం' వైపు పదండి ముందుకు అంటూ శ్రీశ్రీ క్రాంతి గానం మీటిన కత్తి అంచులమీది తళతళలు నా తెలుగు అక్షరాలు-

'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అంటూ వైతాళికుడు గురజాడ వందేళ్ల క్రితమే నినదించిన భవిష్య వాక్కులు నా తెలుగు అక్షరాలు-

నన్నెచోడుని నుంచి నవయుగ కవిచక్రవర్తి జాషువా దాకా, కవిత్రయం నుంచి కృష్ణశాస్త్రి దాకా, వేమన నుంచి విశ్వనాథ దాకా ఎందరెందరో సాహితీ సారస్వతమూర్తులు తమ అమృత కరస్పర్శతో సుసంపన్నం చేసిన తెలుగు అక్షర భాండాగారం మన ఆస్తి!



ద్వారం వెంకటస్వామి నుంచి జనార్దన్‌ వరకు, ఈమని శంకరశాస్త్రి నుంచి షేక్‌ చినమౌలానా వరకు; బాలమురళీకృష్ణ నుంచి నూకల చినసత్యనారాయణ వరకు ఎందరో నాద, గాన యోగులు తమ వేళ్ల కొసలతో, గాత్రమాధుర్యంతో సంపద్వంతం చేసిన సంగీత రసధుని మన ఆస్తి!

ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. 'జాను తెనుగే మేము- జాతి ఘనతే మేము' అంటూ మల్లాది రామకృష్ణశాస్త్రి మోగించిన తెలుగు జయభేరిని సగౌరవంగా అందుకుంటూ తెలుగువారిలో ప్రతి ఒక్కరూ సగర్వంగా ముందుకు సాగాలి!
(Eenadu, 07:11:2008)

పూర్వ వైభవంతో నవ ప్రాభవం

పూర్వ వైభవంతో నవ ప్రాభవం!

ఎందరో మహానుభావులు... అందరూ విజయసారథులే!

డాక్టర్‌ యు.ఎ.నరసింహమూర్తి

(రచయిత విజయనగరం మహారాజ కళాశాల (విశ్రాంత)
తెలుగు శాఖాధ్యక్షులు)


'ఇది విభాత మహోత్సవమ్మేమొ! ఇదియు
నూత్న కల్యాణ తూర్య మనోజ్ఞ గాన
నృత్య కోలాహలమ్మొకో! ఇది సువర్ణ
మంగళాక్షతా శీర్వర్ష మగునొ, కాదొ!'

అన్న కృష్ణశాస్త్రి పద్యం స్మరణకు వస్తోంది. తెలుగు భాషకు కాలం కలిసి వచ్చింది. తోటి భాషల సరసన తలఎత్తుకుని నిలవగలిగింది. ప్రజల కోరిక, ఉద్యమకారుల కృషి, ప్రభుత్వం ఒత్తిడి, ఎన్నికలవేళ, రాజకీయాల్లో మార్పులు- ఇలా ఇన్ని కారణాలు ఒక్క ఉదుటున ముసురుకుని వచ్చిన కారణంగా తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి దక్కింది. ఇది తెలుగు ప్రజల సమష్టి విజయం. ఏ ఒక్కరి దయాధర్మభిక్షగా లభించిన వరం కాదు. ఇంతకాలం మనం పోగొట్టుకున్న ప్రతిష్ఠను తిరిగి మనమే నిలుపుకొన్నాం. ఈ తరుణంలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల ప్రాచీన ప్రాభవం ఏమిటో, తెలుగువారి చరిత్ర ఏమిటో తేటతెల్లం చేసి మనకు అందించిన మహానుభావులెందరికో మనం కృతజ్ఞతలను ప్రకటించుకోవలసి ఉంది.

నిస్వార్థ పరిశోధనల ఫలం
మన జాతి- బ్రాహ్మణాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నకాలం నుంచీ ఉంది. మన భాష మూడువేల ఏళ్లనుంచి కనిపిస్తూంది. మన సాహిత్యం నన్నయకు ముందు కాలంనుంచి ఉంది. మన చరిత్ర శాతవాహనుల కాలం నుంచి స్ఫుటంగా కనిపిస్తుంది- ఇలా ఇన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? నూటయాభై ఏళ్లకు ముందు తెలుగు ప్రజలకు ఈ విషయాలన్నీ ఇంత వివరంగా తెలియవు. అప్పుడు దొరికేవన్నీ తాటాకుల పుస్తకాలు, రాళ్లమీద, రాగిరేకుల మీద చెక్కిన శాసనాలు మాత్రమే. అవన్నీ ఎక్కడెక్కడో చీకటి కొట్లలో నిద్రిస్తూ ఉండేవి. తాటాకుల పుస్తకాల్లోని లిపిని అర్థం చేసుకోవడం అందరికీ తెలిసేది కాదు. ఆ రాసే విధానం వేరు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కవిధంగా ఉండేది. తెలుగే అయినా లిపిలో ఎన్నో తేడాలుండేవి. అన్నమయ్య రాసిన 32వేల కీర్తనలు చెక్కిన రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడిఉన్న సంగతి 70 ఏళ్లకు పూర్వం ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఆ దశలోనే ఉండిపోతే ఈ భాష ప్రాభవం ఇప్పటివాళ్లకు తెలిసేది కాదు. మన చరిత్ర, సంస్కృతి మనకు అందేవికావు.

'యావద్భారత వర్షమున- దేశ భాషలలో నగ్రగణ్యమై, లోకోత్తరమైన సంస్కృతభాషతో సమాన ప్రతిపత్తి గడించి అతి విస్తృతమై, అపారమై, బహుముఖ సాహిత్య ప్రక్రియలతో భారత జాతీయ భాషగా రూపొందదగిన తెలుగు భాషా విశిష్టత, వ్యక్తిత్వము వెలుగులోనికి వచ్చుట లేదు. మౌలిక పరిశోధనయనగా అముద్రితములైన తాళపత్ర గ్రంథ పరిశోధన. వాఞ్మయ చరిత్రకు ప్రాచీన కవుల కృతులే ప్రాతిపదికలు, ప్రధానాధారములు. తెలుగు భాషలో పూర్వకవి కృతులన్నియు తాళపత్ర గ్రంథములలో నిక్షిప్తములై యున్నవి. అందువలన తెలుగు వాఞ్మయ చరిత్ర అముద్రితములైన తాళపత్ర గ్రంథములపైనే పూర్తిగా ఆధారపడి యున్నదనుట నిర్వివాదాంశము' అని నిడుదవోలు వేంకటరావు అన్నారు. ఆ మౌలిక పరిశోధన 19వ శతాబ్ది చివరి పాదం నుంచి మొదలైంది. ఆనాటి పరిశోధకులకు నేటి పరిశోధకులకుండే వనరులేవీ ఉండేవి కావు. ఎందరెందరో మహానుభావులు ఎన్నో చిక్కులను ఎదుర్కొని, స్వార్థం లేకుండా, బతుకు ఈడ్వడానికి చాలిన జీతాలు లేకపోయినా తొట్టతొలి పరిశోధనలను పట్టుదలతో కొనసాగించారు. వారిలో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, జయంతి రామయ్య, వేదం వెంకటరాయశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమర్రాజు లక్ష్మణరావు, నేలటూరి వెంకటరమణయ్య, చిలుకూరి వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఖండవల్లి లక్ష్మీరంజనం, నిడుదవోలు వేంకటరావు, తిరుమల రామచంద్ర వంటివారు ప్రముఖులు. వీరందరి కంటే ముందుగా బ్రౌన్‌దొర మాట చెప్పుకోవాలి. వీరందరూ కొనసాగించిన పరిశోధనలు, పరిష్కరణల కారణంగా వెలుగుచూడని ఎన్నో గ్రంథాలు ముద్రణ భాగ్యానికి నోచుకొని ఈ అమూల్య వారసత్వం మనకు దక్కింది. ఇప్పుడు వారందరినీ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వారి సేవలను మననం చేసుకోవాలి. వారిని ఆరాధించాలి. 1850-1950 మధ్యకాలంలో ఇంతటి కృషి జరిగి ఉండకపోతే మనకు గతం లేదు, భవిష్యత్తు లేదు.

ఒకపక్క అన్ని రంగాల్లోను తెలుగు ప్రాచీనతను వెల్లడించి దాన్ని ఎప్పటికీ నష్టపోకుండా కాపాడుకోవాలి. ఇంకొకపక్క తెలుగువారు అన్ని రంగాల్లోను ఆధునిక ప్రపంచంలో పోటీకి దిగాలి. భాష- సాహిత్యం- కళలు- విజ్ఞానం- సంస్కృతి- ఇలా అన్ని విషయాల్లోను ఈ పరిస్థితి ఉంది. మన తెలుగు పెద్దలు ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నారు. పండితులు, పరిశోధకులు, పరిష్కర్తలు, చరిత్ర పరిశోధకులు ఇందులో మొదటి భాగంకోసం ఆకలి, నిద్ర అని చూడకుండా; సంసారం- స్వార్థం పట్టించుకోకుండా, విసుగూ విరామం లేకుండా కృషిచేశారు. మన భాషను, సాహిత్యాన్ని ఆధునికం చేయడానికి గిడుగు, గురజాడల మార్గాన్ని అనుసరించి ఎందరో పాటుపడ్డారు. రచయితలు అటు సంప్రదాయ మార్గంలోను, ఇటు ఆధునిక మార్గంలోను ఆకుల మీద ఒకరు నడిస్తే చిగుళ్లమీద ఇంకొకరు నడిచి ఒకరు గనులను తవ్వి రత్నాలు రాసులుపోస్తే ఇంకొకరు మెట్ట-పల్లం ఏకం చేసి రాజనాలు పండించారు. వీరందరి కృషిని వ్యాప్తి చేయడానికి ప్రజలందరూ తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల మీద ఆసక్తి, అభిమానం, గౌరవం పెంచుకోవడానికి పత్రికలు మరువలేని కృషిచేశాయి. సరస్వతి, చింతామణి, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, అముద్రిత గ్రంథ చింతామణి, గృహలక్ష్మి, రెడ్డిరాణి, భారతి, త్రిలిజ్ఞ, తెలుగు జనానా, కల్పలత, ఆంధ్రభారతి, సువర్ణలేఖ, కృష్ణాపత్రిక, సాహితి, గోల్కొండ పత్రిక, ప్రబుద్ధాంద్ర- వంటి పత్రికలెన్నో లేకపోతే మన ప్రాచీన, ఆధునిక భాషా సాహిత్యాలు ఇంతగా అభివృద్ధి పొంది ఉండేవికావు. ఈ తరం వారికి ఆ పత్రికల పేర్లు తెలియవు. రూపురేఖలు తెలియవు. అవి నడిచిన తీరుతెన్నులు తెలియవు. కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు (పోలవరం జమీందారు), వీరేశలింగం, గిడుగు, అక్కిరాజు ఉమాకాన్తమ్‌, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, కాశీనాథుని నాగేశ్వరరావు, ఆండ్ర శేషగిరిరావు, ముట్నూరు కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ఎందరో ప్రముఖ పత్రికా వ్యవస్థాపకులు, సంపాదకుల గురించి ఈతరం వారికి బాగా తెలియదు. తెలుగు విశ్వవిద్యాలయం వారుగాని, తెలుగు అకాడమీ వారుగాని ఆ కాలంలోని పత్రికల ముఖపత్రాలను దొరికిన మేరకు సేకరించి ఆ పత్రికల చరిత్రను- చేసిన సేవను గురించి సంగ్రహ వ్యాసాలు రాయించి నేటితరానికి అందిస్తే బాగుంటుంది. తెలుగు భాష ప్రాచీనతను సంరక్షించి మనకు తెలియజేసి ఆధునికతకు మార్గం వేసిన పత్రికలకు, పత్రికాధిపతులకు, సంపాదకులకు ఈ సమయంలో సముచితమైన కృతజ్ఞతలను తెలుపుకోవడానికి ఇదొక మార్గం.

కొంతకాలంగా మనమంతా ఎదురుచూస్తున్న ప్రాచీనతా ప్రతిపత్తి మన భాషకు వచ్చింది. ఇందువల్ల కొత్తగా కలిగిన మేలు ఏమిటి? పాఠశాలల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాల దాకా, వరుణయాగం నుంచి వ్యాపార జగత్తుదాకా తెలుగును గురించి ఏమి చెప్పవలసి వచ్చినా ఆంగ్లమాధ్యమంలో చెప్పుకోవలసిన దుర్దశలో ఉన్నాం మనం. ప్రస్తుతం అలా కాదనుకోవడం ఆత్మవంచన తప్ప ఇంకొకటి కాదు. ఈ ప్రాచీనతా ప్రతిపత్తి మనకెలాంటి సంతోషాన్ని కలిగించబోతోంది? ఇంక ఉత్సవాలు జరుగుతాయి. ఊరేగింపులు జరుగుతాయి. కొందరి మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. మరికొందరికి పురస్కారాలు, పారితోషికాలు లభిస్తాయి. అంతటితో ఆ వేడి చల్లారిపోతుంది. ఆ తరవాత ఏం చెయ్యాలి? మనకు లభించిన ఈ అవకాశాన్ని, గౌరవాన్ని ప్రయోజనకరంగా, తెలుగు ప్రగతికి మార్గంగా మలచుకోవడానికి మనమేమి చేయాలి? మేధావులు ఆలోచించవలసిన విషయమిది. నిర్మాణాత్మకమైన కృషి ఆరంభం కావలసిన సమయమిది.

నిరంతరం భాషకు నీరాజనం
ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చినందువల్ల మనకు అదనపు నిధులు వస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా ఉంటాయి. అందులో ప్రధానమైనది ప్రాచీనతను సంరక్షించుకోవడం. దీని ప్రయోజనం ఏమిటి? ఆధునిక, వైజ్ఞానిక ప్రపంచపు సవాళ్లను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యంగల భాషగా తెలుగును ఆధునికంగా తీర్చిదిద్దుకోవడమే దీని ప్రయోజనంగా మనం ఎంచుకోవాలి. ప్రాచీన విజ్ఞానం ఆధునిక వికాసానికి మూలం కావాలి. ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చినందువల్ల కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోను, విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లోను తెలుగు భాషాధ్యయన కేంద్రాలు నడుపవచ్చు. ఇది మన ప్రతిష్ఠ పెరిగే మార్గమే. ఇప్పుడు చాలామందికి తెలుగు పరిశోధక పట్టభద్రులకు కూడా పట్టుమని పది పద్యాలు నోటికి రావు. వాడుక భాషలో తప్పులు లేకుండా పది వాక్యాలు రాయలేరు. వేదికనెక్కి తడుముకోకుండా పది నిమిషాలు మాట్లాడలేరు. ఈ పరిస్థితి తొలగిపోవాలంటే ముందు ఇల్లు సవరించుకోవాలి. మండలస్థాయి నుంచి తెలుగు భాషా కుటీరాలు ఏర్పడాలి. స్వచ్ఛంద సంస్థల సహాయంతో తెలుగు వారందరూ తప్పులులేకుండా రాయడం చదవడం నేర్చుకునేలా చేయాలి. ముందుగా ప్రజలకు తెలుగు మీద అభిమానం పెరిగేలా చేయాలి. ఇందుకు తెలుగులో గొప్ప రచనలు రావాలి. మనకిప్పుడు కావలసినది గతవైభవం కాదు, భవిష్యత్తులో పొందగల ప్రాభవం. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, సాంస్కృతిక మండలి, అధికార భాషాసంఘం వంటి సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలి. విశ్వవిద్యాలయాల పాఠ్యప్రణాళికలు, పరిశోధనలు భాషను ఆధునికంగా తీర్చిదిద్దే కృషిని చేపట్టాలి. ప్రాచీనతా సంరక్షణకు ఆధునికతా వికాసానికి తమ జీవితాలను ధారపోసిన మహామహుల జయంతులను, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహించి యువకుల్లో భాషాభిమానం నింపాలి. ప్రవాసాంధ్రుల సేవలను గుర్తించాలి. వారి సహకారాన్ని అందుకోవాలి. ప్రవాసాంధ్ర సంఘాలనన్నింటినీ ఏకతాటిమీదకుతెచ్చి వారి కృషిని వ్యాపార వాణిజ్యాల మీద, రాజకీయాల మీద కంటే భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలమీద ఎక్కువగా కేంద్రీకృతమయ్యేలా ప్రయత్నాలు చేయాలి.

మన భాషను ఆధునిక ప్రపంచ అవసరాలను తీర్చే భాషగా మార్చడంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతి చాలా తక్కువ. మనకు కొత్తగా వచ్చిన ఈ అవకాశాన్ని అందుకు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. మన భాషలో మహారచయితలు పుట్టే అవకాశాలను మనమే కల్పించుకోవాలి. అప్పుడే తెలుగుభాష ప్రాచీనతా ప్రతిపత్తి అర్థవంతమవుతుంది. ప్రాచీనతా ప్రతిపత్తిగల గొప్ప ఇతర భాషలు కొన్ని ఉన్నాయి. ఆసక్తి కలవారు అవి ఇప్పుడు ఎటువంటి దశలో ఉన్నాయో తెలుసుకోవాలి. మనకు లభించిన ఈ ప్రాచీన భాషా ప్రతిపత్తి ఆ దశలో మిగిలిపోకుండా జాగ్రత్తపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్రం కోసం మనవాళ్లు ఎలా పోరాడారో అందరకూ తెలుసు. చివరకు మనకు స్వతంత్రం వచ్చింది. అప్పుడొక కవి 'మన స్వతంత్రం ఒక మేడిపండు- దరిద్రం మన రాచపుండు' అన్నాడు. తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి లభించిన ఈ శుభతరుణంలో తిరిగి ఇటువంటి వ్యాఖ్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ప్రభుత్వంమీద, మేధావుల మీద, ప్రజల మీద ఉంది.
(Eenadu, 02:11:2008)

పూర్వ వైభవంతో నవ ప్రాభవం

పూర్వ వైభవంతో నవ ప్రాభవం!

ఎందరో మహానుభావులు... అందరూ విజయసారథులే!

డాక్టర్‌ యు.ఎ.నరసింహమూర్తి

(రచయిత విజయనగరం మహారాజ కళాశాల (విశ్రాంత)
తెలుగు శాఖాధ్యక్షులు)


'ఇది విభాత మహోత్సవమ్మేమొ! ఇదియు
నూత్న కల్యాణ తూర్య మనోజ్ఞ గాన
నృత్య కోలాహలమ్మొకో! ఇది సువర్ణ
మంగళాక్షతా శీర్వర్ష మగునొ, కాదొ!'

అన్న కృష్ణశాస్త్రి పద్యం స్మరణకు వస్తోంది. తెలుగు భాషకు కాలం కలిసి వచ్చింది. తోటి భాషల సరసన తలఎత్తుకుని నిలవగలిగింది. ప్రజల కోరిక, ఉద్యమకారుల కృషి, ప్రభుత్వం ఒత్తిడి, ఎన్నికలవేళ, రాజకీయాల్లో మార్పులు- ఇలా ఇన్ని కారణాలు ఒక్క ఉదుటున ముసురుకుని వచ్చిన కారణంగా తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి దక్కింది. ఇది తెలుగు ప్రజల సమష్టి విజయం. ఏ ఒక్కరి దయాధర్మభిక్షగా లభించిన వరం కాదు. ఇంతకాలం మనం పోగొట్టుకున్న ప్రతిష్ఠను తిరిగి మనమే నిలుపుకొన్నాం. ఈ తరుణంలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల ప్రాచీన ప్రాభవం ఏమిటో, తెలుగువారి చరిత్ర ఏమిటో తేటతెల్లం చేసి మనకు అందించిన మహానుభావులెందరికో మనం కృతజ్ఞతలను ప్రకటించుకోవలసి ఉంది.

నిస్వార్థ పరిశోధనల ఫలం
మన జాతి- బ్రాహ్మణాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నకాలం నుంచీ ఉంది. మన భాష మూడువేల ఏళ్లనుంచి కనిపిస్తూంది. మన సాహిత్యం నన్నయకు ముందు కాలంనుంచి ఉంది. మన చరిత్ర శాతవాహనుల కాలం నుంచి స్ఫుటంగా కనిపిస్తుంది- ఇలా ఇన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? నూటయాభై ఏళ్లకు ముందు తెలుగు ప్రజలకు ఈ విషయాలన్నీ ఇంత వివరంగా తెలియవు. అప్పుడు దొరికేవన్నీ తాటాకుల పుస్తకాలు, రాళ్లమీద, రాగిరేకుల మీద చెక్కిన శాసనాలు మాత్రమే. అవన్నీ ఎక్కడెక్కడో చీకటి కొట్లలో నిద్రిస్తూ ఉండేవి. తాటాకుల పుస్తకాల్లోని లిపిని అర్థం చేసుకోవడం అందరికీ తెలిసేది కాదు. ఆ రాసే విధానం వేరు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కవిధంగా ఉండేది. తెలుగే అయినా లిపిలో ఎన్నో తేడాలుండేవి. అన్నమయ్య రాసిన 32వేల కీర్తనలు చెక్కిన రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడిఉన్న సంగతి 70 ఏళ్లకు పూర్వం ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఆ దశలోనే ఉండిపోతే ఈ భాష ప్రాభవం ఇప్పటివాళ్లకు తెలిసేది కాదు. మన చరిత్ర, సంస్కృతి మనకు అందేవికావు.

'యావద్భారత వర్షమున- దేశ భాషలలో నగ్రగణ్యమై, లోకోత్తరమైన సంస్కృతభాషతో సమాన ప్రతిపత్తి గడించి అతి విస్తృతమై, అపారమై, బహుముఖ సాహిత్య ప్రక్రియలతో భారత జాతీయ భాషగా రూపొందదగిన తెలుగు భాషా విశిష్టత, వ్యక్తిత్వము వెలుగులోనికి వచ్చుట లేదు. మౌలిక పరిశోధనయనగా అముద్రితములైన తాళపత్ర గ్రంథ పరిశోధన. వాఞ్మయ చరిత్రకు ప్రాచీన కవుల కృతులే ప్రాతిపదికలు, ప్రధానాధారములు. తెలుగు భాషలో పూర్వకవి కృతులన్నియు తాళపత్ర గ్రంథములలో నిక్షిప్తములై యున్నవి. అందువలన తెలుగు వాఞ్మయ చరిత్ర అముద్రితములైన తాళపత్ర గ్రంథములపైనే పూర్తిగా ఆధారపడి యున్నదనుట నిర్వివాదాంశము' అని నిడుదవోలు వేంకటరావు అన్నారు. ఆ మౌలిక పరిశోధన 19వ శతాబ్ది చివరి పాదం నుంచి మొదలైంది. ఆనాటి పరిశోధకులకు నేటి పరిశోధకులకుండే వనరులేవీ ఉండేవి కావు. ఎందరెందరో మహానుభావులు ఎన్నో చిక్కులను ఎదుర్కొని, స్వార్థం లేకుండా, బతుకు ఈడ్వడానికి చాలిన జీతాలు లేకపోయినా తొట్టతొలి పరిశోధనలను పట్టుదలతో కొనసాగించారు. వారిలో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, జయంతి రామయ్య, వేదం వెంకటరాయశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమర్రాజు లక్ష్మణరావు, నేలటూరి వెంకటరమణయ్య, చిలుకూరి వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఖండవల్లి లక్ష్మీరంజనం, నిడుదవోలు వేంకటరావు, తిరుమల రామచంద్ర వంటివారు ప్రముఖులు. వీరందరి కంటే ముందుగా బ్రౌన్‌దొర మాట చెప్పుకోవాలి. వీరందరూ కొనసాగించిన పరిశోధనలు, పరిష్కరణల కారణంగా వెలుగుచూడని ఎన్నో గ్రంథాలు ముద్రణ భాగ్యానికి నోచుకొని ఈ అమూల్య వారసత్వం మనకు దక్కింది. ఇప్పుడు వారందరినీ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వారి సేవలను మననం చేసుకోవాలి. వారిని ఆరాధించాలి. 1850-1950 మధ్యకాలంలో ఇంతటి కృషి జరిగి ఉండకపోతే మనకు గతం లేదు, భవిష్యత్తు లేదు.

ఒకపక్క అన్ని రంగాల్లోను తెలుగు ప్రాచీనతను వెల్లడించి దాన్ని ఎప్పటికీ నష్టపోకుండా కాపాడుకోవాలి. ఇంకొకపక్క తెలుగువారు అన్ని రంగాల్లోను ఆధునిక ప్రపంచంలో పోటీకి దిగాలి. భాష- సాహిత్యం- కళలు- విజ్ఞానం- సంస్కృతి- ఇలా అన్ని విషయాల్లోను ఈ పరిస్థితి ఉంది. మన తెలుగు పెద్దలు ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నారు. పండితులు, పరిశోధకులు, పరిష్కర్తలు, చరిత్ర పరిశోధకులు ఇందులో మొదటి భాగంకోసం ఆకలి, నిద్ర అని చూడకుండా; సంసారం- స్వార్థం పట్టించుకోకుండా, విసుగూ విరామం లేకుండా కృషిచేశారు. మన భాషను, సాహిత్యాన్ని ఆధునికం చేయడానికి గిడుగు, గురజాడల మార్గాన్ని అనుసరించి ఎందరో పాటుపడ్డారు. రచయితలు అటు సంప్రదాయ మార్గంలోను, ఇటు ఆధునిక మార్గంలోను ఆకుల మీద ఒకరు నడిస్తే చిగుళ్లమీద ఇంకొకరు నడిచి ఒకరు గనులను తవ్వి రత్నాలు రాసులుపోస్తే ఇంకొకరు మెట్ట-పల్లం ఏకం చేసి రాజనాలు పండించారు. వీరందరి కృషిని వ్యాప్తి చేయడానికి ప్రజలందరూ తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల మీద ఆసక్తి, అభిమానం, గౌరవం పెంచుకోవడానికి పత్రికలు మరువలేని కృషిచేశాయి. సరస్వతి, చింతామణి, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, అముద్రిత గ్రంథ చింతామణి, గృహలక్ష్మి, రెడ్డిరాణి, భారతి, త్రిలిజ్ఞ, తెలుగు జనానా, కల్పలత, ఆంధ్రభారతి, సువర్ణలేఖ, కృష్ణాపత్రిక, సాహితి, గోల్కొండ పత్రిక, ప్రబుద్ధాంద్ర- వంటి పత్రికలెన్నో లేకపోతే మన ప్రాచీన, ఆధునిక భాషా సాహిత్యాలు ఇంతగా అభివృద్ధి పొంది ఉండేవికావు. ఈ తరం వారికి ఆ పత్రికల పేర్లు తెలియవు. రూపురేఖలు తెలియవు. అవి నడిచిన తీరుతెన్నులు తెలియవు. కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు (పోలవరం జమీందారు), వీరేశలింగం, గిడుగు, అక్కిరాజు ఉమాకాన్తమ్‌, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, కాశీనాథుని నాగేశ్వరరావు, ఆండ్ర శేషగిరిరావు, ముట్నూరు కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ఎందరో ప్రముఖ పత్రికా వ్యవస్థాపకులు, సంపాదకుల గురించి ఈతరం వారికి బాగా తెలియదు. తెలుగు విశ్వవిద్యాలయం వారుగాని, తెలుగు అకాడమీ వారుగాని ఆ కాలంలోని పత్రికల ముఖపత్రాలను దొరికిన మేరకు సేకరించి ఆ పత్రికల చరిత్రను- చేసిన సేవను గురించి సంగ్రహ వ్యాసాలు రాయించి నేటితరానికి అందిస్తే బాగుంటుంది. తెలుగు భాష ప్రాచీనతను సంరక్షించి మనకు తెలియజేసి ఆధునికతకు మార్గం వేసిన పత్రికలకు, పత్రికాధిపతులకు, సంపాదకులకు ఈ సమయంలో సముచితమైన కృతజ్ఞతలను తెలుపుకోవడానికి ఇదొక మార్గం.

కొంతకాలంగా మనమంతా ఎదురుచూస్తున్న ప్రాచీనతా ప్రతిపత్తి మన భాషకు వచ్చింది. ఇందువల్ల కొత్తగా కలిగిన మేలు ఏమిటి? పాఠశాలల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాల దాకా, వరుణయాగం నుంచి వ్యాపార జగత్తుదాకా తెలుగును గురించి ఏమి చెప్పవలసి వచ్చినా ఆంగ్లమాధ్యమంలో చెప్పుకోవలసిన దుర్దశలో ఉన్నాం మనం. ప్రస్తుతం అలా కాదనుకోవడం ఆత్మవంచన తప్ప ఇంకొకటి కాదు. ఈ ప్రాచీనతా ప్రతిపత్తి మనకెలాంటి సంతోషాన్ని కలిగించబోతోంది? ఇంక ఉత్సవాలు జరుగుతాయి. ఊరేగింపులు జరుగుతాయి. కొందరి మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. మరికొందరికి పురస్కారాలు, పారితోషికాలు లభిస్తాయి. అంతటితో ఆ వేడి చల్లారిపోతుంది. ఆ తరవాత ఏం చెయ్యాలి? మనకు లభించిన ఈ అవకాశాన్ని, గౌరవాన్ని ప్రయోజనకరంగా, తెలుగు ప్రగతికి మార్గంగా మలచుకోవడానికి మనమేమి చేయాలి? మేధావులు ఆలోచించవలసిన విషయమిది. నిర్మాణాత్మకమైన కృషి ఆరంభం కావలసిన సమయమిది.

నిరంతరం భాషకు నీరాజనం
ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చినందువల్ల మనకు అదనపు నిధులు వస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా ఉంటాయి. అందులో ప్రధానమైనది ప్రాచీనతను సంరక్షించుకోవడం. దీని ప్రయోజనం ఏమిటి? ఆధునిక, వైజ్ఞానిక ప్రపంచపు సవాళ్లను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యంగల భాషగా తెలుగును ఆధునికంగా తీర్చిదిద్దుకోవడమే దీని ప్రయోజనంగా మనం ఎంచుకోవాలి. ప్రాచీన విజ్ఞానం ఆధునిక వికాసానికి మూలం కావాలి. ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చినందువల్ల కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోను, విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లోను తెలుగు భాషాధ్యయన కేంద్రాలు నడుపవచ్చు. ఇది మన ప్రతిష్ఠ పెరిగే మార్గమే. ఇప్పుడు చాలామందికి తెలుగు పరిశోధక పట్టభద్రులకు కూడా పట్టుమని పది పద్యాలు నోటికి రావు. వాడుక భాషలో తప్పులు లేకుండా పది వాక్యాలు రాయలేరు. వేదికనెక్కి తడుముకోకుండా పది నిమిషాలు మాట్లాడలేరు. ఈ పరిస్థితి తొలగిపోవాలంటే ముందు ఇల్లు సవరించుకోవాలి. మండలస్థాయి నుంచి తెలుగు భాషా కుటీరాలు ఏర్పడాలి. స్వచ్ఛంద సంస్థల సహాయంతో తెలుగు వారందరూ తప్పులులేకుండా రాయడం చదవడం నేర్చుకునేలా చేయాలి. ముందుగా ప్రజలకు తెలుగు మీద అభిమానం పెరిగేలా చేయాలి. ఇందుకు తెలుగులో గొప్ప రచనలు రావాలి. మనకిప్పుడు కావలసినది గతవైభవం కాదు, భవిష్యత్తులో పొందగల ప్రాభవం. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, సాంస్కృతిక మండలి, అధికార భాషాసంఘం వంటి సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలి. విశ్వవిద్యాలయాల పాఠ్యప్రణాళికలు, పరిశోధనలు భాషను ఆధునికంగా తీర్చిదిద్దే కృషిని చేపట్టాలి. ప్రాచీనతా సంరక్షణకు ఆధునికతా వికాసానికి తమ జీవితాలను ధారపోసిన మహామహుల జయంతులను, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహించి యువకుల్లో భాషాభిమానం నింపాలి. ప్రవాసాంధ్రుల సేవలను గుర్తించాలి. వారి సహకారాన్ని అందుకోవాలి. ప్రవాసాంధ్ర సంఘాలనన్నింటినీ ఏకతాటిమీదకుతెచ్చి వారి కృషిని వ్యాపార వాణిజ్యాల మీద, రాజకీయాల మీద కంటే భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలమీద ఎక్కువగా కేంద్రీకృతమయ్యేలా ప్రయత్నాలు చేయాలి.

మన భాషను ఆధునిక ప్రపంచ అవసరాలను తీర్చే భాషగా మార్చడంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతి చాలా తక్కువ. మనకు కొత్తగా వచ్చిన ఈ అవకాశాన్ని అందుకు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. మన భాషలో మహారచయితలు పుట్టే అవకాశాలను మనమే కల్పించుకోవాలి. అప్పుడే తెలుగుభాష ప్రాచీనతా ప్రతిపత్తి అర్థవంతమవుతుంది. ప్రాచీనతా ప్రతిపత్తిగల గొప్ప ఇతర భాషలు కొన్ని ఉన్నాయి. ఆసక్తి కలవారు అవి ఇప్పుడు ఎటువంటి దశలో ఉన్నాయో తెలుసుకోవాలి. మనకు లభించిన ఈ ప్రాచీన భాషా ప్రతిపత్తి ఆ దశలో మిగిలిపోకుండా జాగ్రత్తపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్రం కోసం మనవాళ్లు ఎలా పోరాడారో అందరకూ తెలుసు. చివరకు మనకు స్వతంత్రం వచ్చింది. అప్పుడొక కవి 'మన స్వతంత్రం ఒక మేడిపండు- దరిద్రం మన రాచపుండు' అన్నాడు. తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి లభించిన ఈ శుభతరుణంలో తిరిగి ఇటువంటి వ్యాఖ్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ప్రభుత్వంమీద, మేధావుల మీద, ప్రజల మీద ఉంది.
(Eenadu, 02:11:2008)

Thursday, June 25, 2009

మందార మకరందాలు

"మందార మకరందాలు " ... అనే పదప్రయోగం చెవుల పడగానే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చేది పోతన రాసిన సుప్రసిద్ధ పద్యం " మందార మకరంద మాధుర్యమ్మున దేలు మధుపమ్ము".. అలాగే పోతన కవిత్వాన్ని సంక్షిప్తంగా వివరించమంటే మందార మకరంద మాధుర్యం అనక తప్పదు కదా. అంతటి మధురమైన కవిత్వం అని పోతన భాగవతం చదివిన వారెవరైనా ఒప్పుకోక తప్పదేమో. అందుకే నేను ఈ మధ్యే చదవడం మొదలుపెట్టిన పోతన భాగవతంలోని కొన్ని అందమైన పద్యాలను నాకు అనువైన రీతిలో వివరించడానికి చేసే చిన్న ప్రయత్నానికి మందార మకరందాలు అని నామకరణం చేస్తున్నాను.

భక్తికి మారుపేరుగా భాగవతాన్ని చెప్పుకుంటారు. దానికి కారణం అందులో ఉన్న భక్తి కథలే కాదు, బమ్మెర పోతన మనకందించిన కమ్మని కవిత్వం. కవిత్వం పోతనకి ఒక ముక్తి సాధనం. అది జ్ఞానం వల్ల గాని మనకు లభించదు. అందరికీ అందుబాటులో ఉండేది భక్తి. ఈ మధురాతి మధురమైన ఈ భక్తి మార్గంలో కైవల్యం సాధించుకోవడం చాలా సులువు అనే మహోన్నతమైన దారి మనకు చూపించాడు పోతన.

ముందుగా కొన్ని పరిచయ వాక్యాలు. ఆంధ్రమహాభాగవతం పన్నెండు స్కందాలలొ రాయబడిన మహాపురాణం. రాసింది నలుగురు కవులు, భాగవత రచనలో బమ్మెర పోతన ముఖ్యుడు. భక్తిరస ఘట్టాలన్నీ ఆయన గంటం నుండి జాలువారినవే. మరి కొన్ని భాగాలను మరో ముగ్గురు కవులు అనువదించారు. వారిలో వెలిగందల నారయ ముఖ్యుడు. ఏకాదశ ద్వాదశ స్కందాలు పూర్తిగా, ద్వితీయ దశమోత్తర స్కందాలలో కొంత భాగం ఆయన రచన. పంచమ స్కందం గంగన్న, షష్ట స్కందం సింగన్న తెనిగించారు.



శ్రీ కై వల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లో కర
క్షైకారంభకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోకవిలస ద్దృగ్జాలసంభూత నా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.

శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని మొదటి పద్యమిది. నాందీ శ్లోకం అనవచ్చు. ఈ పద్యంలో నమస్సు, కథా సూచనము రెండూ ఉన్నాయి. భాగవతాన్నితెనిగించమని పోతనకు ఆనతిచ్చినవాడు రామభద్రుడు, కాని కృతిని అందుకున్నవాడు నందనందనుడు. అందుకే పోతన ఆ నందకుమారుని అవతార రహస్యాలను ఈ పద్యంలో అందంగా పొందుపరిచారు. '”లోకరక్షైకారంభకు “ డు అనడంలో పరమాత్ముని స్థితికరత్వాన్ని, “ భక్త పాలన కళసంరంభకుడు “ అనడంలో ఆర్తులను ఆదుకునే గుణాన్ని, “ దానవోద్రేక స్తంభకు” డనడంలో హిరణ్యకశిపునివంటి రాక్షసులను అణచివేసే పనితనాన్ని, “కేళీలోల విల సద్దృగ్జాల సంభూతనానాకంజాత భవాండకుంభకు” డనడనంలో సృష్టిలీలను, కేళీ శబ్దం చేత కృష్ణలీలను కూడా ధ్వనింప చేసాడు.

పద్యంలో పదాలతోఆటలాడుతో మహార్ధాన్ని సూచించడం పోతనకు వెన్నతో పెట్టిన విద్య. "డింభకున్" , "ఆరంభకున్", "సమ్రంభకున్", సమ్రంభకున్", స్తంభకున్" "కుంభకున్" అంటూ సమాసాంతంలో అంత్యప్రాసలు కూర్చే వింత విద్య ఇది. దీనివలన లాభమేంటి అంటారా? చెవికి చవులూరించే నాద సుఖం. పదం - అర్ధం పొందిన మధుర పద సమ్మేళనం ఈ పద్యం.

ఈ పద్యంలో పోతన ఆశిస్తున్నది కేవలం కైవల్యం. మన శరీరం ఇంద్రియ విముక్తమైన అత్మ కేవలమైనది. అది పొందే స్థితి కైవల్యం. మహాకవి పోతన కాంక్షించేది కైవల్యమే తప్ప , కాసులు కాదు.

ఇది మొదటి ప్రయత్నం . తప్పులుంటే మన్నించి, సరిదిద్దండి.

మందార మకరందాలు

"మందార మకరందాలు " ... అనే పదప్రయోగం చెవుల పడగానే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చేది పోతన రాసిన సుప్రసిద్ధ పద్యం " మందార మకరంద మాధుర్యమ్మున దేలు మధుపమ్ము".. అలాగే పోతన కవిత్వాన్ని సంక్షిప్తంగా వివరించమంటే మందార మకరంద మాధుర్యం అనక తప్పదు కదా. అంతటి మధురమైన కవిత్వం అని పోతన భాగవతం చదివిన వారెవరైనా ఒప్పుకోక తప్పదేమో. అందుకే నేను ఈ మధ్యే చదవడం మొదలుపెట్టిన పోతన భాగవతంలోని కొన్ని అందమైన పద్యాలను నాకు అనువైన రీతిలో వివరించడానికి చేసే చిన్న ప్రయత్నానికి మందార మకరందాలు అని నామకరణం చేస్తున్నాను.

భక్తికి మారుపేరుగా భాగవతాన్ని చెప్పుకుంటారు. దానికి కారణం అందులో ఉన్న భక్తి కథలే కాదు, బమ్మెర పోతన మనకందించిన కమ్మని కవిత్వం. కవిత్వం పోతనకి ఒక ముక్తి సాధనం. అది జ్ఞానం వల్ల గాని మనకు లభించదు. అందరికీ అందుబాటులో ఉండేది భక్తి. ఈ మధురాతి మధురమైన ఈ భక్తి మార్గంలో కైవల్యం సాధించుకోవడం చాలా సులువు అనే మహోన్నతమైన దారి మనకు చూపించాడు పోతన.

ముందుగా కొన్ని పరిచయ వాక్యాలు. ఆంధ్రమహాభాగవతం పన్నెండు స్కందాలలొ రాయబడిన మహాపురాణం. రాసింది నలుగురు కవులు, భాగవత రచనలో బమ్మెర పోతన ముఖ్యుడు. భక్తిరస ఘట్టాలన్నీ ఆయన గంటం నుండి జాలువారినవే. మరి కొన్ని భాగాలను మరో ముగ్గురు కవులు అనువదించారు. వారిలో వెలిగందల నారయ ముఖ్యుడు. ఏకాదశ ద్వాదశ స్కందాలు పూర్తిగా, ద్వితీయ దశమోత్తర స్కందాలలో కొంత భాగం ఆయన రచన. పంచమ స్కందం గంగన్న, షష్ట స్కందం సింగన్న తెనిగించారు.



శ్రీ కై వల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లో కర
క్షైకారంభకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోకవిలస ద్దృగ్జాలసంభూత నా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.

శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని మొదటి పద్యమిది. నాందీ శ్లోకం అనవచ్చు. ఈ పద్యంలో నమస్సు, కథా సూచనము రెండూ ఉన్నాయి. భాగవతాన్నితెనిగించమని పోతనకు ఆనతిచ్చినవాడు రామభద్రుడు, కాని కృతిని అందుకున్నవాడు నందనందనుడు. అందుకే పోతన ఆ నందకుమారుని అవతార రహస్యాలను ఈ పద్యంలో అందంగా పొందుపరిచారు. '”లోకరక్షైకారంభకు “ డు అనడంలో పరమాత్ముని స్థితికరత్వాన్ని, “ భక్త పాలన కళసంరంభకుడు “ అనడంలో ఆర్తులను ఆదుకునే గుణాన్ని, “ దానవోద్రేక స్తంభకు” డనడంలో హిరణ్యకశిపునివంటి రాక్షసులను అణచివేసే పనితనాన్ని, “కేళీలోల విల సద్దృగ్జాల సంభూతనానాకంజాత భవాండకుంభకు” డనడనంలో సృష్టిలీలను, కేళీ శబ్దం చేత కృష్ణలీలను కూడా ధ్వనింప చేసాడు.

పద్యంలో పదాలతోఆటలాడుతో మహార్ధాన్ని సూచించడం పోతనకు వెన్నతో పెట్టిన విద్య. "డింభకున్" , "ఆరంభకున్", "సమ్రంభకున్", సమ్రంభకున్", స్తంభకున్" "కుంభకున్" అంటూ సమాసాంతంలో అంత్యప్రాసలు కూర్చే వింత విద్య ఇది. దీనివలన లాభమేంటి అంటారా? చెవికి చవులూరించే నాద సుఖం. పదం - అర్ధం పొందిన మధుర పద సమ్మేళనం ఈ పద్యం.

ఈ పద్యంలో పోతన ఆశిస్తున్నది కేవలం కైవల్యం. మన శరీరం ఇంద్రియ విముక్తమైన అత్మ కేవలమైనది. అది పొందే స్థితి కైవల్యం. మహాకవి పోతన కాంక్షించేది కైవల్యమే తప్ప , కాసులు కాదు.

ఇది మొదటి ప్రయత్నం . తప్పులుంటే మన్నించి, సరిదిద్దండి.

Monday, June 1, 2009

పతనమా లేక పరిణామమా ?

మన తెలుగు భాషలోను, సాహిత్యం లోనూ, జన జీవనం లోనూ వస్తున్న మార్పులని దిగాజారటం అని అనుకునే నేను, దాని గూర్చి ఆలోచిస్తూ పడ్డ మధనకు ఇది అక్షర రూపం. ఇది వ్రాయటానికి నన్ను తన ఆవేదనతో తెలికుండానే ప్రోత్సహించిన కలం స్నేహితురాలికి కృతజ్ఞతలు.

పతనమా లేక పరిణామమా ?

"బండి ర" ను జనం మరచి పోతున్నారని మధనపడే నేను నేర్వని "లు లూ "ల ఉసే మరిచాను
"షంకర" అని బాలు కూడా ఖూని అరచేను రోజు నేను చేస్తున్న ఖూనిల ఎరుకే ఎరగను

స్నానం చేయకనే వంట చేసే శ్రీమతిపై మండేను కానీ తలవీడిన "శిఖను" తలవను పూజలు పునస్కారాలు చేసే నేను
"చిత్త సుద్ధి లేని------" అన్న నానుడి మరచాను

భాష లోపించింది అని ఘోషించే మిత్రమా నిజంగా అది లోపమా ? పరిణామమా?

ఎక్కడ రాజులు? ఎక్కడ పోషకులు? ఎక్కడ భ్రుతి? పోషణ లేని కళలు ఎలా బ్రతికేను ఈ జగతి ? లేకపోతే రాజ రాజ నరెంద్రుని ఆస్థానం
ఉండేదా అప్పటి నన్నయ కృతి ?

ప్రజాస్వామ్యం వచ్చిందని సంతసించే మనం కొంత మూలం చెల్లించక తప్పదని మరిచాం ఉండుంటే ప్రజాస్వామ్యం, కులికేనా శ్రీనాధ కవి ఒక్కడు ముత్యాల పల్లకీన.


గుర్తు పట్టకలవా నేస్తం రాయల నాటి మన తెలుగు అక్షరం ? అ"క్షరం" అంటూనే చూడమా దాని పతనం? ఏడుస్తూనే కూర్చున్నామా మనం ?
లేదే, అక్షరాన్ని సర్దుకొని మరీ ముందుకు పోయాం.

అంటావు సాహిత్యపు విలువలు తరిగాయి కానీ ఏది విలువల గీటురాయి? అంటావు కళామతల్లి వలువలు మాసినవని అందరు మెచ్చే వాటిని కాదనటం మనం ఎవరిమని?

నీకు నచ్చిన భాష వాడు, మెచ్చినవి ఆచరించు మిగితా వారు అలా లేరని వగవకు నేస్తం "తన కోపమే తన శత్రువు ----" మరువకు ఈ సుభాషితం

అలా కాదని అంటావా, నీ ఇష్టం కదులుతూనే ఉంది కాలం క్షణం, యుగం జరిగే పరిణామం జరుగుతుంది చివరక నీకు అశాంతే మిగిలేది

పతనమా లేక పరిణామమా ?

మన తెలుగు భాషలోను, సాహిత్యం లోనూ, జన జీవనం లోనూ వస్తున్న మార్పులని దిగాజారటం అని అనుకునే నేను, దాని గూర్చి ఆలోచిస్తూ పడ్డ మధనకు ఇది అక్షర రూపం. ఇది వ్రాయటానికి నన్ను తన ఆవేదనతో తెలికుండానే ప్రోత్సహించిన కలం స్నేహితురాలికి కృతజ్ఞతలు.

పతనమా లేక పరిణామమా ?

"బండి ర" ను జనం మరచి పోతున్నారని మధనపడే నేను నేర్వని "లు లూ "ల ఉసే మరిచాను
"షంకర" అని బాలు కూడా ఖూని అరచేను రోజు నేను చేస్తున్న ఖూనిల ఎరుకే ఎరగను

స్నానం చేయకనే వంట చేసే శ్రీమతిపై మండేను కానీ తలవీడిన "శిఖను" తలవను పూజలు పునస్కారాలు చేసే నేను
"చిత్త సుద్ధి లేని------" అన్న నానుడి మరచాను

భాష లోపించింది అని ఘోషించే మిత్రమా నిజంగా అది లోపమా ? పరిణామమా?

ఎక్కడ రాజులు? ఎక్కడ పోషకులు? ఎక్కడ భ్రుతి? పోషణ లేని కళలు ఎలా బ్రతికేను ఈ జగతి ? లేకపోతే రాజ రాజ నరెంద్రుని ఆస్థానం
ఉండేదా అప్పటి నన్నయ కృతి ?

ప్రజాస్వామ్యం వచ్చిందని సంతసించే మనం కొంత మూలం చెల్లించక తప్పదని మరిచాం ఉండుంటే ప్రజాస్వామ్యం, కులికేనా శ్రీనాధ కవి ఒక్కడు ముత్యాల పల్లకీన.


గుర్తు పట్టకలవా నేస్తం రాయల నాటి మన తెలుగు అక్షరం ? అ"క్షరం" అంటూనే చూడమా దాని పతనం? ఏడుస్తూనే కూర్చున్నామా మనం ?
లేదే, అక్షరాన్ని సర్దుకొని మరీ ముందుకు పోయాం.

అంటావు సాహిత్యపు విలువలు తరిగాయి కానీ ఏది విలువల గీటురాయి? అంటావు కళామతల్లి వలువలు మాసినవని అందరు మెచ్చే వాటిని కాదనటం మనం ఎవరిమని?

నీకు నచ్చిన భాష వాడు, మెచ్చినవి ఆచరించు మిగితా వారు అలా లేరని వగవకు నేస్తం "తన కోపమే తన శత్రువు ----" మరువకు ఈ సుభాషితం

అలా కాదని అంటావా, నీ ఇష్టం కదులుతూనే ఉంది కాలం క్షణం, యుగం జరిగే పరిణామం జరుగుతుంది చివరక నీకు అశాంతే మిగిలేది

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070