Friday, February 5, 2010

Time is ????

Ordinary people merely think how they shall spend time; a man of talent tries to use it efficiently.

Benjamin Franklin a great scientist said “Remember that time is money.. Time lost is never found again.”

Time is so fleeting that if we do not pray to God in our youth, old age may find us incapable of thinking about Him.- Hans Christian Andersen

Time is - Too slow for those who wait.

Time is - Too swift for those who fear.

Time is - Too long for those who grieve.

Time is - Too short for those who rejoice.

But for those who know it time is everything

“I recommend you to take care of minutes, for hours will take care of themselves. “ Said Phillip Dormer Stanhope.

When a new work arose in an International company, the people were wondering to whom to allocate this new work. Then the HRD expert suggested that it should be allocated to the busiest person in the organization. A busiest person will some how a find a way to do new thing. Those who have most to do, and have a will to work, will find most of the time.

To realize the value of ONE YEAR, ask a student who failed.

To realize the value of ONE MONTH, ask a mother who gave birth to a premature baby.

To realize the value of ONE WEEK, ask the editor of a weekly newspaper.

To realize the value of ONE HOUR, ask the lovers who are waiting in a  bus stop.

To realize the value of ONE MINUTE, ask a person who missed the train.

To realize the value of ONE-SECOND, ask a person who just avoided an accident.

To realize the value of ONE MILLISECOND, ask the person who won a silver medal in
the Olympics.

Did you know that you have 84,600 seconds deposited in your time bank account every day? Every night you lose whatever time you do not use. You can't buy time, and you can't save it. You can only spend it, and if you fail to spend it, you waste it. How are you spending your time?

ఆలోచన-ఆయుధం

కెరటాలపై తేలుతూ,   ఆటుపోట్లను  ఎదుర్కొంటూ,  నీటి  మీద  నిలదొక్కుకుంటూ, నావ  గమ్యం  చేరడానికి  చుక్కాని  మీద  నియంత్రణ  ఎంత  అవసరమో...

మనిషి  జీవితంలో కూడా  కష్ట, సుఖాలను  ఎదుర్కొంటూ, ఆనందడోలికల్లో  తేలియాడుతూ   గమ్యాన్ని/లక్ష్యాన్నిచేరడానికి  "ఆలోచనల" మీద  నియంత్రణ  కూడా  అంతే  అవసరం..

మానవ జీవితాన్ని  దిశా, నిర్దేశం  చేసేది  మరియు ముందుకు నడిపే చుక్కాని కూడా   "ఆలోచన" లేదా "ఆలోచనల సముదాయమే" .. నా ఈ జీవిత అనుభవాల పరంపరలో నేను నేర్చుకున్న నీతి, తెలుసుకున్న సత్యం "అన్నిటికి మూలం ఆలోచనే" అని. 

ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలంటే దాని గురించి ప్రతి క్షణం (లేక ఎక్కువ సేపు)  ఆలోచించగలిగితే చాలు..ఖచ్చితంగా  అనుకున్నది సాదించగలిగే శక్తీ, యుక్తి తో పాటు అనుకున్నది తొందరగా  సాదించటానికి వీలవుతుంది.  అది చదువు , ఉద్యోగం , స్నేహం,  ప్రేమ,
లక్ష్యం కావొచ్చు, మరేదైనా కావొచ్చు... అది ఎంత చిన్నదైన లేక ఎంత పెద్దదైన కావొచ్చు విజయం నీ ముంగిట అనతికాలంలోనే రెక్కలు కట్టుకొని వాలుతుంది.

మానవ జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దోకోవడానికి  కావాల్సిన ఒకే ఒక ఆయుధం "ఆలోచన" ... ఆలోచనలు మంచివైతే నీ పయనం మంచి వైపు...
ఆలోచనలు  చెడువైతే నీ దారి చెడువైపు...

ఆలోచనలు  - మాటలుగా 
మాటలు - చేతలుగా చేతలు - ఇస్టాలుగా
ఇస్టాలు - అలవాట్లుగా (ఆచరణలు)
అలవాట్లు - స్వభావాలుగా  (వ్యక్తిత్వంగా )
స్వభావాలు - తలరాతలుగా  పరివర్తన చెందుతాయి..

అంటే ఒక్క నీ ఆలోచనల సమాహారమే నీ జీవితాన్ని నడిపే ఆయుధం... నీ మాటే నీవు సృష్టించుకొనే ప్రపంచం  (Word Makes World) ... కావున


చెడు ఆలోచనలను నియంత్రించుకో...
మంచి ఆలోచనలను పెంపోదించుకో...
ఆనందకరమైన పరిసరాలను సృష్టించుకో..
మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకో..
మంచి సమాజాన్ని సృష్టించుకో..
అందరికి ప్రేమను పంచుతూ..అందరికి సేవ చేసుకొంటూ.. జీవిత లక్ష్యాన్ని చేరుకో...   

జీవిత సమరంలో కష్టాల్, సుఖాల్, దుఖాల్ ఏమి ఎదురైనా మొక్కవోని దైర్యంతో, మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుకో... ఈ ప్రపంచాన్ని అంతటా ప్రేమను పంచే ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దుకో.... ఇందుకు నీ  వంతుగా మంచి ఆలోచనలు అభివృద్ధి  చేసుకో.... 

మీ "అమ్మ"  శ్రీనివాస్  


ఆది నుంచి ఆకాశం మూగది.....
అనాదిగా తల్లి ధరణి మూగది...
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు...
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు...ఇన్ని మాటలు..

Thursday, February 4, 2010

నా అంతరంగం (అనంతరంగం)

 

మనసంత ఆహ్లాదO, వళ్ళంతా ఉరిమే ఉత్సాహం, మోముపై సిగ్గుతో కూడిన నవ్వు, మదిలో ఆమె ఆలోచనలు...

మనసుకు ఎప్పుడూ దొరకనంత ప్రశాంతత, ఇంకా ఇంకా పొందాలి అనిపించే అనుభూతి అది.. 

వర్ణనాతీతO ఆ ఉద్రేకo, ఆ భావనలో అందరు మంచి వాళ్ళే, ఎటు చూసినా ఆనందమే, సంతోషమే, 

చేసే పనిలోనే నిరుత్సాహం..మనసులో ఏవేవో ఆలోచనలు, భవిస్యత్తు పై ఆకాంక్షలు......

నునువెచ్చని గ్రీష్మంలా...మావిచిగురు తిన్న కోయిలలా .....పిల్లలకి పాలిస్తున్నతల్లి పొందే అనుభూతిలా అదో వింత మధురానుభూతి..

జీవితంపై కొత్త ఆశలు , తొంగిచూస్తున్న ఏవేవో కొత్త తలపులు, అనుభూతులు..ఆలోచనలు… 

ఎడారిలో ఒయాసిస్సులా ప్రేమపై ఆలోచనలు... కవితలుగా మారుతున్న పదాలు, భావనలు

సర్వరాజు. శ్రీనివాస ప్రసాద్ రావు 

అలుపన్నది ఉందా

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు

నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నాసేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు

నీచూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే తొలి ఆశలకు

మనలో మనకు విశ్వాసం


మనలో మనకు విశ్వాసం అనవరతం
భువిలో తుదకు సొంతం అభ్యుదయం
సృష్టిలో అందరి దేవుళ్ళకు మొక్కినాలేదు లాభం
దృష్టిలో శక్తిధర చూపులకు చేరకలదు మోక్షం

ధీరుల జీవితగాధల సంపుటం ప్రపంచ చరిత్ర
వీరుల త్యాగానిరతుల సంయుక్తం శోభిత ధరిత్రి
భగవంతుని యందు అవిశ్వాసం నాస్తికత్వం అన్నది గతం
ఆత్మశక్తిని పొందు అలక్ష్యం నాస్తికత్వం అన్నది నిజం

లేదు అసాద్యం ఈ భువిని కార్యసాధకునికి
పొందు నిరంతరం ఈ బలాన్ని సంకల్పవిజయానికి
బలహీనతల సాంగత్యం అనుకరణ మారుస్తుంది బలహీనునిగా
శక్తియుక్తుల అనుసంధానం సమాలోచన చేస్తుంది బలవంతునిగా


దుర్బలత్వం బలహీనతలు నిత్యప్రయాస కలిగిస్తాయి దైన్యం
ద్రుడసంకల్పం దైర్యసాహసాలు అకుంఠితదీక్ష పుట్టిస్తాయి ధైర్యం
నీ లక్ష్యాలు విడనాడకు సడలిపోకు భీరుల వాక్కులతో
నీ తలపులు మార్చుకోకు వదలిపెట్ట్తకు క్రౌర్యుల అక్రుత్యాలతో

చలించని మనఃస్థైర్యం నైపుణ్యపటిమే లక్ష్యసాధన మార్గం
విస్త్రుత ఊహాసంకల్పం పరిపూర్ణచైతన్యమే అనంతజీవిత పథం
మేలుకో జాగరూకుడవై మసలుకో సకలకాల సర్వావస్తలందు
చేరుకో కార్యసూరుడవై కదలిపో ప్రయత్నాల పూర్ణావస్తయందు


కష్టాల ముగింపు చేయగలశక్తి అవసారాల వైపు ప్రయాణశక్తి
బలహీనతలను జయించగలశక్తి విజయము వైపు ఏకాగ్రతాశక్తి
దాగివున్నాయి నీ అంతరంగములో ప్రత్యక్షమవుతాయి నీ సర్వకార్యములలో
నిలుస్తాయి నీ సంరక్షణలో ప్రేరేపిస్తాయి నీ పురోభివ్రుద్దిలో

ధైర్యముతో నిలబడు సంపూర్ణబాద్యతతో చొరబడు
నమ్మకముతో ప్రయత్నించు అనంత ఆత్మశక్తి తో సాధించు
మచ్చలేనిచిత్తశుద్ది పవిత్రఅంతరంగం కారణం వివేకస్పూర్తికి
స్వీయశిక్షణాప్రవృత్తి వ్యక్తిత్వం సోపానం చైతన్యస్పూర్తికి

భావించు నిన్నునీవు సర్వశక్తివంతునిగా
విజ్రుంభించు కార్యసాధనవైపు ఉత్తుంగతరంగముగా
చింతించకు దిగులుచెందకు లేవని ఆస్తిపాస్తులు
గుర్తించు గమనించు నీలోని మానసికశక్తులు

అనంత దైవజ్వాలా కణజాలం మనదేహం
నిరంతర ప్రజ్వలా శోభితం మనమస్తిష్కం
సృజించగలం సాధించగలం మన ఆలోచనలు సమస్తం
మార్చగలం మలచగలం మన సమస్యలు ఆసాంతం

జీవించటము అంటే......


నీవలన చిరునవ్వుపొందిన మోములు
నీవలన ఆనందమయమైన మనస్సులు
నీవలన గమ్యముదొరికిన మనుషులు
నీవలన విజ్ఞానవంతమైన జనులు

దానినే అంటారు జీవించటము......

నీ రాక కోసము ఎదురుచూసే చూపులు
నీ మాట కోసము రిక్కించిఉండే చెవులు
నీ శ్రేయస్సు కోసము ప్రార్దించే చేతులు
నీ విజయాల కోసము కలలుకనే కన్నులు

దానినే అంటారు జీవించటము......

ప్రామాణికాలుగా మారిన నీ జీవిత సంఘటనలు
విలువలుగా మారిన నీ వ్యక్తిగత సూత్రాలు
మార్గదర్శకముగా మారిన నీ నియమబద్ద నిర్ణయాలు
పరిశోదనలుగా మారిన నీ పరిష్కార ప్రభోదనలు

దానినే అంటారు జీవించటము......
వెంటరావు ఆస్తుల కోసము మన వెంపర్లాటలు
కలసిరావు ధనము కోసము మన కర్కోటకాలు
నడచిరావు కీర్తి కోసము మన నానాపాట్లు
తోడురావు కోరికల కోసము మన తత్తరపాట్లు

మనం మార్చిన పరిస్థితులు మనం కూర్చిన సిద్దాంతాలు
మనం దిద్దిన జీవితాలు మనం ఇచ్చిన ఉత్పత్తులు
మనం చేసిన మంచిపనులు మనం ఓదార్చిన హృదయాలు
మనం నిలపెట్టిన నిజాలు మనం పంచిన ప్రేమలు

అవే మనకు మిగిలేది అవే మనతో వచ్చేది
అవే మనకు దక్కేది అవే మనతో నిలబడేవి
అవే మనకు సంత్రుప్తులు అవే మన ఆనందాలు
అవే శాశ్వత సత్యాలు అవే నిరంతర నిక్షేపాలు

ఇదే మానవ జీవిత సారం......
దానినే అంటారు జీవించటము......

---- ప్రభాకర రావు కోటపాటి

యువకులకు స్పూర్తి భగత్ సింగ్ (September 27, 1907 – March 23, 1931)




పాల్గొన్నావు పదిహేడేళ్ళ ప్రాయాన సహాయ నిరాకరణ ఉద్యమమందు 
నిలిచావు లాలాలజపతిరాయి సరసన సైమన్ కమీషన్ నిరసనందు
అమలుపరిచావు ఆంగ్లపాలకుల భాహిష్కరణ పధకాలను వీర ఉద్వేగమందు
గడిపావు జైలు జీవితాన్ని దేశమాత విముక్తి ప్రేరణయందు  
మారలేదు  నీ ఆత్మవిశ్వాసము ప్రతికూల పరిస్తితులందు
వీడలేదు నీ స్వాతంత్రావేశము ముష్కరుల ప్రలోభమందు
చెదరలేదు నీ ధీరోదాత్తము నియంతల రక్త దాహమందు 
కదలలేదు నీ విప్లవసామర్ధ్యము దుర్భలుల దురాఘాతమందు
నీ కన్నులు కన్నాయి దేశఉజ్యలభవిష్యత్తు కలలలో
నీ ఉహాలు ఊగాయి స్వేచ్చాభారత విహంగాలలో  
నీ మాటలు సాగాయి ఉత్ప్రేరిత తరంగాలలో
నీ రచనలు రాసాయి ప్రజ్యలిత ప్రకరాణాలలో
జాతి కోసము పని చేసావు ప్రానాంకిత భావనతో  
దేశముకోసము కదిలి సాగావు క్రియాశీల త్రికరణశుద్ధితో  
ప్రజలకోసము జ్వలింప చేసావు మార్గదర్శకమైన ఆత్మశక్తితో
ఉజ్వలభారతికోసము ప్రాణాలు అర్పించావు ఇరవైమూడేల్లప్రాయముతో 
నీవు  దర్శించిన ఆ స్వేచ్చా భారతి ఆవిష్కరించపడింది......కానీ......పెరుగుతోంది.........
మానశిక ప్రలోభులైన యువత
దుర్వ్యసనాల అశ్రితులైన నవరక్తం
ర్యాగింగ్ పిపాసులైన విద్యార్ధిలోకం
యాసిడ్ దారులైన రాక్షసలోకం
అమలు జరుగుతున్నాయి........

లక్ష్యరహిత జీవన విధానాలు
పాశ్చాత్య సంస్కృతి బానిసతత్వాలు
నిరంతర వినోదపూరిత  వికృత చేష్టలు
సోదర సోదరీ పీడిత స్వార్ధ భరిత ప్రణాలికలు
ఓ వీరకిశోరమా ఆవహించి కరుణను కల్గించు ఆ ఉన్మాదులలో 
ఓ భారతరత్నమా ప్రసరించి ప్రేమను ప్రేరేపించు ఆ ప్రభుద్దులలో 
ఓ  యువచైతన్యమా సంరక్షించి సేవను సంస్కరించు ఆ కీచకులలో
ఓ ఉత్తేజితతరంగమా జ్వలించి వెలుగును వెదజల్లు ఆ అధములలో 

వెళ్ళిపోయారు ఆంగ్లేయులు........వదలిపోలేదు సోమరితనము
కదలిపోయారు సామ్రాజ్యవాదులు........సమసిపోలేదు వ్యక్తిగతబలహీనతలు  

అందుకే........ఆవహించు....నడిపించు....రగిలించు....కదిలించు....యువతను.....
వ్యక్తి అభివృద్ధి.... దేశభక్తి.... లక్ష్యసిద్ది....విచక్షణాశక్తి ....ప్రాతిపదికగా.....నడిచే......

రెండవ భారత జాతీయోద్యమము వైపు..................
                                        ------ప్రభాకర రావు కోటపాటి

పరిత్యజించవలసిన పదహారు దురలవాట్లు



పొందేవు పొగత్రాగి పరమానంద డోలికలు
గుర్తించకున్నావు గుప్తంగా శరీరమందు చీలికలు

మునిగిపోయేవు మధ్యమందు తేలియాడి తెలియనిలోకాలలో
తెలుసుకోలేవు తీవ్రంగాజరిగే కర్కశకోత కణజాలములలో

ఆస్వాదించేవు అతిరుచిప్రాదాన్య ఆహారమును సర్వమనేభావనలో
ఆహ్వానిస్తున్నావు అనారోగ్యాన్ని అనాలోచిత ఆనందాన్వేషణలో

కోరిచూసేవు కాలక్షేపముగా హింస కామపూరిత చిత్రములను
మరచిపోయేవు మానసికముగా దహించుకుపోయే దురాలోచనలను

విహారముచేసేవు విందులతో వినోదాలతో జీవితకాలాన్ని
జీర్నించుకోలేకున్నావు జీవన గమ్యరాహిత్యము లక్ష్యలేమిల నిర్జీవసామ్యాన్ని

వేర్రులుచాచేవు విలాసభారిత అవసరాలకొరకు ధనార్జనదారులందు
మునిగిపోతున్నావు మార్గరహితముగా ఉండిపోతున్నావు అప్పులవూబులందు

జీవనం సాగించేవు నిర్లక్ష్యముగా సోమరితనముతో బద్దకప్రపంచములో
ప్రయాణిస్తున్నావు అనాలోచితముగా అంధకారభూయిష్ట నిశ్రుహప్రపంచములో

కాలక్షేపముచేసేవు కాలహింసతో భావించి కాలము విలువలేని వస్తువని
విలువకట్టలేకున్నావు ఒక ఘడియ తిరిగిరాని సంపాదించలేని వజ్రసమానమని

బ్రమించేవు కులప్రీతి పరమతద్వేషములను ఘనకార్యయుక్తమని
విస్మరిస్తున్నావు సమైక్యత స్నేహపూరితసమాజము అభివృద్దికారకమని

అర్రులుచాచేవు అక్రమసంపాదన లంచములకోరకు స్వార్ధమే ధ్యేయమని
కానకున్నావు అది కాలసర్పమై సమస్తప్రజలను హరించివేస్తుందని

చొరబడి చొచ్చుకొని సాగేవు అడ్డదారులలో తాత్కాలిక లాభార్జన వృత్తి ధర్మమని
అర్ధముచేసుకోలేకున్నావు పరులసేవలో ఆనంద పారవశ్యం పొందగలవని

కొనసాగించేవు అబద్దము అవినీతి అసూయద్వేషాలతో అనుక్షణ సహజీవనము
త్యజిస్తున్నావు విశ్వాసము నిజాయితి సంప్రాప్తింప చేసే అనంత ఐశ్వర్య సర్వస్వము
మోహించేవు అహంభావము ఆవేశములను అద్భుత అలంకారములుగా
చూడలేకున్నావు అనుభందము అత్మీయతలను వ్యక్తిత్వశోభిత జ్యోతులుగా
ప్రతిభాశాలిగా విర్రవీగేవు విశ్వవిజ్ఞానిగా అప్రయోజకపఠనముచేసి అజ్ఞానముతో
అస్వాధించలేకున్నావు నిరంతర విద్యార్థిగా అనంత శాస్త్రరహస్యాలను వినయముతో

అభివర్నించేవు పవిత్రప్రేమగా ఆకర్షణ ఆత్మవంచనలకు ఆదిపీఠము వేసి అద్భుతముగా
చేరుకోలేకున్నావు శాశ్వత ప్రేమను మానసిక సౌందర్యాలను అంతర్గత విలువల ఆధారముగా

పొంగిపోయేవు విదేశీ సంస్కృతి విచ్చలవిడితనముతో సర్వస్వతంత్ర జీవన మాధుర్యమని
పొందజాలకున్నావు భరత సంస్కృతి మాత్రువాత్సల్యముతో సంరక్షించి నీకై దాచిన విజ్ఞానగని

పరిత్యజించు ఈ పదహారు దురలవాట్లను నిస్సందేహముగా
పరివర్తనచెందు క్రియాశీల దేశభక్తి సంపన్న సమాహారముగా
----ప్రభాకర రావు కోటపాటి

విద్య

విద్య దాగిలేదు పుస్తకాలలో.. విద్య దాగిఉంది మానవుల మస్తాకాలలో...... దాగి ఉన్న ఆ విద్యను వెలికితీసి మేల్కొలిపే ప్రయత్నమే నా ఈ యజ్ఞం.......

సంరక్షించు నీ తోటి మానవులను


కాలం కాని కాలం లొ కాలసర్పాలను పోలిన వర్షాలు
పొరలి పొంగి ప్రళయంలా ప్రవహంచిన నదులు
మునిగి మగ్గి మ్రుత్యుభాదతొ మనస్సు చలించిన భాదితులు
చెదరిపొయి చేయలేక చేతగాక చేస్టలుడిగిన ప్రజలు
జీవులను జీవితాలను జనావాసాలను జలదరింపచేసిన జలప్రళయం

వీక్షించి విలవిలలాడి విరాలాలిచ్చిన కార్పోరేట్ సంస్థల ఉద్యోగులు
సందర్శించి సమీక్షించి సహకరించిన నిర్వాహకులు
తరలివచ్చి తమదర్మాన్నిపాటించిన త్యాగధనులైన యువకులు
సమయాన్ని వెచ్చించి స్వార్దరహితముగా సేవలుచెసిన స్వచ్చందసేవకులు
పర్యవేక్షించి ప్రతిక్షణము పొత్సాహించిన దిశానిర్దేశకులు
అనుకోని ఆప్తులను వస్తువులను చూసి ఆశ్చర్యముతో ఆనందపరవసులైన వరదభాదితులు
సంచి మరియు పుస్తకాలను చూసి సంబరముతో స్పూర్తిపొందిన పాఠశాల విద్యార్దులు
ఉదార సహాయముతో ఊరటతో ఉపశమనము పొందిన బాధా సర్పదస్టులు
నడచివచ్చిన నాయకులనుచూసి నమ్మకము పొందిన భావిపౌరులు
సమూహముగావచ్చిన సొదరప్రేమనుచూసి స్వాంతనపొందిన అన్నదాతలు
కనిపించాయి కర్రలతోకట్టి చీరలు కప్పిన నివాసాలు
సాక్షాత్కరించాయి పిల్లలు రాక మూతపడిన పాఠశాలలు
దర్శనమిచ్చాయి నీరుప్రవహించి కోసుకుపోయిన రహదారులు
స్వాగతమిచ్చాయి మేటవేసి నేలకొరిగిన పొలాలు
సాక్షమిచ్చాయి వరదవుద్రుతికి కూలిపొయిన వ్రుక్షాలు
సహాయకుల ఆదరణకు చెమ్మగిల్లాయి వయోవ్రుద్దుల కళ్ళు
సేవకుల సహాయాన్ని పొగిడాయి భాదితుల నొళ్ళు
దాతల బహుమానాలకు నర్తించాయి పిల్లల కాళ్ళు
విరాళాల ఇంటిసామానులకు పండుగ జరిపాయి ప్రజల ఇల్లు
కార్పోరేట్ సంస్థల కొరకు వినిపించాయి పొగడ్తల జల్లు
 
చాలాఉంది చేయవలసినది......
నిర్మించాలి నిలపెట్టాలి నివాసాలను
ప్రారంబించాలి ప్రోత్సాహించాలి పాఠశాలలను
ప్రణాలికవేయాలి పటిష్టముచేయాలి రహదారులను
విద్యనందించాలి వివేకులనుచేయాలి ప్రజలను
దారిచుపాలి ధైర్యమివ్వాలి భావిపౌరులకు
                                       --ఫ్రభాకర రావు కోటపాటి

మద్యం పై పద్యం విజయం

తెలుగు సాహిత్యం...అందులోను పద్యం విలువని చాటిచెప్పే ఒక వార్తని ఇప్పుడే పాత ఈనాడు దిన పత్రికలో చదివాను. వెంటనే దాన్ని అందరితో పంచుకోవాలనిపించింది. ఇక్కడ జత చేస్తున్నాను

వివేకం

హే భగవాన్! నేను మార్చలేని విషయాలను
భరించుటకు కావలసిన నిబ్బరాన్ని ప్రసాదించు;
నేను మార్చగలిగిన వాటిని మార్చుటకు
వలయు సాహసాన్ని సమకూర్చు;
ఈ రెండిటి నడుమ వ్యత్యాసాన్ని గ్రహించగల వివేకాన్ని కలిగించు

Wednesday, February 3, 2010

నటనం ఆడేనే భవ తిమిరహంసుడా

చిత్రం:శుభోదయం


పాడిన వారు:యస్.పీ.బాలు,పీ.సుశీల

దర్శకత్వము:కే.విశ్వనాథ్

సంగీతము: కే.వీ.మహదేవ



నటనం ఆడేనే భవ తిమిరహంసుడా

ఆ పరమశివుడు నటకావతంశుడై

తకధిమి తక యని !!



!! నటనం ఆడేనే



ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల

ఎండ వెన్నెలై వెల్లువైనటుల

నిటాలాక్షుడే తుషారద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల



!! నటనం ఆడేనే



శివగంగ శివమేత్తి పొంగగా

నెలవంక సిగపువ్వు నవ్వగా

హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము

గరుడా నాదానంద కావ్యమై వరలగా



!! నటనం ఆడేనే



వసుధ వసంతాలు ఆలపించగా

సురలు సుధను ధరలో కురిపించగా

రతీ మన్మధులు కుమార సంభవ

శుభోదయానికి నాంది పలుకగా



ఓ శంకరా!అభవుడవై ఈ ప్రపంచానికి అస్థిత్వమై నిలిచావు నీవు.భవుడవై ఈ జగత్తు మనుగడకు కారణభూతుడవైనావు.స్వామీ !అలాంటి నువ్వు ప్రాపంచిక వ్యామోహమనెడి చీకటిని సంహరించే పరమశివుడవు.మహాదేవా! నీవు నర్తించడం వలన నాట్యానికి ప్రత్యేక గౌరవం,పవిత్రత లభించినా కరుణా సముద్రుడవు కనుక నటకావతంశుడు (నాట్యానికి ఆభరణము)అని అనిపించుకున్నావు.అలాంటి నువ్వు నేడు ఆనందస్వరూపుడివై తకధిమి తకధై అంటూ ఆనంద తాండవం చేస్తున్నావు.నీవీనాడు ఎందుకింత ఆనందంగా వున్నావో నాకు తెలిసిందిలే…అమ్మలను గన్న అమ్మ,ముజ్జగాలకే మూలపుటమ్మ మా అమ్మ పార్వతీ దేవిని పరిణయమాడి నీవు ఉమారమణుడవు అనిపించికున్నావు.అంతేనా నీ దేహంలో సగ భాగమిచ్చి అమ్మపై నీకు గల అనురాగం లోకాలన్నింటికి చూపించి పాఠం నేర్పావు.



ప్రభూ! మీ గౌరీశంకరుల కళ్యాణం జగత్కళ్యామే కదా! ఈ అనందం మీకే కదు మా అందరికి కూడా.జగదానంద కారకులైన మిమ్ములను చూసి ఎనిమిది దిక్కులన్నీ ఒక్కటై పోయినట్లు,సూర్యుడే చంద్రుడై ఎండకు బదులు వెన్నెల కురిపిస్తున్నట్లు మాకు అనిపిస్తున్న వేళ ,మూడు కన్నులున్న నీవు కైలాసాన్ని వీడి విశాలమైన కన్నులున్న మా అమ్మ గిరిరాజపుత్రితో ఆనందంగా లయ,తాళములను తప్పకుండా నాట్యము చేస్తూ వుంటే,రాగ,తాళ,లయ,శృతులకు,మా అందరికీ మీరే గతి అని మాకు ఈనాడు బోధ పడింది.



పరమశివా! పార్వతీపరమేశ్వరులైన మీ ఇద్దరి నాట్యము చూసి నీ జటాజూటంలో కొలువై ఉన్న గంగమ్మ తల్లికూడా ఆనందాముతొ ఉప్పొంగిపోతోంది…అలాగే నీ శిగలో కుసుమంలా అలరారుతున్న నెలవంక చిరునవ్వులు చిందిస్తూ మరింతగా శోభిస్తున్నాడు.హర హర మహాదేవా! నీ కళ్యాణ మహోత్సవ సందర్భంగా హరిహరాత్మకమగు ఈ ప్రపంచమంతటా గరుడనాదానంద కావ్యమై ప్రకాశిస్తున్నది.సర్వ జగత్తుకూ మంగళాన్నీ,ఙానాన్ని ప్రసాదించే శంకరా!శివ కేశవులు అభేధమని ఈ జగమంతటికీ చాటుతూనే వున్నావు కదా!నీ హృదయాన్ని కవి అర్ధం చేసుకున్నరు కనుకనే హరిహరాత్మకమైన ఈ ప్రపంచమును,వేదములను తన నాదముగా జేసుకున్న గరుత్మంతుని స్మరిస్తూ విష్ణు స్తుతి చేసారు ఇక్కడ.



మహేశా!విశ్వమంతా పార్వతీపరమేశ్వరుల కళ్యాణం ఎప్పుడు జరుగుతుందా?కుమారస్వామి ఎప్పుడు ఉదయించి తారాకాసురుణ్ణి సంహరిస్తాడా అని ఎదురుచూస్తున్నదయ్యా! సతీ దేవి హైమవతిగా జన్మించి మళ్ళీ నిన్ను చేరుకున్నది.భూదేవి వసంత రాగాలను ఆలాపిస్తున్నది.దేవతలు అమృతాన్ని వర్షిస్తున్నారు.రతీ మన్మధులు ఈ జగమంతటికీ శుభోదయాన్ని ప్రసాదించే కుమార స్వామి సంభావానికి నాంది పలుకుచున్నారు.విశ్వనాథా! నువ్వు మా అమ్మ పార్వతీ దేవి కలిసి తారకాసురుడనే అఙ్జానాంధకారమును పారద్రోలే ఙాన స్వరూపుడైన కుమార స్వామిని మాకు ప్రసాదించండీ…

ఎవరు నెర్పేరమ్మా ఈ కొమ్మకు


ఎవరు నెర్పేరమ్మా ఈ కొమ్మకు
పూలిమ్మని రేమ్మ రేమ్మకు
యెంత తొందరలే హరి పూజకు

ఫ్రొద్దుపొడవక ముందె పూలిమ్మని
కొలువయితివా దేవి నా కోసము !!2!!

తులసీ..తులసీ దయా పూర్ణ తలచి

మల్లెలివి నా తల్లి వరలక్ష్మి కి!!2!!
మొల్లలివి నన్నేలు నా స్వామికి
యేలీల సేవింతు యేమనసు కీర్తింతు!!2!!

సీతమనసే నీకు సింహాసనం
ఒక పూవ్వు పాదాల ఒక దివ్వె నీ వ్రాలా!!2!!
ఒదిగి నీయేదుట …ఇదే వందనం ఇదే వందనం.

ఈ పాట వింటున్నప్పుడల్లా నా మనస్సు మలయానిలము తాకిన అనుభూతి చెందుతుంది.శృతి చేసిన వీణపై హిందోళం రాగం పలికించినప్పుడు కలిగే మధుర భావం నా హృదయం అంతా నిండి పరవశం కలుగుతుంది.ఈ పాట మనస్సుకు మైమరపే కాదు బుద్ధికి ఆలోచనను కూడా కలిగిస్తుంది…అది ఎలాగంటారా?ఆ విషయానికే వస్తున్నాను.
సూర్యోదయం కాకమునుపే వృక్షాలు,మొక్కలు అంతా నిద్రలేస్తాయి. తొలి సంధ్య వేళ కల్లా హరి పూజకు పూలిస్తాయి.ఒక్క చెట్లేనా ఊహు!పశు పక్ష్యాదులు కూడా మేల్కొని భానోదయం కాక మునుపే మెల్కోని తమకు తోచిన రీతిలో ఆ పరమాత్మునికి,ఆయన సృష్టిలో భాగమైన మనను సేవిస్తాయి..ఒక్క మాటలో చెప్పాలంటే మనకన్న ముందరే తెల్లవారుఝామునే ప్రకృతిలొని జీవకోటి(ఒక్క మనుష్యులు తప్ప) అంతా మేల్కొని తమ తమ విద్యుక్తధర్మాలను నిర్వహిస్తాయి.మనమేమో బారెడు పొద్దెక్కినా లేవము ఒక వేళ లేచినా ప్రొద్దున్నే చెయ్యవలసిన కార్యక్రమములు చెయ్యము(శుచిగా తయారవ్వడం,దైవారధనకు కనీసం ఐదు నిముషాలు అన్న వెచ్చించకపోవడం మొదలైనవి).అంటే మనకన్న పశువులే నయమని మనం ఒప్పుకుని చూపిస్తున్నాం కదా ప్రపంచానికి.తెల్లవారకముందే నిద్రలేచి హరి పూజకై కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు పూలిస్తున్నవు,ఎంత భాగ్యశాలివమ్మ నీవు అని వృక్షదేవతను కొనియాడుతూనే, ప్రొద్దుటే నిద్రలేవని మనలను సున్నితంగా మందలిస్తున్నారు కవి.

లక్ష్మీ అంశతోనున్న తులసి శ్రీహరికి అత్యంత ప్రియము.శ్రీమన్నారయణునికి ప్రియమైన తులసీ దయాంతరంగురాలవై నా కోసం మా ఇంట వెలిసినావా…విష్ణుహృత్కమలవాసిని అయిన శ్రీ వరలక్ష్మీ ఇదిగో నీ ప్రీతికై మల్లెపూలు తెచ్చాను.నన్నేలు నా స్వామి కోసం మొల్లలు పెట్టుకుంటున్నాను.ఆహా!కృష్ణ శాస్త్రి గారి హృదయం ఎంత రసభరితము కాకపోతే ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా ఇక్కడ భక్తి,శృంగార రసాలు ఒకేసారి గుప్పించగలిగారు..

శ్రీ రామచంద్రా!నిన్నే విధంగా సేవించను?ఏ విధంగా కీర్తించను?మీమేంత చేసినా అది నీకు తక్కువే కదా!సీతమ్మ తల్లి నిన్న ప్రేమించినంతగా,ఆరాధించినంతగా ఎవ్వరూ నిన్ను ప్రేమించి ఆరాధించి ఉండరు కదా!అందుకే మా అమ్మ సీత మనసే నీకు సింహాసనమైనది.ఒక పువ్వు నీ దగ్గర ఎలా శరణమంటుందో,ఒక దీపం తన తుది జీవిత క్షణం వరకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎలా సేవించుకుంటుందో అలా నీ శరణు గోరి,చేరి సేవించుకుంటాను.అందుకు ముందుగా నా వందనములు అందుకోవయ్యా!

సుమతీ శతకములు

1.శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ!

తాత్పర్యము:
ఓ బుద్ధిమంతుడా! శ్రీరాముని అనుగ్రహముచేత జనులంతా నిక్కముగా అచ్చెరువొందేటట్లుగా, నోరు వూరగా జనించిన రసముల వలే శ్రేష్ఠమైన నీతులను నా నోటినుండి చెప్పెదను.


2.అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీనీ వేల్పు,మోహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ

తాత్పర్యము:
అవసరానికి పనికి రాని బంధువు,పూజించినా కరుణించని దైవము,యుద్ధములో కదలని గుర్రము, వెంటనే విడిచిపెట్టాలి.
ఇక్కడ ఎవ్వరినీ అందులోను మనకు విఙ్ఙానాన్ని సాహితీ సంపదగా అందజేసిన పూర్వికులను తప్పు పట్టడం నా అభిమతం అస్సలు కానే కాదు.కాని నా మదిలోని భావనను,నాకు కలిగిన ఆలోచనలను పంచుకోవటం అనే వుద్దేశం తప్ప మరింకేమి లేదు.మన తల్లి తండ్రులు మనకేమి కావలో మన అవసరాలకు తగ్గట్లుగు అని అమరుస్తారు.మనకి ఎంత ఇష్టమైనవైనా మన ఆరొగ్యానినికి హాని కలిగిచే తిండి పదార్ధాలు ఇవ్వరు అలాగే మన భవిష్యత్తు దెబ్బ తీసేటటువంటి వాటీని ప్రోత్సహించరు.మనకి ఎప్పుడు ఏవి కావలో తెలుసుకుని అవి అమరుస్తూ వుంటారు.భగవంతునికి-మనకు మధ్య అనుబంధం తల్లితండ్రులు-పిల్లల అనుబంధం వంటిదని మన సాంప్రదాయం చెపుతోంది.ఆ విధంగానే పార్వతీ పరమేశ్వరులును మన తల్లి తండ్రులుగా కొలుచుకుంటున్నము.మన తల్లితండ్రులు మనలను విధంగా ముద్దుగా చూసుకున్నారో మనము మన పిల్లలను అలాగే చూసుకుంటాము.మనుషులము మనమే మన పిల్లలను ఇంత గారబంగా చూసుకుంటున్నాము మరి మనకంటే ఎన్నో రెట్లు అధికుడు,ఈ సృష్తికే మూలపురుషుడు అయిన పరమాత్మ,మన పట్ల ఇంకెంత ప్రేమను కలిగి వుంటాడో మనం గ్రహించాలి కదా.మన కోరికలను తీర్చలేదని భగవంతుణ్ణి కొలవకపోవడం ఎంత వరకు సబబు?మనం కోరే కోరికలకు మనం అర్హులం కామేమొ లెకపొతే అవి మనకు మంచివి కావేమో అందుకే అన్నీ తెలిసిన పరమాత్ముడు మనకి ఇవ్వలేదెమో?మనం మన తల్లి తండ్రులపై అలిగినా,మన కోరికలు తీర్చలేదని కోప్పడినా,సరిగా చూడకపోయినా మనలను ప్రేమిస్తూనే వుంటారు.అలాగే మనము మన పిల్లలను అలానే ప్రేమిస్తాము..ఆ విధంగానే మనం పూజించినా పూజించపొయినా,అలిగినా మన మంచినే దృష్టిలో పెట్టుకుని దానికనుగుణంగానే మనకి కావలసినది ఇస్తూ వుంటాడా జగన్నాధుడు అని నా అభిప్రాయం.

3.అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడి గల యెద్దుల గత్తుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యము:

అహంతో మిడిసిపడుతూ అడిగినా జీతమునివ్వని వాని దగ్గర పని చేస్తూ బ్రతకటం కన్నా పుడమి తల్లిని,మంచి వయస్సులోనున్న యెద్దులను నమ్ముకుని పొలము దున్నుకొనుచూ స్వతంత్రముగా జీవించుట మేలు.

4.అడియాస కొలువు గొలవకు
గుడి మణియము సేయబోకు,కుజనులతోడన్
విడువక కూరిమీ సేయకు
మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతీ!

తాత్పర్యము:

వృధా ప్రయాస అగు సేవను చేయకుము.గుడి ధర్మకర్తృత్వమును చేయకుము.చెడ్డవారితో స్నేహం చేయకుము.అలాగే అడవిలోకి వంటరిగా పోకుము.

5.అధరము గదలియు గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ పాపము సుమతీ!

తాత్పర్యము

పెదవులను కదిలి కదిలించక సుమధురమైన మాటలడక మౌనవ్రతుడై ఆపై అధికార రోగము పూరితుడై చెవిటిది గుడ్డిదైన శవమును జూచుట పాపము.ఇక్కడ ప్రజల ఇక్కట్లను పట్టించుకొనని అధికారిని శవముతో పోల్చటం జరిగినది.

6.అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు,మూర్ఖుని తపము
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై గీడు దెచ్చుర సుమతీ!

తాత్పర్యము:

రుణము తెచ్చుకుని అనుభవించు సౌఖ్యము,వృధ్ధాప్యమున పడుచు భార్య,తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి.హాని కలిగించేవి!

7.అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నేడతెగక పాఱు నేఱును ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చోప్పడకున్నట్టి యూరు జోరకుము సుమతీ!

తాత్పర్యము:

అప్పిచ్చు వాడు,వైద్యుడు,ఎప్పుడూ ఆగకుండా ప్రవహించే నది,బ్రాహ్మణుడు వుండే వూరిలో వుండుము.
వారు లేనట్టి ఊరులో నివసింపకుము.

8.అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్య విద్య,కోమలి నిజము
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేరు తెలియర సుమతీ!

తాత్పర్యము:

అల్లుని మంచితనము,గొల్లవాని పాండిత్య ఙ్ఙానం,స్త్రీలలో నిజం,పొల్లు ధాన్యములో బియ్యము తెల్లని కాకులు వుండవు.

9.ఆకొన్న కూడె యమృతము
తా కొందక ఇచ్చువాడే దాత ధరిత్రిన్
సో కూర్చువాడే మనుజుడు
తేకువ కలవాడే వంశ తిలకుడు సుమతీ!

తాత్పర్యము:

ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము.బాధ పడకుండా ఇచ్చేవాడే దాత.ఆవేశాన్ని ఓర్చుకున్నవాడే మనుజుడూ.ధైర్యము కలవాడే వంశ శ్రేష్ఠుడు.

10.అకలి యడుగని కుడుపును
వెకటియగు లంజ పడుపు విడువని బ్రతుకు
బ్రాకొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ!

తాత్పర్యము:

ఆకలి తీర్చని ఆహరము,గర్భం వచ్చినా వ్యభిచారమును మానని వేశ్య బ్రతుకు,పాచి పట్టిన బావి నీళ్ళు,మేక పాడియు రోత పుట్టించును.

11.ఇచ్చునదే విద్య రణమున
జొచ్చునదే మగతనంబు,సుకవీస్స్వరులన్
మెచ్చునదే నేర్పు,వాదుకు
వచునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!

తాత్పర్యము:

వసుధలో (ఈ ప్రపంచంలో)ఇచ్చునదే విద్య.యుద్ధ రంగమున జొచ్చుకొని ప్రతాపమును చూపించుటే మగతనము.మంచి కవి శ్రేష్ఠులు మెచ్చుకొనునదే నేర్పరితనము.తగువుకు వచ్చునదే హాని.కవి వుద్దేశం ప్రకారం విద్య ఎమి ఇవ్వలి?ధనమా?వినయమా?మంచి వ్యక్తిత్వమా?లేకపోతే అన్నీనా?

12.ఇమ్ముగా పఠింపని నోరును,
“నమ్మా” యని పిలిచి అన్నమడగని నోరును,
దమ్ముల యని బిలవని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

తాత్పర్యము:

ఇంపుగా పఠింపని నోరును,అమ్మా అని పిలిచి అన్నం అడుగని నోరును, కుమ్మరి వాడు మన్నుకై త్రవ్విన గుంట వంటిది .

13.ఉడుముండదే నూఱేండ్లును
బడియుండదే పేర్మి బాము పది నూఱేండ్లును
మడుపున గొక్కెర యుండదే
కడు నిల బురుషార్ధపరుడు గావలే నేర్పరి సుమతీ!

తాత్పర్యము:
ఉడుములు నూరేండ్లు,పాము పది వందల యేళ్ళు,చెరువులో కొంగ చిరకాలము వున్నా అవి నిరుపయోగములు.నిరుపయోగంగా చిరకాలము వుండటం కన్న పదిమందికి ఉపయోగపడే విధంగా కొద్ది కాలం వున్నా చాలు.

14.ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱుగున గలుగ నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరిగి పోసిన
నిత్తడి బంగారమగునే ఇలలో సుమతీ!

తాత్పర్యము:

బంగారమునకు సమానమైన ఎత్తును ఇత్తడి తీసుకుని ఎన్నిసార్లు కరిగించి పోసినా అది బంగారము కానేరదు.అట్లే నీచునకు ఏ విధంగాను మంచి గుణములు కలుగవు.

15.ఉదకమును ద్రావేడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదపు కడ నున్న వృషభముc
జదువని యా నీచు జేర జనకురా సుమతీ!

తాత్పర్యము:

నీరు త్రాగెడు గుర్రము దగ్గరకు,మదముతో విజృంభించుచున్న ఏనుగు దగ్గరకు,గోవు కడ నున్న ఆబోతు దగ్గరకు,విద్య నేర్వని నీచుని దగ్గరకు వెళ్ళకుము.

16.ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

తాత్పర్యము:

మేలు చేసినవాడికి మేలు చేయడం గొప్ప కాదు.హాని చేసినవాడి దోషములెన్నక అతనికి ఉపకారము చేయువాడే నేర్పు గలవాడు..

17.ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను బెఱకు కైవడి నేపో
నెపములు వెదుకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!

తాత్పర్యము:

చెఱుకు గడ మొత్త మొదట తియ్యగా వుండి చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్ప చప్పగా నేవిధముగా నుండునో అటులనే మోసగాడైన దుర్మార్గునితో స్నేహము మొదట ఇంపుగా వున్ననూ చివరకు తప్పులను ఎత్తిచూపించుటలోనే కాలము గడుపును

18.ఎప్పటి కయ్యేది ప్రస్తుత
మప్పటి కా మాటాలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరిగువాడు ధన్యుడు సుమతీ!

తాత్పర్యము:

ఈ సమయములో ఏది అవసరమో తెలుసుకుని అప్పటికా మాటలు మాట్లాది ఇతరుల మనస్సులను నొప్పించక తాను బాధను పడక తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు సుమతీ!

19.ఎప్పుడు దప్పులు వెదికెడు
నప్పురుషుని గొల్వగూడ దది ఎట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించు విధంబు గదరా సుమతీ!

తాత్పర్యము:

ఎల్లప్పుడూ తప్పులు వెదకెడు యాజమానిని సేవించు వాని జీవనము నల్ల త్రాచు పడగ నీడ నివసించు కప్ప బ్రతుకు వంటిది.

20.ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురు ఎట్లన్నన్
దెప్పలుగా జెరువు నిండిన
గప్పలు పదివేలు జేరు గదరా సుమతీ!

తాత్పర్యము:

నిండుగా సుభిక్షముగానున్న చెరువులోనికి పది వేల కప్పలు ఎలా జెరునో మనకు సంపదలు కలిగినప్పుడు బంధువులు అటులనే జేరును.

21.ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషములు సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాఙ్ఙ మేదిని సుమతీ!

తాత్పర్యము:

ఈ భూమిపై నందున్న పచ్చి కాయలను తినకుము.చుట్టాలను దూషింపకుము.యుద్ధ భూమి నుండి వెనుదిరిగి పారిపోకుము.గురువుల ఆఙ్ఙను జవదాటకుము.

22.ఒక యూరికి ఒక కరణము
నొక తీర్పరైన గాక నొగిc దఱచైనన్
గకవికలు గాక యుండునే
సకలంబును గొట్టు పడక సహజము సుమతీ!

తాత్పర్యము:

ఒక ఊరికి కరణము,న్యాయాధికారి ఒక్కరే ఉండవలెను.అట్లుగాక ఎక్కువమంది వున్నచో గందరగోళములు పుట్టి సమస్తము చెడిపోవుట సహజము.

23.ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాది నొల్లని వాడే
గొల్లండు కాక ధరలో
గొల్లండును గొల్లడౌనే గుణమున సుమతీ!

తాత్పర్యము:

తనను ప్రేమించని భార్యను,స్నేహితుని విడిచిపెట్టుటకు అంగీకరించని వాడే నిజమైన గొల్లవాడు.జాతి చేత గొల్లవాడైనంత మాత్రాన గుణముల యందు వెర్రి గొల్లవాడు కాడు.

24.ఓడల బండ్లను వచ్చును
ఓడలు నా బండ్ల మీద నొప్పుగ వచ్చు
ఓడలు బండ్లను వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ!

తాత్పర్యము:

నావల మీద బండ్లు,బండ్ల మీద నావలు ఎట్లా వచ్చునో,ధనవంతులకు దరిద్రముదరిద్రులకు భాగ్యము పర్యాయముగా కలుగుచుండును.

25.కడు బలవంతుడైనను
బుడిమినిc బ్రాయంపుటాలిc బుట్టినయింటన్
దడ వుండ నిచ్చెనేనియుc
బడపుగ నంగడికిc దానె పంపుట సుమతీ!

తాత్పర్యము:

ఎంత బలవంతుడైనను,వయస్సులోనున్న భార్యను ఎక్కువ కాలము పుట్టింటనే వుండనిచ్చినచో తానే స్వయముగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.

26.కనకపు సింహాసనమున
శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

తాత్పర్యము:

కుక్కను తెచ్చి ఒక శుభ ముహూర్తమున బంగారు సింహాసనమున కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజమును ఎలా మానలేదో,ఆ విధంగానే అల్పునికి గౌరవ మర్యాదలు చేసి పదవి ఇచ్చినా కూడ తన నీచ గుణమును విడువలేడు.

27.కప్పకు నొరగాలై నను
సర్పమునకు రోగమైన సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
తప్పదు మఱి దుఃఖమగుట తధ్యము సుమతీ!

తాత్పర్యము:

కప్పకు కాలు విరిగినను,పామునకు రోగము కల్గినను,భర్య దుష్టురాలైననను,వృద్ధాప్యములో దారిద్ర్యము సంభవించినను ఎక్కువ దుఃఖ ప్రదములగును.

మొదట ఈ పద్యము చదివి తాత్పర్యము తెలుసుకొన్నప్పుడు కవి గారి మీద భలే కోపం వచ్చింది!ఎందుకూ అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలోను స్త్రీ జాతి మీద వున్న కోపాన్నిఈ విధంగా వెల్లడి చేసుకున్నారు అని? ఇదే అభిప్రాయము చాలా రోజుల వరకు వుంది!దీనిపై నా వాఖ్యానం మొదలుపెట్టేవరకు.
ఏందుకు ఈయన ఇలా చెప్పరు దీని వెనుక వున్న అంతరార్ధం ఏమిటబ్బా అని ఆలోచించడం మొదలు పెట్టక దీని వెనుకున్న అంతరార్ధం కొంత బోధ పడిందని నేను అనుకుంటున్నాను [:)] ? ఈ కొత్త ఆలోచనకి బీజం యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన మనోవైఙ్ఙానిక పుస్తకం “విజయంలో భాగస్వామ్యం” ఈ పుస్తకం ఆలుమగల మధ్య సంబంధాన్ని పటిష్టం చేసుకునే నేపధ్యంలో స్త్రీ పురుషుల మనస్తత్వాన్ని వివరించటం జరిగింది.అ పుస్తకం రచయిత ఇలా చెప్పారు స్త్రీ పురుషులు మనస్తత్వాలు కుటుంబం విషయంలో ఉత్తర దక్షిణ ధ్రువాల్లా వుంటాయని.పురుషునికి తన ఇల్లు,ఇల్లాలు,కుటుంబం జీవితంలో ఓ భాగమైతే,స్త్రీకి తన భర్త,తన పిల్లలు,తన సంసారం,తన కుటుంబము ఇవే తన లోకంగా బ్రతుకుతుందని.ఈ విషయాన్నే బద్దెన్న గారు పై పద్యంలో చెప్పిన విషయానికి అన్వయించుంకుంటే కొంత సూక్ష్మం అర్ధమయింది.భర్త దుష్టుడైతే భార్య మీద పడే ప్రభావం కన్న భార్య దుష్టురాలైతే భర్త మీద పడే ప్రభావం ఎక్కువనుకుంటా!ఆ ప్రభావాన్ని తట్టుకోలేక పురుషుడు బయట పడుతున్నడు,మగువమో ఓర్చుకుని గుట్టుగా వుంటోంది! కనుకనే గయ్యాళీ భార్య అన్న పదం వాడుకలోకి వచ్చింది గాని గయ్యాళి భర్త అని రాలేదు..ఏది ఏమైన భార్య భర్తల్లో ఎవరు దుష్టులైనా కాకపోయిన,గయ్యాళులు అయినా కాకపొయినా ఆ ప్రభావం కుటుంబంలో మిగితా సభ్యులు మీద ముఖ్యంగా పిల్లల మీద ఎంతో ప్రభావం చూపుతుంది..చెడు ప్రభావం మన మీద మన కుటుంబం మీద మన సమాజం మీద లేకుండా చూసుకోవడం మన కనీస ధర్మం.

ఇక్కడ స్త్రీలపై చిన్నచూపు వున్న పద్యాల్లో కొంత positiveness ని చూసేందుకు చేసినదే ఈ ప్రయత్నం అంతే కాని ఎవ్వరినీ ఎవ్వరితో పోల్చటం లేదు ,చిన్న చూపుగా చూడటం చెయ్యటం లేదు.నా ఈ ప్రయతం ఎవ్వరికైన ఇబ్బంది పెట్టి వుంటే మన్నించగలరు.

28.కమలములు నీట బాసిన
గమలాప్తుని రశ్మి సోcకి కమలిన భంగిన్
దమ తమ నెలవులు తప్పినc
దమ మిత్రులు శత్రులవుట తధ్యము సుమతీ!

తాత్పర్యము:

కమలములు తమ నివాసమైన నీటిని విడిచినచో తమ మిత్రుడైన సూర్యుని కిరణములు సోకి ఎటుల కమిలిపోవునొ,హద్దులు దాటితే మిత్రులే శత్రులగుట తధ్యము.

29.కరణము గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేcడు సుమి
కరణము దన సఱి కరణము
మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

తాత్పర్యము:

ఒక కరణము తోటి కరణమును నమ్మినచో మరణముతో సమానమైన అపాదలు వచ్చి మనలేడు.కావున శాటి కరణమును నమ్మక గుట్టుగా నుండవలెను.

30.కరణముల ననుసరింపక
విరసంబున దిన్న తిండి వికటించు జుమీ
యిరుసున గందెనc బెట్టక
పరమేశ్వరు బండైయిన బాఱదు సుమతీ!

తాత్పర్యము:

బండి ఇరుసును కందెన పెట్టకున్నచో భగవంతుని బండి అయినను వేగవంతముగా కదలలేదు.అటులనే కరణమును అనుసరించక విరోధముతో మెలగిన వారు సుఖముగా నుండలేరు.

31.కరణము సాధై యున్నను
గరి మదముడిగినను బాము గరవకయున్నను
ధర దేలు మీటకున్నన్
గర మరదుగా లెక్క గొనరు గదరా సుమతీ!

తాత్పర్యము:

ఈ భూమి యందు కరణము నెమ్మదస్తుడైనను,ఏనుగు మదము లేనిదైనను,పాము కరవక యుండినను,తేలు కుట్టకున్నచో మిక్కిలి తెలికగా చూతురు.

32.కసుగాయ గఱచి చూచిన
మసల దసయొగరు మధురంబగునా
పసగలుగు యువతులుండగ
బసిబాలల బొందువాడు పసరము సుమతీ!

తాత్పర్యము:

పక్వమునకు వచ్చిన పండ్లను వదిలి పచ్చి కాయలను కొరికినచో తియ్యదనము లేక ఒగరుగా తోచును.చాతుర్యము గల యువతులుండగా పసిపాపల పొందు కోరు వానికి సుఖము శున్యము.అట్టివాడు నిజముగా పశువు.
నిజము చెప్పాలంటే ఇలాంటి వాళ్ళ కన్న పశువులే నయము.వీరిని ఈ పదముతో పిలిచినా ఆ పదమునకు మాలిన్యము అంటి వున్న విలువ కోల్పోతుంది..అందుకే ఇటువంటి వారిని సంభోదించడం లేదు.

33.కవిగాని వాని వ్రాతయు
నవరసభావములు లేని నాతుల వలంపున్
దవిలి చను పందినేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ!

తాత్పర్యము:

కవిగాని వాని రచనలు,నవరసాల భావములు లేని స్త్రీల ప్రేమ,ముందు పోయేడు పందిని కొట్టలేని వాని ఆయుధ విద్యలోని నేర్పరితనము వ్యర్ధము.

నిజమే!నవరసాల భావనలు తెలియని స్త్రీ ప్రేమ వ్యర్ధమే.ఇదే సూత్రము పురుషులకూ వర్తిస్తుంది.కాని genralise చేసి మాట్లడకుండా ఒక్క స్త్రీ జాతినే ఇట్లా అనడం ఎంత వరకు సమంజసము?

34.కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందినపిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతుల వలపు లేశము సుమతీ!

తాత్పర్యము:

చెడ్డవారితో స్నేహము మంచిది కాదు.ఒక్కసారి కీర్తి వచ్చిన తరువాత పోదు.అప్పులు ఇచ్చుట తగువులకు మూలము.స్త్రీల కడ ప్రేమ శూన్యము.

ఓ పెద్ద మగవారే గొప్ప ప్రేమ మూర్తులైనట్టు.అందుకు ఎన్నో తార్కాణాలు వున్నయి కదూ!ఛా!

ఆడువారిని ఎంత తేలిక భావముతో చిన్నచూపు చూస్తున్నరో చూసేవారో ఈ పద్యాలే వుదాహరణ.

రుద్రవీణ

నన్నెంతగానో ప్రభావితం చేసిన సినిమా రుద్రవీణ ముఖ్యంగా సినిమా లోని పాటలు: సంగీతము మరియు సాహిత్య పరంగా.




ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం

మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం

కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది

దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది

మంచైన చెడ్డైనా పంచుకోను నేలేనా

ఆమాత్రం అత్మీయతకైన పనికిరాన

ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని

అంతటి ఏకాంతమైన చింతలేమిటండి



పై పల్లవిలో మొదటి నాలుగు వాక్యాలు చదివినా విన్నా మననం చేసుకున్నా దుఃఖ తప్త హృదయానికి సేద తీర్చి బుద్ధికి పదును పెడుతుంది.దుఃఖించడం వల్లనో బాధపడటం వల్లనో మన సమస్య(లు) తీరేవైతే ఈ ప్రపంచంలో అందరూ అట్లాగే చేసుకుని తమకంటూ ఏ సమస్య(లు) లేకుండా ఉండేవారు. మనకొచ్చిన సమస్యలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యాలి ..ఆ దిశగా సాగిపొవాలి…ఈ పయనం మన వ్యక్తిత్వ వికాసంలో ఒక అధ్యాయం అవుతుంది…అంతే కాని దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు.మనస్సులోని దుఃఖమును సన్నిహితులతోను,శ్రేయోభిలాషులతోను చెప్పుకొనక మనలోనే దాచుకుంటే కొన్నాళ్ళకు గుండెకు సంబంధించి మరియు ఇతర అరోగ్యపరమైన సమస్యలు వస్తాయే తప్పితే వున్న సమస్యలు పొవు పైగా సంతోషమనే మంచిని పంచుకుంటే పెరుగుతుంది.దుఃఖమనే చేడుని పంచుకుంటే తరుగుతుంది అన్న నిజాన్ని చాటే ఈ పాట నాకెంతో ప్రియమైనది.



వసంతాల అందం విరబూసే ఆనందం

తేటి తేనె పాట పంచవన్నెల విరి తోట(2)

బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట

మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట(2)



ప్రకృతిలో మనకి ఆరు ఋతువులు వున్నయి..వసంతమొక్కటే లేదు కదా!మనకు అన్నింటికన్న వసంత ౠతువే అందంగా ఆకర్షణియంగా కనపడవచ్చు.కాని మిగితా కాలాల్లోని అందం/ఆనందం చూడగలిగితే అవన్నీ కూడ మనకు రమణీయంగానే కనపడతాయి.కాని ఎప్పుడూ వసంత కాలం వుంటే నిత్యం variety కోరుకునే మనిషికది విసుగు పుట్టవచ్చు..విసుగు సంగతి పక్కన పెడ్తే…ప్రతీ జీవి మనుగడకు వసంత కాలమొక్కటే కాదు మిగితా ఋతువులు కూడ అవసరం…



పైన ప్రస్తావించిన విషయం మన సమజాంలో నేడు చదువు,ఉద్యోగం,పెళ్ళీ లాంటి అన్ని విషయాలకు కూడా వర్తిస్తుంది.ప్రస్తుత కాలంలో అన్ని విషయాలలోను competition నుంచి cut-throat competition వరకు వెళ్ళిపోయింది..ఫలితం ఇంజినీరింగ్,మెడిసెన్ చదువులు చదివితేనే అందులోను అధిక శాతంతో ఉత్తీర్ణులవుతేనే గాని సుఖవంతముగా జీవితం గడపటానికి కావల్సిన ఉద్యోగాలు,పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మంచి సంబంధాలు రావటం లేదు.దీనికి MNC’S లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ప్రోత్సహాన్నిస్తున్నయి. ఫలితం..ba,bsc,b.com లాంటి చదువుల విలువ చివరకు పడిపోయింది.



మనిషి తన జీవితమును సుఖమయముగా చేసుకోవడానికి సాంకేతిక విఙ్ఙానమును ఆశ్రయించి శ్రమ తగ్గించికుని,వినోదం పెంచుకుని ఎంతో లాభం పొందాడు.మనిషి ఎంత ఘనమైన అభివృద్ధిని సాధించినా అతని కంటూ ఒక బలమైన వ్యక్తిత్వం లేకపోతే అతను సాధించిన విజయాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.మరి బలమైన వ్యక్తిత్వం ఏర్పరుచుకోవాలంటే ఎలా? మనం పుట్టీ పెరిగిన పిదప ప్రస్తుతముంటున్న వాతరవరణము కాకుండా మనపై మన తల్లి తండ్రులు ఇతర పెద్దలు,గురువులు, సన్నిహితులు,స్నేహితుల ప్రభావము,ఆపై జీవితంలొ ఎదురయ్యే పరిస్థితులు-అనుభావలు ఇలా ఎన్నో విషయాలు మనపై ప్రభావం చూపించి మన వ్యక్తిత్వాన్ని ఏర్పరచడంలో దాహోదం చేస్తాయి.ఇవి అంతా ఒక ఎత్తైతే,మన సంస్కృతి సాంప్రదాయలు అంటే ఎమిటో,వాటి వెనుకనున్న అర్ధము-పరమార్ధము,ఏది తప్పు-ఏది ఒప్పు అయితే అవి ఎందుకు తప్పు ఎందుకు ఒప్పు లాంటివి ఉదాహరణ సహితంగా వివరంగా తెలిపి మనలో నైతిక విలువలను పెంచే సాహీతీ సంపద(literature),అలాగే మన పూర్వీకుల కాలం నాటి విశేషాలు నాటి పద్దతులు,వారి అనుభవ సారన్ని అలాగే వాల్రి చేసిన తప్పొప్పులను నిష్కర్షంగాను చెప్పి మన కళ్ళముందుంచి మనను ఆలోచించేలా చెయ్యగలిగే చరిత్ర(history),అర్ధికంగా అభివృద్ధి చెందెదుకు అర్ధిక శాస్త్రం(Economics), సమాజికంగా ఎటువంటి కొట్లాటలు గొడవలు లేకుండా అందరూ సామరస్యంగా ఎలా సుఖంగా వుండాలో తెలిపేటువంటి సాంఘిక శాస్త్రం(civics) లాంటి మానవతవపు విలువలు గల చదువులకు(arts and humanities studies) నేడు ఈ దుస్థితి ఎమిటీ? వాతీకి మనమే సరైన ఆదరణ లేదని చిన్న చూపు చూసి నిరాదరించి నిరుత్సాహ పరచటం ఎంత వరకు సమంజసం?



ఒక పక్షి ఆకాశంలో ఎగారాలనంటే దానికి రెండు రెక్కలూ కావలి. మనిషికి చూపు బాగుండాలంటే ఒక కన్ను సరిపొదు.రెండు కళ్ళూ కావలి.అలాగే మనిషి అరోగ్యంగా వుండాలంటే ఏ కొద్ది భాగమో సరిగ్గా పనిచేస్తే సరిపోదు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి..ఆలగే దేశం సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలలోను అభివృద్ధి చెందాలి.ఏ ఒక్క రంగంలొనే విజయం సాధిస్తున్నదయితే అది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం క్రిందకి పరిగణలోకి వస్తుందే తప్ప అభివృద్ద్ధి చెందిన కేటగరి క్రింద కాదు.



ఇదే విషయాన్ని మరింత అందంగా చెప్తున్నారు మన సీతారామశాస్త్రిగారు ఈ క్రింది పంక్తులలొ…



ఏటి పొడుగున వసంతం ఒకటేనా కాలం

ఏది మరి మిగతా కాలాలకు తాళం

నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు

కంటి నీటి కుంబవృష్టి జడిలో ఇంకొకడు



అలాగే….



ఎడారి బ్రుతుకున నిత్యం చస్తూ సాగె బాధల బిడారు

దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యదార్థ జీవన స్వరాలు

నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి

ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి

జనజీవిని ఒద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ

కలలో జీవించను నేను కలవరింత కోరను నేను



మన అభివృద్ధిని ఒక్కటే చూసుకోకుండా..అప్పుడప్పుడు మన పక్కనే వున్న అవసరములో నున్న వాడిని కూడ గమనించి సాయం చెయ్యమని కవి చెప్తున్న తీరు రమణీయం.మనం సహాయం చెసెటప్పుడు అవరోధాలు రావచ్చు అయినా వాటిని అధిగమించి ముందుకెళ్ళగలగాలి..అదె ధైర్యవంతుల లక్షణం.మనలని మనము సరి దిద్దుకుంటూ మనం వుంటున్న సమాజం కోసం మనము ఏదో ఒకటి చెయ్యాలి…అన్న స్పూర్తిని కలిగించే ఈ పాట సినీ వినీలాకాశంలో ఒక ధృవ నక్షత్రం.



ఇప్పుడు మరో పాట



తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం

తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం

గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా



ఈ పాట వింటున్నప్పుడల్లా నాకు బానే అనిపిస్తుంది.కాని సాహిత్యంలోనున్నా భావమేమిటి?

కవి వుద్దేశమేమిటన్న ప్రశ్నకు రకరకాల ఆలోచనలుప్పొంగ్గాయి.మొత్తం పాట అంతా గమనిస్తే సమాజాన్ని ఉద్దేశించి రాసినట్లుగా అర్ధం అవుతుంది.తన దగ్గరకు రాకపోయినా వనాల దగ్గరకు వసంతం ఎలా వస్తుందో పిల్లలు తమను ఆదరించకపోయినా,ప్రేమగా చూసుకోకపోయినా నిస్వార్ధంగా ప్రేమిస్తూనే మరింత దగ్గరకు వస్తూంటారు (కనీసం రావడానికి ప్రయత్నిస్తూంటారు) తల్లితండ్రులు.అలాగే సముద్రపు నీరును తీసుకోకుండా మేఘమెట్లా వర్షించదో తల్లితండ్రుల ప్రమేయం లేకుండా పిల్లలు అభివృధ్ధి పధాన నడిచి విజయ పతాకమును ఎగురవేయలేరు.కుటుంబ పరంగా అంతర్లీనంగానున్న అర్ధం తీసుకున్నాం.సామజికంగా కూడ చూడవచ్చూ!మనం సరిగ్గ చూసినా చూడకపొయీన న్యాయమైన ధర ఇచ్చినా ఇవ్వక పోయినా పల్లెల్లో మన కోసం రైతులు పంటలు పండిస్తూనే వున్నరు.అలాగే జీవనం గడపడానికి చిన్న చిన్న జీతాలకే పేదలు వుద్యోగం చేస్తున్నరు. ఎంతో శ్రమ పడి రాత్రి తెల్లవారుఝాములలో నగర వీధులలో వూడ్చి రోడ్లను శుభ్రం చేసిన తరువాత కూడా విద్యావంతులు,నిరక్షరాస్యులు,ధనవంతులు,పేదవారు, తమ తమ స్థాయిని,దేశ సౌభాగ్యాన్ని,పరిశుభ్రతను మరిచి,కిళ్ళీలను బాగ నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయ్యడం, మూత్రవిసర్జానాది కార్యాలను నిర్లజ్జులై, విచక్షనారహితులై చేస్తుంటే దేశం పరిశుభ్రంగా ఆరొగ్యంగా అభివృధ్ధి పధాన నడిచేదెపుడు? మేమింత చేస్తున్నా ఈ ప్రజలు ఇంతే నని వీరు శుభ్రపరచకుండా వుంటే అప్పుడు మన పరిస్థితి మన దేశ పరిస్థితి ఎలా వుంటుందో నన్న ఊహే భయం కలిగిస్తోంది.మనం ఇలా వున్నా

మంటే ఆ క్రెడిట్(ఉదాహరణకి దేశాన్ని శుభ్రంగా వుంచడం వుంచకపోవడం) ఈ సమాజలోంనున్న కొంతమందికే కాకుండా ప్రతి యొక్క వ్యక్తికీ చెందుతుంది



వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా

ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా

ప్రతి మదినిలేపే ప్రభాత రాగం

పదే పదే చూపే ప్రధాన మార్గం

ఏవి సొంతం కోసం కాదను సందేశం

మంచినే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద



భగవంతునిలో సృష్టిలో ప్రతీ జీవి మానవుడు తప్ప జీవరాశులన్నీ అందరికోసం పాటుపడుతున్నాయి. పంచభూతాలైన ఆకాశం,భూమి,నీరు,నిప్పు,వాయువు జీవురాశులన్నిటికి ప్రాణాధారమై సేవిస్తున్నయి. వృక్షాలు అనేక రాకాలుగా సేవించి మనిషి,జంతువుల ప్రాణాలు నిలబెడ్తున్నాయి.మరి మనిషి ఎందుకు తన స్వార్ధానికి తాను ఉపయోగించుకుంటున్నడే తప్ప ఇతరులకు ఎందుకు ఉపయోగపడటంలేదు?ఎ దశాబ్దానికో శతాబ్దానికో ఒకరో ఇద్దరో మహా అయితే పది మంది కన్నా ఎక్కువ ఉండరు.



చెట్లు వల్ల లాభాలు ఎమిటి?చెట్లను నాటి పెంచడం వల్ల లాభమేమిటి?అవి మనకు ఎట్లా సేవిస్తున్నయి?మనకు ప్రాణవాయువును ఎట్లా అందిస్తున్నాయి?భూగర్భంలో నుండే నీటీని నిర్మలంగా ఎలా వుంచుతున్నాయి?మేఘాలు కురిపించే వర్షాన్ని నీటి నిలువలను పరిశుభ్రంగా వుంచడంలో ఎలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నయి?తాగే నీటిని,సముద్రపు నీరుని కాలుష్యం చెస్తే ఆపై జరిగే పరిణామాలేమిటి? ఈ శబ్ధ,నీరు,వాతవరణ కాలుష్యం వల్ల ప్రజా జీవనానికి,ఇతర జీవుల మనుగడకు ఎంత కష్టమవుతుందన్న ఆలోచనా లేకుండా ప్రజలు తమ తమ స్వార్ధం కొద్ది నిర్లక్ష్యంగా,బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు?అలాగే పశుపక్ష్యాదుల జాతులలో ఒక్కటి మిగలకుండ వినోదం పేరుతో సంహరించడం,భక్షించడం ఎంతవరకు న్యాయం?మన కోసమున్న ఈ ప్రకృతిని మనొక్కరిదేనన్న భావనతో మంచిగా వుంచుతాన్నొ మాలిన్యపరచుతానో నా ఇష్టం అన్న వైఖరిని వీడినాడి ఈ ప్రకృతి మన అనదరిది మన స్వార్ధం కొద్ది పాదుచెసుకున్నం..ఇప్పటికన్న మేల్కొని మన ప్రకృతిని బాగు పరచి మనం బాగుపది భవిష్యత్ తరానికి బంగారు భవిష్యత్తునిద్దం అన్న వైఖరిని పెంచుకుని ఇక నుంచి అయినా బాధ్యతాయుతంగా ప్రవర్తించుదాం అని శపధం చేసి అందుకు పాటు పడదాం. మనిషిగా మన వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యతతో పాటు సాటి మనిషికి సహాయపడటం మన విధి.భాస్కరుడు ఉదయాన్నే తన కిరణాల ద్వారా సకల జీవకోటిని మేల్కొలిపి దారి చూపే మార్గదర్శకుడు ఎలా అవుతాడో, మనము అదే విధంగా మన ఒక్కరికోసమే కాకుండా నలుగురికోసం బ్రతకాలి.మంచి తనమే లేకపొతే మన జీవితాలు వ్యర్ధము.మంచినెరుగని మనుగడ దిశ నెరుగని మనుగడ అని కవి వాఖ్యానించారు.



బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా

బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా

ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా

ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వ్రుధా వికాసం

కూసే కోయిల పోటే కాలం ఆగిందా

మారే ఏరే పారే మరో పదం రాదా

మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద



ఈ సినిమా సంగీత ప్రధానమైనది కాబట్టీ సంగీతము గురించి కూడ కొంచెం చెప్పుకుంటే బావుంటుంది..!ప్రకృతి లాగే సంగీతం కూడ అందరిదే ఏ ఒక్కరిదో కాదు!ఆస్వాదించే మనసు,సకల కళలకు ఆది దేవత అయిన సరస్వతీ కటాక్షం వున్న ప్రతి ఒక్కరిది!అటువంటి సంగీతం మన ఒక్కరిదే అని చెప్పి మన ఆనందం కోసం ఏటువంటీ ప్రయోజనం లేకుండా చేయ్యడం మనకు తగని పని.ఇదే విషయాన్ని మనకు పై పంక్తులలో రమణీయంగా చెప్పారు మన సిరివెన్నెల గారు.

నేనొక ప్రేమ పిపాసిని

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది … నేనొక ప్రేమ పిపాసిని



తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా

పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా

తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా

పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నానా

దాహం తీరనిది నీ హృదయం కదలనిది ….. నేనొక ప్రేమ పిపాసిని



పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు

సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు

నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు

నను వలచానని తెలిపేలోగా నివురై పోతాను

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది ….. నేనొక ప్రేమ పిపాసిని

Aatreya, Movie - Indradhanassu

The man who is responsible for this men to become HUMAN

CELLPHONE-FAKE NOTE DETECTOR

Stop Spitting in Public Places

కొడవటిగంటి రచనా ప్రపంచం




కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవలికను గుర్తు తెచ్చుకుని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.

పది పన్నెండేళ్ళ వయసులోనే నవలలు చదివేసిన నాకు కుటుంబరావు గారి పరిచయం కేవలం పది పన్నెండేళ్ళ క్రితం జరగడం నాకే ఆశ్చర్యం! లోకం గొప్ప రచయితలుగా ముద్ర వేసిన కొందరు రచయితల రచనలు నన్ను అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల గొప్ప రచయితలంటే భయం ఏర్పడి ఆయన రచనల జోలికి పోలేదనుకుంటాను.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుట్ పాత్ మీద కుటుంబరావుగారి నవలలు కొనడంతో ఆయన రచనా ప్రపంచం తలుపు తట్టాను. ఆ నవలికలు నన్ను అద్భుత రస ప్రపంచంలోకి విసిరి కొట్టాయి. మిగిలిన సంపుటాల కోసం ఎంతగా ప్రయత్నించినా అప్పటికే విశాలాంధ్రలో స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు.

కానీ ఆశ్చర్యకరంగా రెండు నవలా సంపుటాలు హ్యూస్టన్ మీనాక్షి ఆలయం లోని పుస్తక విక్రయకేంద్రంలో దొరికాయి.

కుటుంబరావు గారి శైలి గురించి, ఆయన పాత్ర చిత్రణ గురించీ,ఇంకా రచనా చమత్కృతి గురించీ వారి శత జయంతి సందర్భంగా అనేక ఆన్ లైన్ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ వ్యాసాలు వచ్చాయి. అందువల్ల మళ్ళీ ఇక్కడ దాన్ని నా దృష్టి కోణం నుంచి వివరించే ప్రయత్నం, చెయ్యను కానీ ఆయన రాసిన ఒక నవలికను పరిచయం చేయాలనుకుంటున్నాను.

ఆలిండియా రేడియో సీరియల్ గా ప్రసారం చేయడానికి డైరీ రూపంలో ఒక పెద్ద కథ రాయమని కుటుంబరావు గారిని కోరినపుడు ఆయన 'సరితాదేవి డైరీ"ని రాశారు. అది ప్రసారం కూడా అయిపోయాక కుటుంబరావు గారికి అది అసంపూర్ణంగా ఉన్నట్లు తోచింది. ఆయన మాటల్లో ఇలా అంటారు

"కథ అయిపోయింది, అయిపోలేదు కూడా! ఎందుకంటే కథ తాలూకూ చాలా విషయాలు ఈ డైరీలోకి రాలేకపోయాయి.కష్టపడి కథ ఆలోచించిన రచయిత దాన్ని పాఠకులకు(శ్రోతలకు)అందజేయలేకపోయిన రచయిత ఎంత ఆందోళన చెందుతాడో ఎవరైనా సులువుగా ఊహించవచ్చు! సరితా దేవి డైరీతో రేడియో మాసం దాటింది కానీ నా పని గడవలేదు.అందుచేత సరితా దేవి డైరీ కి అనుబంధంగా సరోజ డైరీ రాశాను"!


ఈ రెండు డైరీలలో వచ్చే పాత్రలతో తర్వాత ఆయన "కామినీ హృదయం" అనే నాటిక కూడా రాశారు.


ఒకే కథను రెండు వైపుల నుంచీ ఇద్దరు తల్లీ కూతుళ్ళ డైరీల ద్వారా అద్భుతంగా చెప్పిన కథే ఈ "సరితా దేవి డైరీ" సరోజ డైరీలు!

కథ విషయానికొస్తే ........

సరితాదేవి ఒక మధ్యతరగతి తల్లి. ఆడపిల్ల తల్లి!

కథ చాలా కాలం నాటిది కనుక ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన కూతురికి అప్పుడే పెళ్ళి చెయ్యాలని,గొప్ప వరుడిని తేవాలని ఆరాటపడే సగటు తల్లి! చాలా మంది మధ్యతరగతి వాళ్ళకుండే రోగం....అదే గొప్పింటివాళ్లతో పోటీ పడాలని,ఒక్కోసారి గెలవాలని కూడా అనుకునే అభిజాత్యపు రోగం అంతో ఇంతో సరితాదేవిక్కూడా ఉంది.



రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అమ్మాయి సావిత్రి, సరితా దేవికూతురు సరోజా స్నేహితులు.ఇద్దరూ పెళ్ళికెదిగిన వాళ్ళే! ఈ నేపథ్యంలో సరితా దేవి తమ్ముడు వాసుతో పాటు ఢిల్లీ నుంచి మనోరంజన్ అనే అందగాడూ, మంచి ఉద్యోగస్తుడూ అందునా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలరూ వస్తాడు.

 ఇటు సరితాదేవి, అటు సావిత్రి తల్లీ అతడిని తమ తమ కూతుళ్లకు వరుడిగా చేసెయ్యాలని ఆరాటపడతారు.అతడు తిరిగి ఢిల్లీ వెళ్ళేవరకూ కూతురి పట్ల అతడికి ఆకర్షణ కలిగించాలని,సరోజను మిసెస్ మనోరంజన్ గా చేసెయ్యాలని సరితా దేవి చేసిన ప్రయత్నాలే ఆమె రాసుకున్న డైరీ!



మరో వైపు సరోజ మనో రంజన్ వైపు ఆకర్షితురాలవుతూనే,అతడిని ఇష్టపడుతూనే తన తల్లి చేసే "చవకబారు
ప్రయత్నాలు " తనకెంత చిరాకు పుట్టించాయో తన డైరీలో రాసుకుంటుంది.



సావిత్రితో మనోరంజన్ పెళ్ళి స్థిరమైపోయిందనే వార్త రూఢిగా తెలిశాక సరితాదేవి నిరాశలో కూరుకుపోతుంది.ఇది ఒక రకంగా ఆమెకు ఓటమి కూడా కదా సుశీల ముందు! ఆమె తమ్ముడు వాసు "సరదాగా నాల్రోజులు ఢిల్లీలో గడిపి వస్తుంది సరోజను పంప"మనడం,ఢిల్లీ వెళ్ళాక అక్కడ సరోజ, రంజన్ లు పెద్దవాళ్లకు తెలీకుండా వాసు సహాయంతో రిజిస్టర్ పెళ్ళి చేసుకోవడం కథలో చివరి ట్విస్టు!



మనో రంజన్ తనను ఇష్టపడుతున్నాడనీ, తననే పెళ్ళాడతాడనీ సరోజకు నిశ్చయంగా తెలుసు. మరో వైపు సావిత్రి తల్లి సుశీల చేసే ప్రయత్నాల మీద కూడ ఆమెకు అనుమానంగానే ఉంటుంది.
ఇంకో వైపు తల్లి! ఇలా నలుగుతూనే సరోజ ఈ కథంతా డైరీలా మనకి చెప్తుంది. తేదీల వారీగా రాసే డైరీల మీద కుటుంబరావు గారికి ఆట్టే నమ్మకం లేకపోవడం వల్ల సరితా దేవి, సరోజ... కథ చెప్పుకుంటూ వెళతారంతే!



రెండూ ఒకటే కథ అయినా ఎవరి వైపు నుంచి వారు చెప్పడం వల్ల రెండూ కొత్తగానే అనిపిస్తాయి పాఠకులకి!

ఇదొక అద్భుత రచనా ప్రక్రియ అనిపిస్తుంది చదువుతున్నంత సేపూ, ఒకటే కథ రెండు వెర్షన్లలో ఇంత ఆసక్తి కరంగా మలచడం !.

ఒక మధ్యవయస్కురాలైన తల్లి, ఒక యుక్తవయస్కురాలైన కూతురు ఈ ఇద్దరి మనస్థత్వాలను కొ.కు ఆవిష్కరించిన తీరు అద్భుతంగా తోస్తుంది.


సావిత్రి, తన తల్లి ఎంత చెప్తే అంతని, బుద్ధి మంతురాలనీ , తన కూతురు సరోజ మాత్రం పెంకిదనీ, తన మాట విని బాగుపడతామనే ఆలోచనే లేదనీ సరితాదేవి కంప్లెయింట్!

 మరో పక్క సరోజేమో "సావిత్రి వాళ్ళమ్మ మాట వింటుందనీ నేను వినననీ నా మీద కోపం!నేనూ విందునేమో అమ్మక్కూడా సుశీల గారికున్నంత నాగరికత ఉంటే! 'నేను నీకు అమ్మనని ఎప్పుడైనా అనిపిస్తుందిటే? నేనేం చెప్పినా నీ చెడు కోసమే చెబుతున్నాననుకుంటున్నావా?' అని నన్ను నిలవేస్తుంది. ఆవిడకర్థమయ్యేట్టు చెప్పడం నాకు చాత కావడం లేదు.ఆవిడ నా మీద ఆపేక్షతోనే చెబుతుంది.కానీ ఆవిడ చెప్పినట్లా చేస్తే నేను నవ్వులపాలైపోవలసిందే! ఆవిడ నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. అటువంటి మనిషి ఆపేక్షకు విలువేమిటి?"అని ఆలోచిస్తుంది.



నలుగురిలో కూతురు అందంగా కనిపించాలని ఏ తల్లికైనా ఉంటుంది.ఇదే తాపత్రయం సరితాదేవి కూడా పడి సరోజ ను చిత్తం వచ్చినట్లు అలంకరించి మనోరంజన్ కి కాఫీలు, టీలూ అందించమంటుంది. సరోజేమో సహజంగా ఉండాలనుకుంటుంది.



"నన్ను ఉన్నట్టు ఉండనివ్వక ఏ రాధలాగో, మహాలక్ష్మి లాగో, అనసూయ లాగో చేస్తానంటుంది. నాకు చిరాకెత్తి 'నేనేం బట్టల దణ్ణెం అనుకున్నావా, నీకిష్టమైన చీరల్లా నా మీద వేసి చూడ్డానికి? అని అడిగేస్తాను. దాంతో ఆవిడకు కోపం వచ్చేస్తుంది"అని మనతో వాపోతుంది.



తల్లీ కూతుళ్ళ మధ్య ఇలాంటి తరల అంతరాల గొడవలని ఆ కాలంలోనే(ఎందుకంటే ఇప్పటికంటే అప్పటి ఆడపిల్లలు తల్లి చెప్పినట్లు వినేవాళ్లని కదా అందరం అనుకుంటాం) రచయిత ఎలా పరిశీలించారా అని ఆశ్చర్యం వేస్తుంది.



మనస్థత్వాలను కుటుంబరావు గారు మంచినీళ్ళ ప్రాయంగా అప్పటికప్పుడు విశ్లేషిస్తారని ఆయన రచనలు చదివిన వారికెవరికైనా అర్థం కావలసిందే! "తల్లి లేని పిల్ల" లో "మనుషుల సంస్కారం"అనే విషయాన్ని విశ్లేషించిన తీరు నేను ఎప్పటికీ అబ్బురపడే విషయమే! కొత్తకోడలు నవల్లో హనుమాయమ్మ గారి పాత్ర ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ దాదాపుగా కనపడే తల్లి పాత్ర!

ఈయన ఇన్ని రకాల మనుషుల్ని ఎప్పుడు చదవగలిగారని విస్మయం కలుగుతుంది. ఎందుకంటే ఒక రచనలో కనిపించిన మనో విశ్లేషణ మరో రచనలో కనిపించదు మరి! ఇటువంటి విస్తృత విశ్లేషణ అనేక కథల్లో, నవలల్లో, నవలికల్లో అసంఖ్యాకంగా చూడొచ్చు! ఎన్నని పేర్కొనగలం?

కుటుంబరావు గాని నవలల మీద పరిశోధన చేయదలిస్తే కొన్ని వందల అంశాల మీద వందల కొద్దీ చేయవచ్చు!

విశాలాంధ్ర  పబ్లిషింగ్ హౌస్ శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వంలో వేసిన సంపుటాలన్నీ చాలా రోజుల క్రితమే అందుబాటులో లేకుండా పోయాయి. ఎప్పుడు అడిగినా సరైన సమాధానం అక్కడ దొరకదు. "వస్తాయండీ" అనో "వేయాలని చూస్తున్నారండీ'అనో "చెప్పలేమండీ" అనో తప్పించి!





ఈ లోపు విరసం ఈ బాధ్యతను తీసుకుని "కొడవటిగంటి రచనా ప్రపంచం" పేరుతో ఆయన రచనలన్నింటినీ 16 సంపుటాలుగా అందుబాటులోకి తీసుకురావాలని తలపెట్టడం శుభపరిణామమే!

మార్చి నెలలో దీనిగురించి వేణువు బ్లాగులో కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో ఒక టపా వచ్చింది. ఆ టపా ద్వారానే నేను ఈ సంపుటాలన్నింటికీ తెప్పించే ఏర్పాటు చేయగలిగాను. ఇప్పటికే నాల్గు సంపుటాలు అందాయి కూడా! ఈ కొత్త సంపుటాల్లో విశాలాంధ్ర సంపుటాల్లో లాగా ఫుట్ నోట్స్ లేవు. వివరాలు అవసరమైన చోట్ల ఆ ఫుట్ నోట్స్ ఉంటే బావుండనిపిస్తుంది. కానీ విశాలాంధ్ర సంపుటాల్లో అవి మరీ ఎక్కువై విసుగెత్తిస్తాయి, కథను పక్కదారి పట్టిస్తూ!

ప్రతి సాహిత్యాభిమాని లైబ్రరీ లోనూ  ఉండదగ్గ ఈ పదహారు సంపుటాలూ ప్రీ-పబ్లికేషన్ ఆఫర్ కింద అసలు ధర కంటే తక్కువ ధరకే లభించే సదుపాయం కూడా ఉంది. ( నాకు అలాగే లభించాయి.) విరసం వేసిన సంపుటాలు కావలసిన వారు పూర్తి వివరాల కోసం "కొడవటిగంటి రచనా ప్రపంచం ". టపాలో చూడవచ్చు!

శ్రీ శ్రీ "మహా ప్రస్థానం"- అంకితం

శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి పేరు ఎరుగని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజ దర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టి వీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవిగా శ్రీ శ్రీ పేరు తెలుగుభాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. ఆయన రచనల్లో 1950 లో ప్రచురించబడిన 'మహాప్రస్థానం' అనే కవితాసంపుటి తెలుగు సాహితీ అభిమానుల మనసుల్లోనే కాకుండా.. సామాన్య ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంత గొప్ప కవితా సంపుటిలోంచి అప్పుడప్పుడూ కొన్నీటిని ఈ బ్లాగులో పెట్టడం ద్వారా అందరికీ ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుందని భావిస్తున్నాను. నేనే స్వయంగా టైపు చేసి పెడుతున్నాను. ఒక వేళ ఇలా పెట్టకూడదు అని ఏమైనా కాపీ రైట్ హక్కులు ఉంటే.. ఎవరైనా మిత్రులు తెలుపగలరు. అప్పుడు నేనే సదరు పోస్టులు తీసేస్తాను.

ఈ 'మహా ప్రస్థానం' పుస్తకంలోని చాలా కవితలను శ్రీ శ్రీ గారు 1930-40 మధ్య కాలంలో వ్రాసారట. ఈ మహాప్రస్థానాన్ని శ్రీ శ్రీ గారు ఆయన మిత్రుడు శ్రీ కొంపెల్ల జనార్ధనరావు గారికి అంకితం చేసారు. ఆ అంకిత వాక్యాలు కూడా కవితా రూపంలోనే స్వయంగా శ్రీ శ్రీ నే వ్రాశారు. ఈ పోస్టులో ఆ కవితను ఇస్తున్నాను. చూడండి మీరే.. వారి స్నేహ బంధాన్ని..!
నేస్తం దూరమైన బాధనీ.. తనతో మాట్లాడుతున్నట్టుగా.. ఎంత గొప్పగా చెప్పారో శ్రీశ్రీ గారో.. మీరే చూడండి.


"మహాప్రస్థానం" కొంపెల్ల జనార్ధన రావు కోసం..

తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...

తలపోసినవేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వు, చేయూతా ఇవ్వక...
మురికితనం కరుకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే...
అటు పోతే, ఇటు పోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి,
ఒక్కణ్ణి చేసి వేధించారని, బాధించారని
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా, నేస్తం!

దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్ళిపోయావా, నేస్తం!
చిరునవులనే పరిషేచన చేస్తూ...

అడుగడుగునా పొడచూసే
అనేకానేక శత్రువులతో,
పొంచి చీకట్లో కరవజూసే,
వంచకాల ఈ లోకంతో పొసగక
అచింతానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్, నేస్తం!
ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకుని...
అన్నీ, తన్నివేశావా నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!

బరంపురంలో మనం ఇంకా
నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
"ఉదయిని" సంచికలు పట్టుకు తిరగడం

జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచిక గూళ్ళేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకోని,
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడున్నామో, ఎక్కడకు పోతామో తెలియని,
ఆవేశంతో,
చుక్కల్లో ఆదర్శాలను లెక్కిస్తూ,
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహదృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించించో, శఠించిందో మనల్ని..
తుదకు నిన్ను విష నాగురలలోకి లాగి,
ఊపిరితిత్తులను కొలిమి తిత్తులుగా చేసి,
మా కళ్ళల్లో గంధక జాలలు,
గుండెల్లో గుగ్గిలపు ధూమం వేసి,
మా దారిలో ప్రశ్నార్ధం చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా
తనువులో అణువణువులో
సంవర్త భయంకర
ఝుంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను..
ఎంత మోగించిందయ్యా మమ్ము..
ఎవరు దుఃఖించారులే నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప...
ఆకాశం పడిపోకుండానే ఉంది..
ఆఫీసులకి సెలవు లేదు..
సారా దుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది..
సానుభూతుల సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం...
ఎవరి పనులలో వాళ్లు..
ఎవరి తొందరలో వాళ్లు..
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒక మాటకు బలి అయితే,
కనబడని ఊహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే, నియంత్రిస్తే..
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయిపోతేనేం నువ్వు?
మా బురద రోజూ హాజరు..
మా బురఖా మేము తగిలించుకున్నాం..
మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ములలాగే..
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు..
లేదు నేస్తం! లేదు
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు..
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము..

ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు..
భయం లేదులే అయినప్పటికీ..
నీ సాహసం ఒక ఉదాహరణ..
నీ జీవితమే ఒరవడి..
నిన్న వదలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు..

కావున ఈ నిరాశామయ లోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను..
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను..
అందుకో ఈ చాచిన హస్తం..
ఆవేశించు నాలో..
ఇలా చూడు నీ కోసం..
ఇదే నా మహాప్రస్థానం..!

-- శ్రీ శ్రీ


* ఏమైనా అక్షర దోషాలు కనిపిస్తే సరిచేయగలరని మనవి.

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070