Saturday, November 14, 2009

ఆధారపడ్డం తప్పు





ఎంత వయసొచ్చినా, ఏ స్థితిలో ఉన్నా మనిషి మీద మనిషి ఆధారపడ్డం తప్పు కాదని నా అనుకోలు. ఎందాకా ఆధారపడొచ్చు ? అంటే ఏమీ చెప్పలేం. దీనికి వారివారి ప్రత్యేక మానసిక, భౌతిక పరిస్థితులే తప్ప కఠిన, జటిల నియమాలంటూ ఏమీ కనిపించడంలేదు. ఒక చిన్నబిడ్డ తన తల్లి మీద నూటికి ఇన్నూఱు పాళ్ళు ఆధారపడతాడు. అతని ఏడుపు ఆమెకి శాసనం. అతని నవ్వు ఆమెకి పద్మశ్రీ. తాను ఆమె మీద విపరీతంగా ఆధారపడుతున్నాననే స్పృహ అతనికి లేదు. ఆమెకా స్పృహ ఉన్నా అది ఆమెకి తప్పు కాదు. అంటే ఇక్కడ ఆధారపడ్డాన్ని నిర్దోషం చేసేవి ఈ పరస్పర సానుకూల వైఖరులే. ఆధారపడుతున్నామనే ఆ స్పృహే ఉండకూడదు. లేదా అది తప్పు కాదనే స్పృహైనా ఉండాలి.

ఎదిగిన మనుషులు భౌతికంగానో, పాదార్థికం (material) గానో, ఆర్థికంగానో ఆధారపడేదాని కంటే కూడా మానసికంగానే ఇతరుల మీద ఎక్కువ ఆధారపడుతూంటారు. నిఱుటి మాట. లక్ష్మీనారాయణుల వంటి ఆ భార్యాభర్తలు పల్లెటూళ్ళో ఉంటున్నారు. భార్యకి తొంభైరెండేళ్ళు. భర్తకి తొంభయ్యాఱేళ్ళు. ఆవిడ ఆరోజు పొద్దున పూజ ముగించుకొని భర్త దగ్గఱికి వచ్చింది. అప్పుడాయన హాల్లో కూర్చుని ’ఈనాడు’ చదువుతున్నాడు. "ఎందుకో నీరసంగా ఉందండీ" అంటూ ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడింది. "ఏమీ తినకుండా, తాగకుండా పొద్దునే పూజలో కూర్చుంటే నీరసం రాదూ ? పంచదారనీళ్ళు తెస్తానాగు": అని ఆయన వంటగదిలోకి వెళ్ళాడు. ఆయన అది తెచ్చేలోపలే ముసలావిడ చనిపోయింది. బంధువుల్లో బతికున్నవాళ్ళంతా వచ్చారు. అపరకర్మలన్నీ ముసలాయన చేతి మీదుగానే జఱిగాయి. పధ్నాలుగో రోజున పొద్దునే లేచి ఈనాడు పేపర్ పట్టుకొని "మీ అమ్మ పూజ ఇంకా అవ్వలేదుటే ? వచ్చి కాఫీ కలపమని చెప్పు" అన్నాడు. "అమ్మ చనిపోయింది కదా నాన్నా ?" అన్నది ఆయన డెబ్భైరెండేళ్ళ కూతురు నవ్వాలో ఏడవాలో అర్థం కాక ! ముసలాయన మతిపోయినట్లయ్యాడు. భార్య చనిపోయిందనే విషయం నమ్మలేకపోతున్నాడు. వాళ్ళకి ఆనాటి హిందూ ఆచారం ప్రకారం ఎనిమిదో యేటనే పెళ్ళయింది. ఇద్దఱూ కలిసి బడికెళ్ళేవారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఆవిడ బడి మానేసింది. ఆయన మాత్రం డిగ్రీ దాకా చదివాడు కానీ ఉద్యోగాలేమీ చెయ్యలేదు. పిత్రార్జిత ఆస్తులు చూసుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఆ పల్లెటూళ్ళోనే ఎనభై ఎనిమిదేళ్ళ పాటు కాపురం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా "ఆవిడ లేదు" అంటే ఆ మనిషికి కాలో చెయ్యో విఱిగిపోయినట్లుండడం బహుశా సహజమే. వీళ్ళలో ఎవరు ఎవరి మీద ఎక్కువ ఆధారపడ్డారో ఖచ్చితంగా చెప్పడం కష్టం. పెద్దగా చదువుకోని, ఉద్యోగాలు చెయ్యని, జీవితంలో ఒక్క పైసా సంపాదించని ముసలావిడ తన భర్త మీద ఆధారపడిందా ? లేక ఆ భర్త ఆమె మరణానికి మతిపోయేంతగా ఆమె మీద ఆధారపడ్డాడా ? ఏమో !

నాకు ఆర్థిక స్వాతంత్ర్యం లేని రోజుల్లో కూడా మానసిక స్వాతంత్ర్యం బాగానే ఉండేది. ఎవరికైనా, ఎప్పటికైనా కావాల్సింది అదే. నడమంత్రపు సిరివల్ల మన మనస్తత్త్వంలో విప్లవాత్మక, నాటకీయ పరిణామాలు చోటు చేసుకోకుండా అది కాపాడుతుంది, కండిషన్ లో ఉంచుతుంది. ఒకరి మీద ఆధారపడి ఉన్నామనే ఆత్మన్యూనతాభావం మనలో ప్రవేశిస్తే - ఆ తరువాత మనం స్వతంత్రులమైన రోజున ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసే సంభావ్యత లేకపోలేదు. నూటికి నూఱు శాతం ఇతరుల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆ భావం మనసులో లేని పసిబిడ్డ యొక్క నిర్మలత్వమూ, మానసిక స్వేచ్ఛా మనకాదర్శం కావాలి. అలాగే ఆధారభూతులు కూడా తమ ఆధారితులు తమ మూలంగా ఆత్మన్యూనతా భావానికి లోనుకాని విధంగా వివేకమూ, ఔదార్యమూ కలిగి జాగ్రత్తగా మసులుకుంటే బావుంటుంది

ఆధారపడ్డం తప్పు





ఎంత వయసొచ్చినా, ఏ స్థితిలో ఉన్నా మనిషి మీద మనిషి ఆధారపడ్డం తప్పు కాదని నా అనుకోలు. ఎందాకా ఆధారపడొచ్చు ? అంటే ఏమీ చెప్పలేం. దీనికి వారివారి ప్రత్యేక మానసిక, భౌతిక పరిస్థితులే తప్ప కఠిన, జటిల నియమాలంటూ ఏమీ కనిపించడంలేదు. ఒక చిన్నబిడ్డ తన తల్లి మీద నూటికి ఇన్నూఱు పాళ్ళు ఆధారపడతాడు. అతని ఏడుపు ఆమెకి శాసనం. అతని నవ్వు ఆమెకి పద్మశ్రీ. తాను ఆమె మీద విపరీతంగా ఆధారపడుతున్నాననే స్పృహ అతనికి లేదు. ఆమెకా స్పృహ ఉన్నా అది ఆమెకి తప్పు కాదు. అంటే ఇక్కడ ఆధారపడ్డాన్ని నిర్దోషం చేసేవి ఈ పరస్పర సానుకూల వైఖరులే. ఆధారపడుతున్నామనే ఆ స్పృహే ఉండకూడదు. లేదా అది తప్పు కాదనే స్పృహైనా ఉండాలి.

ఎదిగిన మనుషులు భౌతికంగానో, పాదార్థికం (material) గానో, ఆర్థికంగానో ఆధారపడేదాని కంటే కూడా మానసికంగానే ఇతరుల మీద ఎక్కువ ఆధారపడుతూంటారు. నిఱుటి మాట. లక్ష్మీనారాయణుల వంటి ఆ భార్యాభర్తలు పల్లెటూళ్ళో ఉంటున్నారు. భార్యకి తొంభైరెండేళ్ళు. భర్తకి తొంభయ్యాఱేళ్ళు. ఆవిడ ఆరోజు పొద్దున పూజ ముగించుకొని భర్త దగ్గఱికి వచ్చింది. అప్పుడాయన హాల్లో కూర్చుని ’ఈనాడు’ చదువుతున్నాడు. "ఎందుకో నీరసంగా ఉందండీ" అంటూ ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడింది. "ఏమీ తినకుండా, తాగకుండా పొద్దునే పూజలో కూర్చుంటే నీరసం రాదూ ? పంచదారనీళ్ళు తెస్తానాగు": అని ఆయన వంటగదిలోకి వెళ్ళాడు. ఆయన అది తెచ్చేలోపలే ముసలావిడ చనిపోయింది. బంధువుల్లో బతికున్నవాళ్ళంతా వచ్చారు. అపరకర్మలన్నీ ముసలాయన చేతి మీదుగానే జఱిగాయి. పధ్నాలుగో రోజున పొద్దునే లేచి ఈనాడు పేపర్ పట్టుకొని "మీ అమ్మ పూజ ఇంకా అవ్వలేదుటే ? వచ్చి కాఫీ కలపమని చెప్పు" అన్నాడు. "అమ్మ చనిపోయింది కదా నాన్నా ?" అన్నది ఆయన డెబ్భైరెండేళ్ళ కూతురు నవ్వాలో ఏడవాలో అర్థం కాక ! ముసలాయన మతిపోయినట్లయ్యాడు. భార్య చనిపోయిందనే విషయం నమ్మలేకపోతున్నాడు. వాళ్ళకి ఆనాటి హిందూ ఆచారం ప్రకారం ఎనిమిదో యేటనే పెళ్ళయింది. ఇద్దఱూ కలిసి బడికెళ్ళేవారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఆవిడ బడి మానేసింది. ఆయన మాత్రం డిగ్రీ దాకా చదివాడు కానీ ఉద్యోగాలేమీ చెయ్యలేదు. పిత్రార్జిత ఆస్తులు చూసుకుంటూ భార్యాభర్తలిద్దరూ ఆ పల్లెటూళ్ళోనే ఎనభై ఎనిమిదేళ్ళ పాటు కాపురం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా "ఆవిడ లేదు" అంటే ఆ మనిషికి కాలో చెయ్యో విఱిగిపోయినట్లుండడం బహుశా సహజమే. వీళ్ళలో ఎవరు ఎవరి మీద ఎక్కువ ఆధారపడ్డారో ఖచ్చితంగా చెప్పడం కష్టం. పెద్దగా చదువుకోని, ఉద్యోగాలు చెయ్యని, జీవితంలో ఒక్క పైసా సంపాదించని ముసలావిడ తన భర్త మీద ఆధారపడిందా ? లేక ఆ భర్త ఆమె మరణానికి మతిపోయేంతగా ఆమె మీద ఆధారపడ్డాడా ? ఏమో !

నాకు ఆర్థిక స్వాతంత్ర్యం లేని రోజుల్లో కూడా మానసిక స్వాతంత్ర్యం బాగానే ఉండేది. ఎవరికైనా, ఎప్పటికైనా కావాల్సింది అదే. నడమంత్రపు సిరివల్ల మన మనస్తత్త్వంలో విప్లవాత్మక, నాటకీయ పరిణామాలు చోటు చేసుకోకుండా అది కాపాడుతుంది, కండిషన్ లో ఉంచుతుంది. ఒకరి మీద ఆధారపడి ఉన్నామనే ఆత్మన్యూనతాభావం మనలో ప్రవేశిస్తే - ఆ తరువాత మనం స్వతంత్రులమైన రోజున ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసే సంభావ్యత లేకపోలేదు. నూటికి నూఱు శాతం ఇతరుల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆ భావం మనసులో లేని పసిబిడ్డ యొక్క నిర్మలత్వమూ, మానసిక స్వేచ్ఛా మనకాదర్శం కావాలి. అలాగే ఆధారభూతులు కూడా తమ ఆధారితులు తమ మూలంగా ఆత్మన్యూనతా భావానికి లోనుకాని విధంగా వివేకమూ, ఔదార్యమూ కలిగి జాగ్రత్తగా మసులుకుంటే బావుంటుంది

అంత్యనిష్ఠూరమా ? ఆది నిష్ఠూరమా ?

నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం - ఏ సరికొత్త మానవసంబంధాన్నీ చిఱునవ్వుతో ప్రారంభించకూడదని ! మనం స్వతహాగా మంచివాళ్ళం కాకపోతేనే అది మనకొక అలంకారమౌతుంది. లేకపోతే అది మన బలహీనత అవుతుంది. కనీసం అలా చూడబడుతుంది. అవతలివాళ్ళ మంచీ చెడూ ఏమీ తెలియకుండానే, వాళ్ళు అడక్కుండానే వాళ్ళకి మనం పంచే ఈ మంచితనం, ఈ చిఱునవ్వులూ అడవి గాచిన వెన్నెల్లా దుర్వినియోగం కావచ్చు. అపరిచితులు మననుంచి ఏదైనా దోచుకోవడానికి గల అవకాశాన్ని, మన బలహీనతల్నిమన మంచితనంలో అన్వేషిస్తారు. నిజానికి మన దగ్గఱ అలాంటివేవీ లేకపోయినా అవి ఉన్నాయనే నమ్మకమూ, వాటికోసం ఒక ప్రయత్నం చేసి చూడొచ్చుననే భరోసా వాళ్ళకి కలుగుతాయి.

మానవ నాగరికతలో మనుషులు మేధాశక్తికిచ్చిన ప్రాధాన్యం చాలా గొప్పది. అసలు మేధాశక్తే అన్ని ఇతర మానవీయ లక్షణాలన్నింటినీ త్రోసిరాజని, అదొక్కటే మనిషి లక్షణంగా చెలామణి అవుతున్నది. ఇది ఎంత "అతి"గా పరిణమించిందంటే మేధాశక్తి మఱీయెక్కువ లేనివాళ్ళని, దాన్ని అతివినియోగం/ దుర్వినియోగం చెయ్యడానికి ఇష్టపడనివాళ్ళని సమాజంలో మనుషులుగా చూడ్డమే మానేశారు. వాళ్ళని అలా అమానవీకరించేశారు. అలా అది చివఱికొక అమానుష దృక్కోణంగా రూపుదాల్చింది. మళ్ళీ ఆ మేధాశక్తిలో కూడా ఒక రకం మేధాశక్తికే ఇనుమిక్కిలి ప్రాధాన్యం. ఎలాగంటే - చాలామంది దృష్టిలో మేధాశక్తి అంటే కృత్రిమత్వాల్ని అన్వేషించే లక్షణం మాత్రమే. అందుచేత కృత్రిమత్వాలు లేని ఒక మంచిమనిషి ఈ సమాజంలో ఫక్తు బుద్ధిహీనుడుగానే జమ. మన దృష్టిలో బుద్ధిహీనులకి భూమండలం మీద బతికే హక్కు లేదు. వాళ్ళు మన దయకీ, గౌరవానికీ పాత్రులు కారు. వాళ్ళని మనం యథేచ్ఛగా దోచుకోవచ్చు. వాళ్ళు మనచేత దోచుకోబడ్డానికే పుట్టారు. లేకపోతే మనుషులు జంతువుల మాంసం ఎందుకు తింటారు ? మనుషుల మాంసం ఎందుకు తినరు ? మంచివాడికి ఈ సమాజంలో ఉన్న విలువ అంతకంటే మఱీ యెక్కువేమీ కాదు. ఇక్కడ ఇచ్చినకొద్దీ పుచ్చుకునేవాళ్ళూ, చేసినకొద్దీ ఇంకా చేయించుకునేవాళ్ళూ లెక్కకు మిక్కిలి.

మఱి మంచితనాన్ని సమాజం బొత్తిగా హర్షించదా ? అనడిగితే, హర్షిస్తుంది. కానీ ఎవణ్ణి పడితే వాణ్ణి కాదు. తనకు సుదీర్ఘ కాలంలో ఉపయోగపడే మంచివాడు సమాజానికి యమా నచ్చుతాడు. అలాగే జీవితంలో తొంభైశాతం చెడు, పదిశాతం మాత్రమే మంచి ఉన్నవాడి మంచితనం సమాజదృష్టిని ఆకర్షిస్తుంది. పెద్దవాళ్ళని అలవోకగా హత్యచేసే అలవాటున్న గజదొంగ ఒక కుటుంబాన్ని యావత్తూ నిర్మూలించి వాళ్ళలో ఒక చిన్నపాపని మాత్రం చంపకుండా వదిలిపెట్టి వెళితే అతనిలో చావకుండా బతికి ఉన్న అరుదైన మానవత్వానికి గొప్ప పబ్లిసిటీ లభిస్తుంది. అదే, ప్రొఫెషనల్ రోజువారీ మంచివాళ్ళంతా చేతకాని చచ్చుదద్దమ్మల కిందే జమ. సమాజం సమర్థుల మంచితనాన్ని, సంపన్నుల మంచితనాన్ని, శక్తిమంతుల మంచితనాన్ని, టోకుగా విజేతల మంచితనాన్ని మాత్రమే హర్షిస్తుంది. తన జోలికీ, శొంఠికీ రాని, తన లోపాల్ని విమర్శించని, తన బలహీనతల్ని సంస్కరించడానికి ప్రయత్నించని వ్యక్తుల మంచితనాన్ని మాత్రమే అది మెచ్చుకుంటుంది. అదే సమయంలో మంచివాళ్ళు తెలివిగలవాళ్ళు కూడా కావడాన్ని అది ఎట్టి పరిస్థితుల్లోను భరించజాలదు.

ఒక యింట్లో అనేక సంవత్సరాల పాటు నివసించాక అక్కడ అవసరమైన వస్తువులతో పాటు అనవసరమైన వస్తువులు కూడా అనేకం పోగుపడతాయి. అలాగే వేలాది సంవత్సరాల మానవ నాగరికతలో కొన్ని అనవసర పదాలు పేఱుకుపోతాయి. Open mind, positive attitude, సౌభ్రాత్రం గట్రా అర్థహీన గగన కుసుమాల చెత్త ! వీటి గుఱించి పుస్తకాల్లో చదివి బుఱ్ఱ పాడుచేసుకుని వీటిని అలవఱచుకోవడానికి ఎవడైనా ప్రయత్నించాడో వాడి పని అయిపోయిందన్నమాటే. వాణ్ణి దోచుకోవడానికీ, వెధవాయిని చేసి ఆనందించడానికీ కుట్రలు మొదలవుతాయి. మంచివాళ్ళకీ, చెడ్డవాళ్ళకీ ఒక ప్రధానమైన తేడా ఉంది. చెడ్డవాళ్ళంతా సర్వసాధారణంగా నిస్సంకోచులూ, నిర్లజ్జులూ, నిస్సిగ్గు మనుషులు. ఈ పూట ఒకలా, ఱేపు ఇంకొకలా, ఎల్లుండి మఱొకలా కనిపించడానికీ, ప్రవర్తించడానికీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను వెనుదీయరు. అలా ఉంటే ఇతరులు ఏమనుకుంటారో ? అనే బిడియానికి ఇసుమంతైనా మనసులో స్థానమివ్వరు. ఒక రకంగా అలోచిస్తే, వాళ్ళు ప్రపంచాన్ని మంచివాళ్ల కంటే నాలుగాకులెక్కువే చదివినవారు. ప్రపంచం పశువుల్లాగా ఫక్తు వర్తమానవాది అనీ, దానికి ఏదీ అంతబాగా గుర్తుండదనీ, ఈ రోజు దానికి కోపమొచ్చినా, ఱేపు దాన్ని మంచి చేసుకోవచ్చుననీ, మన వర్తమాన స్థితిని బట్టి అది మనల్ని ఇట్టే క్షమించేస్తుందనీ కనిపెట్టినవాళ్ళు. సమాజం తెలివితక్కువతనాన్ని ద్వేషించినంతగా దుష్టత్వాన్ని ద్వేషించదు కనుక దుష్టుల మాట విన్నంత బాగా అది మంచివాళ్ళకి లొంగదు. ఒకడు మంచివాడని గ్రహించిన మఱుక్షణం అది అతన్ని లెక్కచేయడం మానేస్తుంది.

మారలేకపోవడమే మంచివాళ్ళ బలహీనత. ద్రోహులని తెలియక ద్రోహుల పట్ల మొదట్లో చూపించిన ఆదరాన్ని వాళ్ళు ద్రోహులని తెలిశాక కూడా ఉన్నపళాన వెంటనే ఉపసంహరించలేరు. ముందునుంచే నవ్వకుండా అంటీ ముట్టనట్లుగా ఉంటే, ఆ తరువాత తీఱిగ్గా ఆలోచించుకోవచ్చు అవతలివాళ్ళని ఏ దృష్టితో మన్నించాలనేది. అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం - ఏ అపరిచితుడూ ఇంకో అపరిచితుణ్ణుంచి తొలి పరిచయంలోనే సౌహార్దాన్నీ, దరహాసాల్నీ ఆశించడు. అటువంటప్పుడు ఆ శ్రమ తీసుకోవడం అవసరమా ? అని !

తాము మంచితనం అనుకుంటున్నది ఎందుకూ కొఱగానిదని మంచివాళ్ళు కూడా గ్రహిస్తారు - ఒక అప్పు పుట్టాల్సినప్పుడు, ఒక పదోన్నతి (promotion) కావాల్సినప్పుడు, ఒక సరిహద్దు తగాదా అయినప్పుడు, మన వల్ల ఉపకారం పొందినవాడు మనల్ని ఎదిఱించినప్పుడు ! నా దృష్టిలో - అసలు సమస్య ఉన్నది మనిషి మంచివాడు కావడంలో కాదు, దాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పడు, ఎవఱికి పడితే వారికి ప్రదర్శించడంలో !

అంత్యనిష్ఠూరమా ? ఆది నిష్ఠూరమా ?

నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం - ఏ సరికొత్త మానవసంబంధాన్నీ చిఱునవ్వుతో ప్రారంభించకూడదని ! మనం స్వతహాగా మంచివాళ్ళం కాకపోతేనే అది మనకొక అలంకారమౌతుంది. లేకపోతే అది మన బలహీనత అవుతుంది. కనీసం అలా చూడబడుతుంది. అవతలివాళ్ళ మంచీ చెడూ ఏమీ తెలియకుండానే, వాళ్ళు అడక్కుండానే వాళ్ళకి మనం పంచే ఈ మంచితనం, ఈ చిఱునవ్వులూ అడవి గాచిన వెన్నెల్లా దుర్వినియోగం కావచ్చు. అపరిచితులు మననుంచి ఏదైనా దోచుకోవడానికి గల అవకాశాన్ని, మన బలహీనతల్నిమన మంచితనంలో అన్వేషిస్తారు. నిజానికి మన దగ్గఱ అలాంటివేవీ లేకపోయినా అవి ఉన్నాయనే నమ్మకమూ, వాటికోసం ఒక ప్రయత్నం చేసి చూడొచ్చుననే భరోసా వాళ్ళకి కలుగుతాయి.

మానవ నాగరికతలో మనుషులు మేధాశక్తికిచ్చిన ప్రాధాన్యం చాలా గొప్పది. అసలు మేధాశక్తే అన్ని ఇతర మానవీయ లక్షణాలన్నింటినీ త్రోసిరాజని, అదొక్కటే మనిషి లక్షణంగా చెలామణి అవుతున్నది. ఇది ఎంత "అతి"గా పరిణమించిందంటే మేధాశక్తి మఱీయెక్కువ లేనివాళ్ళని, దాన్ని అతివినియోగం/ దుర్వినియోగం చెయ్యడానికి ఇష్టపడనివాళ్ళని సమాజంలో మనుషులుగా చూడ్డమే మానేశారు. వాళ్ళని అలా అమానవీకరించేశారు. అలా అది చివఱికొక అమానుష దృక్కోణంగా రూపుదాల్చింది. మళ్ళీ ఆ మేధాశక్తిలో కూడా ఒక రకం మేధాశక్తికే ఇనుమిక్కిలి ప్రాధాన్యం. ఎలాగంటే - చాలామంది దృష్టిలో మేధాశక్తి అంటే కృత్రిమత్వాల్ని అన్వేషించే లక్షణం మాత్రమే. అందుచేత కృత్రిమత్వాలు లేని ఒక మంచిమనిషి ఈ సమాజంలో ఫక్తు బుద్ధిహీనుడుగానే జమ. మన దృష్టిలో బుద్ధిహీనులకి భూమండలం మీద బతికే హక్కు లేదు. వాళ్ళు మన దయకీ, గౌరవానికీ పాత్రులు కారు. వాళ్ళని మనం యథేచ్ఛగా దోచుకోవచ్చు. వాళ్ళు మనచేత దోచుకోబడ్డానికే పుట్టారు. లేకపోతే మనుషులు జంతువుల మాంసం ఎందుకు తింటారు ? మనుషుల మాంసం ఎందుకు తినరు ? మంచివాడికి ఈ సమాజంలో ఉన్న విలువ అంతకంటే మఱీ యెక్కువేమీ కాదు. ఇక్కడ ఇచ్చినకొద్దీ పుచ్చుకునేవాళ్ళూ, చేసినకొద్దీ ఇంకా చేయించుకునేవాళ్ళూ లెక్కకు మిక్కిలి.

మఱి మంచితనాన్ని సమాజం బొత్తిగా హర్షించదా ? అనడిగితే, హర్షిస్తుంది. కానీ ఎవణ్ణి పడితే వాణ్ణి కాదు. తనకు సుదీర్ఘ కాలంలో ఉపయోగపడే మంచివాడు సమాజానికి యమా నచ్చుతాడు. అలాగే జీవితంలో తొంభైశాతం చెడు, పదిశాతం మాత్రమే మంచి ఉన్నవాడి మంచితనం సమాజదృష్టిని ఆకర్షిస్తుంది. పెద్దవాళ్ళని అలవోకగా హత్యచేసే అలవాటున్న గజదొంగ ఒక కుటుంబాన్ని యావత్తూ నిర్మూలించి వాళ్ళలో ఒక చిన్నపాపని మాత్రం చంపకుండా వదిలిపెట్టి వెళితే అతనిలో చావకుండా బతికి ఉన్న అరుదైన మానవత్వానికి గొప్ప పబ్లిసిటీ లభిస్తుంది. అదే, ప్రొఫెషనల్ రోజువారీ మంచివాళ్ళంతా చేతకాని చచ్చుదద్దమ్మల కిందే జమ. సమాజం సమర్థుల మంచితనాన్ని, సంపన్నుల మంచితనాన్ని, శక్తిమంతుల మంచితనాన్ని, టోకుగా విజేతల మంచితనాన్ని మాత్రమే హర్షిస్తుంది. తన జోలికీ, శొంఠికీ రాని, తన లోపాల్ని విమర్శించని, తన బలహీనతల్ని సంస్కరించడానికి ప్రయత్నించని వ్యక్తుల మంచితనాన్ని మాత్రమే అది మెచ్చుకుంటుంది. అదే సమయంలో మంచివాళ్ళు తెలివిగలవాళ్ళు కూడా కావడాన్ని అది ఎట్టి పరిస్థితుల్లోను భరించజాలదు.

ఒక యింట్లో అనేక సంవత్సరాల పాటు నివసించాక అక్కడ అవసరమైన వస్తువులతో పాటు అనవసరమైన వస్తువులు కూడా అనేకం పోగుపడతాయి. అలాగే వేలాది సంవత్సరాల మానవ నాగరికతలో కొన్ని అనవసర పదాలు పేఱుకుపోతాయి. Open mind, positive attitude, సౌభ్రాత్రం గట్రా అర్థహీన గగన కుసుమాల చెత్త ! వీటి గుఱించి పుస్తకాల్లో చదివి బుఱ్ఱ పాడుచేసుకుని వీటిని అలవఱచుకోవడానికి ఎవడైనా ప్రయత్నించాడో వాడి పని అయిపోయిందన్నమాటే. వాణ్ణి దోచుకోవడానికీ, వెధవాయిని చేసి ఆనందించడానికీ కుట్రలు మొదలవుతాయి. మంచివాళ్ళకీ, చెడ్డవాళ్ళకీ ఒక ప్రధానమైన తేడా ఉంది. చెడ్డవాళ్ళంతా సర్వసాధారణంగా నిస్సంకోచులూ, నిర్లజ్జులూ, నిస్సిగ్గు మనుషులు. ఈ పూట ఒకలా, ఱేపు ఇంకొకలా, ఎల్లుండి మఱొకలా కనిపించడానికీ, ప్రవర్తించడానికీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను వెనుదీయరు. అలా ఉంటే ఇతరులు ఏమనుకుంటారో ? అనే బిడియానికి ఇసుమంతైనా మనసులో స్థానమివ్వరు. ఒక రకంగా అలోచిస్తే, వాళ్ళు ప్రపంచాన్ని మంచివాళ్ల కంటే నాలుగాకులెక్కువే చదివినవారు. ప్రపంచం పశువుల్లాగా ఫక్తు వర్తమానవాది అనీ, దానికి ఏదీ అంతబాగా గుర్తుండదనీ, ఈ రోజు దానికి కోపమొచ్చినా, ఱేపు దాన్ని మంచి చేసుకోవచ్చుననీ, మన వర్తమాన స్థితిని బట్టి అది మనల్ని ఇట్టే క్షమించేస్తుందనీ కనిపెట్టినవాళ్ళు. సమాజం తెలివితక్కువతనాన్ని ద్వేషించినంతగా దుష్టత్వాన్ని ద్వేషించదు కనుక దుష్టుల మాట విన్నంత బాగా అది మంచివాళ్ళకి లొంగదు. ఒకడు మంచివాడని గ్రహించిన మఱుక్షణం అది అతన్ని లెక్కచేయడం మానేస్తుంది.

మారలేకపోవడమే మంచివాళ్ళ బలహీనత. ద్రోహులని తెలియక ద్రోహుల పట్ల మొదట్లో చూపించిన ఆదరాన్ని వాళ్ళు ద్రోహులని తెలిశాక కూడా ఉన్నపళాన వెంటనే ఉపసంహరించలేరు. ముందునుంచే నవ్వకుండా అంటీ ముట్టనట్లుగా ఉంటే, ఆ తరువాత తీఱిగ్గా ఆలోచించుకోవచ్చు అవతలివాళ్ళని ఏ దృష్టితో మన్నించాలనేది. అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం - ఏ అపరిచితుడూ ఇంకో అపరిచితుణ్ణుంచి తొలి పరిచయంలోనే సౌహార్దాన్నీ, దరహాసాల్నీ ఆశించడు. అటువంటప్పుడు ఆ శ్రమ తీసుకోవడం అవసరమా ? అని !

తాము మంచితనం అనుకుంటున్నది ఎందుకూ కొఱగానిదని మంచివాళ్ళు కూడా గ్రహిస్తారు - ఒక అప్పు పుట్టాల్సినప్పుడు, ఒక పదోన్నతి (promotion) కావాల్సినప్పుడు, ఒక సరిహద్దు తగాదా అయినప్పుడు, మన వల్ల ఉపకారం పొందినవాడు మనల్ని ఎదిఱించినప్పుడు ! నా దృష్టిలో - అసలు సమస్య ఉన్నది మనిషి మంచివాడు కావడంలో కాదు, దాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పడు, ఎవఱికి పడితే వారికి ప్రదర్శించడంలో !

Friday, November 13, 2009

Information on Diabetes మధుమేహం లేదా చక్కెర వ్యాధి


http://en.wikipedia.org/wiki/Diabetes_mellitus

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్  అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లుకోస్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా వ్యాధి ప్రబలి ఉన్నది. వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే 1 రకం, 2 రకం మరియు జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్). అయినా, అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవడమే . మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. రెండవ రకం డయాబెటిస్లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది, బీటా కణాలు డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్లో కూడా ఇన్సులిన్ నిరోధకత అగుపిస్తుంది.

జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కానీ మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటికీ, ఇన్సులిన్ ఉత్పత్తి లేని మొదటి రకంను నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు మరియు ఆంటీడయాబెటిక్ మందుల వాడకం వల్ల మరియు అప్పుడప్పుడు ఇన్సులిన్ వాడకం వల్ల నియంత్రించవచ్చు. ఇంతకుమునుపు ఇన్సులిన్ పందుల క్లోమాల నుండి తీయబడేది, ప్రస్తుతము చాలా వరకు ఇన్సులిన్ ఉత్పత్తి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులవల్ల ఉత్పత్తి చేయబడే ఇన్సులిన్ మానవ సహజ ఇన్సులిన్కు పూర్తి కాపీగా గాని, వివిధ ఆన్సెట్ అఫ్ యాక్షన్ మరియు యాక్షన్ చూపబడే సమయం ఉండే విధంగా తయారుచేయబడుతున్నాయి. ఇన్సులిన్ను ఇన్సులిన్ పంపు ద్వారా నిర్విరామంగా అవసరానికి తగిన విధంగా సరఫరా చేయవచ్చు.

డయాబెటిస్ వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. త్వరగా మరియు తీవ్రంగా (అక్యూట్) వచ్చే కాంప్లికేషన్స్హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ లేదా నాన్కీటోటిక్ హైపర్ఆస్మొలార్ కోమా వ్యాధిని సరిగా నియంత్రించుకోకపోతే రావచ్చు. తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్గా హృద్రోగాలు (రెట్టింపు ఆపద), దీర్ఘకాలిక మూత్రపిండాల బలహీనత, డయాబెటిక్ రెటినోపతి (రెటీనా చెడిపోవడం తద్వారా అంధత్వము కలుగుతుంది), డయాబెటిక్ న్యూరోపతి (చాలా రకాలైన నాడీ కణాలు చెడిపోవడం), మరియు సూక్షనాళికలు చెడిపోవడం వల్ల కలిగే పురుషత్వ లోపం మరియు గాయాలు త్వరగా మానకపోవడం ముఖ్యమైనవి. గాయాలు సరిగా మానకపోవడం వల్ల ముఖ్యంగా కాళ్ళలో గాంగ్రీన్ రావడం వల్ల ఒక్కోసారి అవిటితనం కూడా రావచ్చు. డయాబెటిస్పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం మరియు దైనందిన విషయాలలో మార్పులు చేసుకోవడం వల్ల (సిగరెట్లు మానివేయడం లాంటివి) మరియు ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం చేస్తే పైన చెప్పబడిన చాలా వరకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అభివృద్ది చెందిన దేశాలలో యుక్తవయస్కులలో అంధత్వానికి, మూత్రపిండాలు దెబ్బతిని డయాలిసిస్ అవసరమయ్యే డయాబెటిక్ నెఫ్రోపతికి అతి ప్రధాన కారణం డయాబెటిస్ .

వ్యాధి లక్షణాలు

మధుమేహం యొక్క లక్షణాలలో సాంప్రదాయిక త్రయంగా పాలీయూరియా (అతిగా మూత్రం రావడం), పాలీడిప్సియా (దాహం వేయడం) మరియు పాలీఫాజియా (అతిగా ఆకలి వేయడం) అను వాటిని చెప్పుతారు. మొదటి రకం డయాబెటిస్లో లక్షణాలు త్వరగా అగుపిస్తాయి (ముఖ్యంగా చిన్న పిల్లలలో). కానీ, రెండవ రకంలో మాత్రం వ్యాధి లక్షణాలు చాలా నెమ్మదిగా మొదలవుతాయి, ఒక్కోసారి లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా. మొదటి రకం డయాబెటిస్ వల్ల కొద్ది సమయంలోనే గుర్తించదగిన బరువు తగ్గడం (మామూలుగా తిన్నా, అతిగా తిన్నా కూడా) మరియు అలసట కలుగుతుంటాయి. ఒక్క బరువు తగ్గడం తప్ప మిగతా అన్ని లక్షణాలు, సరిగా నియంత్రణలలో లేని రెండవ రకం డయాబెటిస్ రోగులలో కూడా కనిపిస్తాయి. మూత్రపిండాల సామర్థ్యాన్ని దాటి రక్తంలో గ్లుకోస్ నిలువలు పెరిగితే, ప్రాక్సిమల్ టుబ్యూల్ నుండి గ్లూకోస్ రీఅబ్సార్ప్షన్ సరిగా జరగదు, కొంత గ్లూకోస్ మూత్రంలో మిగిలిపోతుంది. దీనివల్ల మూత్రం యొక్క ద్రవాభిసరణ పీడనం పెరిగి నీటి రీఅబ్సార్ప్షన్ ఆగిపోతుంటుంది, దానివల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది (పాలీయూరియా). కోల్పోయిన నీటి శాతాన్ని రక్తంలో పునస్థాపించడానికి శరీర కణాలలోని నీరు రక్తంలో చేరుతుంది, దీని వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్లో గ్లూకోస్ పేరుకుపోయి దృష్టి లోపాలను కలుగజేస్తుంది. చూపు మందగించడం అనేది మొదటి రకం డయాబెటిస్ఉందేమో అనే అనుమానాన్ని లేవనెత్తడానికి ముఖ్య కారణం.

రోగుల్లో (ముఖ్యంగా టైప్ 1) డయాబెటిక్ కీటో అసిడోసిస్ కూడా ఉండే అవకాశాలున్నాయి. దీనివల్ల మెటబాలిసమ్ నియంత్రణ కోల్పోయి శ్వాశలో అసిటోన్ వాసన రావడం, శ్వాశవేగంగా పీల్చుకోవడం, కడుపులో నొప్పి మొదలగు లక్షణాలు అగుపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే కోమా తద్వారా మరణం సంభవించవచ్చు. అతి అరుదైనదైనా తీవ్రమైన టైప్ 2 లో కలిగే నాన్ కీటోటిక్ హైపర్ ఆస్మొలార్ కోమా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కలుగుతుంది.

మధుమేహము రెండు రకాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మొదటి రకం మరియు రెండవ రకం అని రెండు వర్గాలుగా విభజంచబడినది (అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కూడా ఇదే పద్ధతిని పాటించింది). సాధారణంగా దీనిని గుర్తించడంలో జాప్యం జరుగుతుంటుంది. ఐతే, రెండు వ్యాధి లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వ్యాధికి చెయ్యవలసిన వైద్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 జూన్ లో కొన్ని ప్రామాణికాలను నిర్ణయించింది.

డయాబెటిస్ అనగానే డయాబెటిస్ మెల్లిటస్ స్ఫురిస్తుంది. కొన్ని అరుదైన వ్యాధులను కూడా డయాబెటిస్ అంటారు. వాటిల్లో డయాబెటిస్ ఇన్సిపిడస్ ముఖ్యమైనది, మూత్రపిండాలు లేదా పీయూష గ్రంధి (pancreas)పాడవడం వల్ల కలిగే, వ్యాధిలో మూత్రము చప్పగా ఉంటుంది.

ముఖ్యమైన రెండురకాలైన డయాబెటిస్ మెల్లిటస్ రకాలు టైప్ 1 మరియు టైప్ 2. టైప్ 1 డయాబెటిస్ అనే పదము ఇంతకుముందున్న జువెనైల్-డయాబెటిస్, ఇన్సులిన్ డిపండెంట్ డయాబెటిస్ వంటి పదాలకు ప్రస్తుతం వాడుకలో ఉన్న పదం. అలాగే టైప్ 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ వంటి వాటికి ప్రత్యమ్నాయంగా వాడబడుతుంది.

డయాబెటిస్ మెల్లిటస్ మొదటి రకం

టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్, క్లోమ గ్రంధిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలు సంఖ్యలో తగ్గిపోవడం లేదా నశించడం వల్ల ఏర్పడే ఇన్సులిన్ కొరత వల్ల కలుగుతుంది. ఆటోఇమ్మ్యూనిటీ వల్ల టి-కణాలు బీటా కణాలపై దాడి చేయడం ముఖ్యకారణం. ప్రస్తుతము తెలిసిన ప్రొఫైలాక్సిస్ ఏమీ లేదు. వ్యాధి ప్రారంభానికి ముందు ఆరోగ్యంగా ఉండి మంచి బరువును కలిగి ఉంటారు. వ్యాధి పెద్దలలో గానీ పిల్లలోగాని ఎవరిలోనైనా రావచ్చు. కానీ సాంప్రదాయకంగా చిన్న పిల్లలలో వచ్చే వ్యాధిని 'జువినైల్ డయాబెటిస్' అని అంటారు. వ్యాధికి చికిత్స, ప్రారంభదశలోనైనా సరే, జాగ్రత్తగా రక్తంలోని గ్లుకోస్ నిలువలను గ్లుకోమీటర్లతో కనిపెట్టుకుంటూ ఇన్సులిన్ వాడడమే. శరీరంలో ఇన్సులిన్ సరిపడినంతగా లేకపోతే డయాబెటిక్ కీటో అసిడోసిస్ ద్వారా కోమా లేదా మరణం సంభవించవచ్చు. చికిత్సా విధానంలో ప్రస్తుతం లైఫ్స్టైల్ మార్పులు (ఆహార అలవాట్లు మరియు శారీరక శ్రమ) కూడా చేర్చారు. ఇన్సులిన్ను సబ్క్యుటేనియస్ ఇంజెక్షన్ల ద్వారానే కాకుండా ఇన్సులిన్ పంపుల ద్వారా కూడా అందించవచ్చు. 
 

Your browser may not support display of this image.  

Your browser may not support display of this image.

టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్

టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఇన్సులిన్ నిరోధకత (insulin resistance) వల్ల కలుగుతుంది. కొన్ని సందర్భాలల్లో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గవచ్చు. కణ త్వచంలో ఉండే ఇన్సులిన్ రిసెప్టార్లు (insulin receptor) వివిధ శరీర భాగాల్లో సరిగా విధిని నిర్వర్తించకపోవడం ముఖ్య కారణంగా భావిస్తారు. ప్రారంభ దశలో ఇనులిన్ నిరోధకత వల్ల రక్తంలో ఇన్సులిన్ నిలువలు పెరుగుతాయి. సమయంలో హైపర్గ్లైసీమియాను చాలా వరకు మందుల ద్వారా నివారించవచ్చు. మందులు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం కానీ కాలేయంలో గ్లుకోస్ ఉత్పత్తిని గానీ తగ్గిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ఎందువల్ల వ్యాపిస్తుందో తెలిపేందుకు చాలా సిద్దాంతాలు వివరించబడ్డాయి. సెంట్రల్ ఒబెసిటీ (నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం) ఇన్సులిన్ రెసిస్టన్స్కు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న 55% రోగులలో ఒబెసిటీ ఉన్నట్టుగా గుర్తించబడినదిఇతర కారణాలుగా వృద్దాప్యం మరియు డయాబెటిస్కు సంబంధించిన కుటుంబం చరిత్రలను చెప్తారు. గడిచిన దశాబ్దంలో వ్యాధి చిన్న పిల్లలు మరియు యుక్త వయస్కులలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది, దీనికి కూడా ఒబెసిటీనే కారణంగా గుర్తించారు.

టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు ఆరంభ దశలో అంత సులువుగా గుర్తించడం సాధ్యపడదు, దానివల్ల తరవాతి దశలో గుర్తించకపోవడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల మూత్ర పిండాలు చెడిపోవడం, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు మందగించడం జరుగుతాయి. రకమైన వ్యాధిని మొదట వ్యాయామం, ఆహారంలో కార్బోహైడ్రేట్లను నియంత్రించడం మరియు బరువు తగ్గించడం ద్వారా నియంత్రిస్తారు. వీటివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. తరవాత యాంటీ డయాబెటిక్ మందుల ద్వారా నియంత్రిస్తారు. చికిత్స కూడా పనిచేయకపోతే ఇన్సులిన్ వాడుక తప్పనిసరి అవుతుంది.

జాగ్రత్తలు

చక్కెరవ్యాధిగ్రస్తులు జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.

  • రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
  • భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
  • ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
  • ఇన్సులిన్వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.
  • మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.
  • పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
  • గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
  • ఇన్ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్సలహాతో యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇన్సులిన్తీసుకోవాలి.
  • అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్సలహా మేరకు చేయించుకోవాలి.
  • మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్అనే ప్రొటీన్విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్ఉందా లేదా కనుగొనాలి.
  • మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్మిల్పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్పరిమాణాన్ని తెలిపే లిపిడ్ప్రొఫైల్పరీక్షలు చేయించాలి.
  • ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
  • రక్తంలో త్వరగా కరిగిపోయే పీచుపధార్ధాలను కలిగి సోడియం కొలెస్టృఆలు లేని జామపండు మధుమేహ వ్యాధిగ్రస్థులు తినతగిన పండ్లలో ఒకటి.మధుమేహాన్ని నియంత్రిస్థుందని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది.

ఆయుర్వేదంలో మధుమేహం

వేదకాలంలో మధుమేహ ప్రస్తావన ఉంది. కాలంలో మధుమేహాన్ని అశ్రవ అనే పేరుతో గుర్తించారు. వ్యాధి ఎలా వస్తుంది వ్యాధి లక్షణాలు ఏమిటి అని చరక సంహిత ,శుశ్రవసంహిత మరియు నాగబట్ట గ్రంధాలలో వర్ణించబడింది.క్రీస్తుశకానికి వెయ్యి సంవత్సరాల క్రిందట వ్యాధి వర్ణన ఉంది. యజ్ఞాలలో సమయాలలో దేవతలకు సమర్పించబడే హవిస్సును భుజించడం వలన ఈవ్యాధి వచ్చినట్లు వర్ణించబడింది.దక్షప్రజాపతి చేసిన యజ్ఞంలో హవిస్సు భుజించడం వలన వ్యాధి వచ్చినట్లు ప్రస్తావన ఉంది.క్రీస్తు శకం ఆరవ శతాబ్ధంలో అష్టాంగ హృదయ అనే గ్రంధంలో మధుమేహం అనే పదం వాడబడింది. తేనెను మధువు అని అంటారు కనుక వ్యాధిగ్రస్థుల మూత్రం తేనెరంగు ఉంటుందని దీనికి పేరు వచ్చిందని భావన.1400 సంవత్సరాల క్రితమే వ్యాధికి పథ్యం,ఔషధం మరియు వ్యాయామంతో క్రమపరచవచ్చని పేర్కొన్నారు.దాదాపు ఇప్పటికీ అనుసరిస్తున్న విధానం అదే కావడం గమనార్హం.

ఆయుర్వేదంలో గుర్తించిన వ్యాధి కారక అలవాట్లు.

  • అతిగా పాలుత్రాగడం.పాల ఉత్పత్తులు భుజించడం.
  • అతిగా చక్కెర ఉపయోగించడం.చక్కెర రసాలు త్రాగడం.
  • క్రొత్తగా పండిన ధాన్యాలను వంటలలో వాడడం.
  • తాజాగా చేసిన సురను(మధువును) సేవించడం.
  • అతిగా నిద్ర పోవడం మరియు శరీరశ్రమ కావలసినంత చేయకపోవడం.
  • మానసిక ఆందోళన,భారీ కాయం మరియు అహారపు అలవాట్లు.
  • ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం.ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం.అతిగా ఆహారం తీసుకోవడం.

మానుకోవలసిన అలవాట్లు

  • తీపి పదార్థాలు, ఐస్క్రీములు మానుకోవాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గించాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
  • కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్సూచిస్తే ఇన్సులిన్తీసుకోవాలి. తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు. కారణంగా ఇన్సులిన్తీసుకోవడానికి వెనుకాడకూడదు.
  • పాదరక్షలు లేకుండా నడవకూడదు.
  • పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
  • మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
  • కొలెస్ట్రాల్అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.
 

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070