Friday, September 11, 2009

మనల్ని మనం ప్రేమించుకుందాం..

తల్లిదండ్రులన్నా, బిడ్డలన్నా, తోబుట్టువులన్నా, మనకు ఎనలేని ప్రేమ, అభిమానం! రక్తసంబంధాలే కాదు స్నేహితుల్లో, బంధువుల్లో ఏ ఒక్క కోణం నచ్చినా కల్లాకపటం లేకుండా మానసికంగా దగ్గరైపోతాం. మనిషి జన్మతఃనైజం ప్రేమించడం! ప్రేమతో ఆత్మీయుల మనసుల్లోకి ఒదిగిపోయి నప్పుడు మనల్ని మనం మైమరిచిపోతాం. కేవలం మనుషుల్నే కాదు మనలోని సున్నితత్వాన్ని తట్టిలేపే మొక్కల్నీ, ప్రేమతో పంచనచేరే జంతువుల్నీ అన్నింటినీ ప్రేమిస్తాం. అవును నిజ్జంగా మనకు విశ్వజనీయమైన ప్రేమను అందించే, ప్రేమని ఆస్వాదించే గొప్ప మనసు ఉంది. అంత గొప్ప మనసు ఉండీ ఆ మనసు ఎప్పుడూ ఒంటరిదే! అందర్నీ అక్కున చేర్చుకుంటాం కానీ మనకి మనం ఎప్పుడూ మిగలం. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారూ అంటే తమనితాము ప్రేమించుకునేవారే! నిరంతరం ఇతరుల సంతోషంలో మనం ఆనందాన్ని వెదుక్కుంటాం. వారి మొహంలో ఆశించిన భావం ప్రతిఫలించకపోయినా, వారి మాటల్లో మనం కోరుకున్న భావోద్వేగం ఉట్టిపడకపోయినా మన మనసు నీరుకారిపోతుంది. తల్లి, బిడ్డ, భార్యా, భర్తా, సహోదరులు.. ఇలా మనం ఎవరైతే మన వాళ్లు అనుకుంటామో వారి ప్రతీ కదలికలోనూ అంతరార్థాన్ని ఒడిసిపట్టి విశ్లేషించి మనం అనుకున్న ఫలితం వస్తే సంతృప్తితో కడుపు నింపుకుంటాం. ఇలా ఆత్మీయుల కళ్లల్లో మెరుపుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి చివరకు మనం సాధించేది ఏమిటీ అంటే నిస్పృహ. ఇంతగా ప్రపంచాన్ని ప్రేమించే మనం, ఇంతగా ఎదుటి వ్యక్తి శ్రేయస్కుని కోరుకునే మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మన కోసం మన ఆనందం కోసం ఒంటరిగా గడుపుతామా? చుట్టూ మనుషులు లేకపోతే జీవితాన్ని కోల్పోయిన భావన కలుగుతుంది.



ఎంత కావలసిన వారైనా మాట పట్టింపు వచ్చి అరక్షణం పలక్కపోతే ఆ మౌనం భరించరానిదౌతుంది. మనవాళ్లనుకుని ప్రేమని పంచిన వారి నుండి మన ప్రేమకు కనీస గుర్తింపు అయినా దక్కకపోతే మనసు చివుక్కుమంటుంది. ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే పోతాం. మధ్యలో ఏర్పడే ఈ అనుబంధాల చిక్కుముళ్లపై అపేక్ష పెంచుకుని మనసుని మనల్ని మనం గాయపరుచుకుంటూ మనకంటూ మనం మిగల్లేక జీవశ్చవాల్లా ఒంటరి తనం అనుభవించడం ఎంత వరకూ సబబు? మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్న వారందరూ మనల్నీ అంతే అభిమానిస్తున్నారు అని భ్రమపడతాం. డబ్బు, హోదా, ధైర్యం, ఆరోగ్యం వంటివి ఉన్నంత వరకే మనకి దక్కే గౌరవాలు, ప్రేమలు అన్నీ! ఏ క్షణమైతే ఏ కారణం చేతైనా మనం భౌతిక బలాలను కోల్పోతాయో ఆ క్షణం మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారు ఎవరూ ఉండరు. అందుకే మనల్ని మనం ప్రేమించడం అలవర్చుకోవాలి. మనకు మనమే ఉన్నాం. ఎవరూ లేకపోయినా ఈ ప్రపంచంలోకి మనం ఏం చెయ్యడానికి వచ్చామో మన ధర్మాన్ని మనం నిర్వర్తించి వెళ్లగలిగేలా ఒంటరి పోరాటాన్ని సాగించే ధీర్వతం చాలా ముఖ్యమైనది. ప్రపంచాన్ని ప్రేమిద్దాం అంతకన్నా ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుందాం.

మనల్ని మనం ప్రేమించుకుందాం..

తల్లిదండ్రులన్నా, బిడ్డలన్నా, తోబుట్టువులన్నా, మనకు ఎనలేని ప్రేమ, అభిమానం! రక్తసంబంధాలే కాదు స్నేహితుల్లో, బంధువుల్లో ఏ ఒక్క కోణం నచ్చినా కల్లాకపటం లేకుండా మానసికంగా దగ్గరైపోతాం. మనిషి జన్మతఃనైజం ప్రేమించడం! ప్రేమతో ఆత్మీయుల మనసుల్లోకి ఒదిగిపోయి నప్పుడు మనల్ని మనం మైమరిచిపోతాం. కేవలం మనుషుల్నే కాదు మనలోని సున్నితత్వాన్ని తట్టిలేపే మొక్కల్నీ, ప్రేమతో పంచనచేరే జంతువుల్నీ అన్నింటినీ ప్రేమిస్తాం. అవును నిజ్జంగా మనకు విశ్వజనీయమైన ప్రేమను అందించే, ప్రేమని ఆస్వాదించే గొప్ప మనసు ఉంది. అంత గొప్ప మనసు ఉండీ ఆ మనసు ఎప్పుడూ ఒంటరిదే! అందర్నీ అక్కున చేర్చుకుంటాం కానీ మనకి మనం ఎప్పుడూ మిగలం. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారూ అంటే తమనితాము ప్రేమించుకునేవారే! నిరంతరం ఇతరుల సంతోషంలో మనం ఆనందాన్ని వెదుక్కుంటాం. వారి మొహంలో ఆశించిన భావం ప్రతిఫలించకపోయినా, వారి మాటల్లో మనం కోరుకున్న భావోద్వేగం ఉట్టిపడకపోయినా మన మనసు నీరుకారిపోతుంది. తల్లి, బిడ్డ, భార్యా, భర్తా, సహోదరులు.. ఇలా మనం ఎవరైతే మన వాళ్లు అనుకుంటామో వారి ప్రతీ కదలికలోనూ అంతరార్థాన్ని ఒడిసిపట్టి విశ్లేషించి మనం అనుకున్న ఫలితం వస్తే సంతృప్తితో కడుపు నింపుకుంటాం. ఇలా ఆత్మీయుల కళ్లల్లో మెరుపుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి చివరకు మనం సాధించేది ఏమిటీ అంటే నిస్పృహ. ఇంతగా ప్రపంచాన్ని ప్రేమించే మనం, ఇంతగా ఎదుటి వ్యక్తి శ్రేయస్కుని కోరుకునే మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మన కోసం మన ఆనందం కోసం ఒంటరిగా గడుపుతామా? చుట్టూ మనుషులు లేకపోతే జీవితాన్ని కోల్పోయిన భావన కలుగుతుంది.



ఎంత కావలసిన వారైనా మాట పట్టింపు వచ్చి అరక్షణం పలక్కపోతే ఆ మౌనం భరించరానిదౌతుంది. మనవాళ్లనుకుని ప్రేమని పంచిన వారి నుండి మన ప్రేమకు కనీస గుర్తింపు అయినా దక్కకపోతే మనసు చివుక్కుమంటుంది. ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే పోతాం. మధ్యలో ఏర్పడే ఈ అనుబంధాల చిక్కుముళ్లపై అపేక్ష పెంచుకుని మనసుని మనల్ని మనం గాయపరుచుకుంటూ మనకంటూ మనం మిగల్లేక జీవశ్చవాల్లా ఒంటరి తనం అనుభవించడం ఎంత వరకూ సబబు? మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్న వారందరూ మనల్నీ అంతే అభిమానిస్తున్నారు అని భ్రమపడతాం. డబ్బు, హోదా, ధైర్యం, ఆరోగ్యం వంటివి ఉన్నంత వరకే మనకి దక్కే గౌరవాలు, ప్రేమలు అన్నీ! ఏ క్షణమైతే ఏ కారణం చేతైనా మనం భౌతిక బలాలను కోల్పోతాయో ఆ క్షణం మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేవారు ఎవరూ ఉండరు. అందుకే మనల్ని మనం ప్రేమించడం అలవర్చుకోవాలి. మనకు మనమే ఉన్నాం. ఎవరూ లేకపోయినా ఈ ప్రపంచంలోకి మనం ఏం చెయ్యడానికి వచ్చామో మన ధర్మాన్ని మనం నిర్వర్తించి వెళ్లగలిగేలా ఒంటరి పోరాటాన్ని సాగించే ధీర్వతం చాలా ముఖ్యమైనది. ప్రపంచాన్ని ప్రేమిద్దాం అంతకన్నా ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుందాం.

వినోబా భావే

  • వినోబా భావే ఎప్పుడు జన్మించారు--సెప్టెంబర్ 11, 1895.
  • వినోబా భావే ఎక్కడ జన్మించారు--మహారాష్ట్రలోని గగోడేలో.
  • 1940లో వినోబాభావేను తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఎంపికచేసినది--మహాత్మాగాంధీ.
  • వినోబా భావే స్థాపించిన ప్రముఖ పౌనార్ ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉంది--మహారాష్ట్ర.
  • వినోబాభావే ప్రారంభించిన ప్రముఖ సామాజిక ఉద్యమం--భూదానోద్యమం.
  • వినోబాభావే భూదానోద్యమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు--నల్గొండ జిల్లా పోచంపల్లి.
  • భూదానోద్యమాన్ని వినోబాభావే ఏ సం.లో ప్రారంభించారు--1954.
  • 1958లో వినోబా భావేకు లభించిన అవార్డు--రామన్ మెగ్సేసే అవార్డు.
  • వినోబా భావేకు భారతరత్న అవార్డు ఏ సంవత్సరానికిగాను లభించింది--1983.
  • వినోబాభావే ఎప్పుడు మరణించారు--నవంబర్ 15, 1982.

వినోబా భావే

  • వినోబా భావే ఎప్పుడు జన్మించారు--సెప్టెంబర్ 11, 1895.
  • వినోబా భావే ఎక్కడ జన్మించారు--మహారాష్ట్రలోని గగోడేలో.
  • 1940లో వినోబాభావేను తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఎంపికచేసినది--మహాత్మాగాంధీ.
  • వినోబా భావే స్థాపించిన ప్రముఖ పౌనార్ ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉంది--మహారాష్ట్ర.
  • వినోబాభావే ప్రారంభించిన ప్రముఖ సామాజిక ఉద్యమం--భూదానోద్యమం.
  • వినోబాభావే భూదానోద్యమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు--నల్గొండ జిల్లా పోచంపల్లి.
  • భూదానోద్యమాన్ని వినోబాభావే ఏ సం.లో ప్రారంభించారు--1954.
  • 1958లో వినోబా భావేకు లభించిన అవార్డు--రామన్ మెగ్సేసే అవార్డు.
  • వినోబా భావేకు భారతరత్న అవార్డు ఏ సంవత్సరానికిగాను లభించింది--1983.
  • వినోబాభావే ఎప్పుడు మరణించారు--నవంబర్ 15, 1982.

Thursday, September 10, 2009

Have u Seen day and night at single time?

THIS PHOTO IS ABSOLUTELY BEAUTIFUL. BE SURE TO
READ THE TEXT BELOW TO HAVE A BETTER UNDERSTANDING
OF WHAT YOU ARE VIEWING. IT IS HISTORIC TOO AS THIS
IS THE LAST MISSION FOR COLUMBIA ..

[cid:image001.jpg@01CA31F8.702ABD20]

The photograph attached was taken by the crew on board the Columbia
during its last mission, on a cloudless day.
The picture is of Europe and Africa when the sun is setting.
Half of the picture is in night. The bright dots you see are the cities' lights.

The top part of Africa is the Sahara Desert .

Note that the lights are already on in Holland , Paris , and Barcelona,
and that's it's still daylight in Dublin , London , Lisbon , and Madrid .

The sun is still shining on the Strait of Gibraltar . The Mediterranean Sea is
already in darkness.

In the middle of the Atlantic Ocean you can see the Azores Islands;
below them to the right are the Madeira Islands ; a bit below are the
Canary Islands; and further South, close to the farthest western point
of Africa , are the Cape Verde Islands.

Note that the Sahara is huge and can be seen clearly both during
day time and night time.

To the left, on top, is Greenland , totally frozen.

Have u Seen day and night at single time?

THIS PHOTO IS ABSOLUTELY BEAUTIFUL. BE SURE TO
READ THE TEXT BELOW TO HAVE A BETTER UNDERSTANDING
OF WHAT YOU ARE VIEWING. IT IS HISTORIC TOO AS THIS
IS THE LAST MISSION FOR COLUMBIA ..

[cid:image001.jpg@01CA31F8.702ABD20]

The photograph attached was taken by the crew on board the Columbia
during its last mission, on a cloudless day.
The picture is of Europe and Africa when the sun is setting.
Half of the picture is in night. The bright dots you see are the cities' lights.

The top part of Africa is the Sahara Desert .

Note that the lights are already on in Holland , Paris , and Barcelona,
and that's it's still daylight in Dublin , London , Lisbon , and Madrid .

The sun is still shining on the Strait of Gibraltar . The Mediterranean Sea is
already in darkness.

In the middle of the Atlantic Ocean you can see the Azores Islands;
below them to the right are the Madeira Islands ; a bit below are the
Canary Islands; and further South, close to the farthest western point
of Africa , are the Cape Verde Islands.

Note that the Sahara is huge and can be seen clearly both during
day time and night time.

To the left, on top, is Greenland , totally frozen.

ఆచార్యదేవోభవ!

september 5th,నేడు ఉపాధ్యాయ దినోత్సవం
- కర్లపాలెం హనుమంతరావు

'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయించినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
(ఈనాడు, ౦౫:౦౯:౨౦౦౯)
____________________________

ఆచార్యదేవోభవ!

september 5th,నేడు ఉపాధ్యాయ దినోత్సవం
- కర్లపాలెం హనుమంతరావు

'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయించినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
(ఈనాడు, ౦౫:౦౯:౨౦౦౯)
____________________________

విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సత్యనారాయణ

* విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడు జన్మించారు--సెప్టెంబర్ 10, 1895.
* విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడ జన్మించారు--కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో.
* 1957లో విశ్వనాథ సత్యనారాయణ ఏ అకాడమీకి ఉపాధ్యక్షులయ్యారు--సాహిత్య అకాడమీ.
* ఏ సంవత్సరంలో విశ్వనాథ సత్యనారాయణ విధానమండలికి నామినేట్ అయ్యారు--1958.
* విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు రచనను హిందీలోకి అనువదించినది--పి.వి.నరసింహరావు (సహస్రఫణ్ పేరుతో).
* ఏ రచనకు గాను విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు లభించింది--శ్రీమద్రామాయణ కల్పవృక్షం.
* విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఏ సంవత్సరానికి గాను లభించింది--1970.
* జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రత్యేకత--ఈ పురస్కారం పొందిన తొలి తెలుగు కవి.
* విశ్వనాథ సత్యనారాయణను మాట్లాడే వెన్నుముకగా అభివర్ణించినది--శ్రీశ్రీ.
* విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడు మరణించారు--అక్టోబర్ 18, 1976.

విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సత్యనారాయణ

* విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడు జన్మించారు--సెప్టెంబర్ 10, 1895.
* విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడ జన్మించారు--కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో.
* 1957లో విశ్వనాథ సత్యనారాయణ ఏ అకాడమీకి ఉపాధ్యక్షులయ్యారు--సాహిత్య అకాడమీ.
* ఏ సంవత్సరంలో విశ్వనాథ సత్యనారాయణ విధానమండలికి నామినేట్ అయ్యారు--1958.
* విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు రచనను హిందీలోకి అనువదించినది--పి.వి.నరసింహరావు (సహస్రఫణ్ పేరుతో).
* ఏ రచనకు గాను విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు లభించింది--శ్రీమద్రామాయణ కల్పవృక్షం.
* విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఏ సంవత్సరానికి గాను లభించింది--1970.
* జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రత్యేకత--ఈ పురస్కారం పొందిన తొలి తెలుగు కవి.
* విశ్వనాథ సత్యనారాయణను మాట్లాడే వెన్నుముకగా అభివర్ణించినది--శ్రీశ్రీ.
* విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడు మరణించారు--అక్టోబర్ 18, 1976.

AutoGraphs of Indian Legends


AutoGraphs of Indian Legends


FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070