Showing posts with label బంధాలు-అనుబంధాలు. Show all posts
Showing posts with label బంధాలు-అనుబంధాలు. Show all posts

Thursday, November 5, 2009

ఆదర్శదాంపత్యం ఎలా ఉండాలి?

ఆదర్శదాంపత్యం ఎలా ఉండాలి? (అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర)

ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలి? అనే విషయాన్ని ఓ రెండు పక్షుల మాటల్లో మనుచరిత్రలో పెద్దన ఎంతో అందంగా, సందేశాత్మకంగా వివరించి చెప్పాడు. మార్కండేయ పురాణం ఆధారంగా రూపొందిన మనుచరిత్ర ఆరో ఆశ్వాసంలో హంసి చక్రవాక సంవాదం అనే ఓ కథ ఉంది. ఇందులో చక్రవాక పక్షి హంసి (ఆడహంస)కి భార్యాభర్తల బంధం విలువను ఇలా తెలియజెప్పింది.

పూర్వం స్వరోచి అనే రాజు ఉండేవాడు. ఆయన విద్యావంతుడు, బుద్ధిమంతుడై ఉండి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుండేవాడు. అలాంటి స్వరోచి ఓ సంఘటనలో ఒకేసారి ముగ్గురిని పెళ్ళాడాల్సి వచ్చింది. తొలిగా మనోరమను, ఆ తర్వాత ఆమె స్నేహితురాళ్ళయిన విభావసి, కళావతి అనే మరో ఇద్దరు కన్యలనూ వివాహమాడాడు. మనోరమను వివాహమాడినందుకు ఆమె తండ్రి నుంచి ఆయుర్వేద విద్యను, విభావసి వల్ల మృగ, పక్షి జాతుల సంభాషణలను తెలుసుకొనే విద్యలను, కళావతి వల్ల సర్వ అభీష్టాలు తీర్చే పద్మినీ అనే విద్యను పొందాడు స్వరోచి. పద్మినీ విద్య ప్రభావంతో సంమృద్ధిగా అన్నపానీయాలు, వస్త్రాభరణాలు తరగని సర్వసంపదలను సొంతం చేసుకున్నాడు. నిరంతర సుఖ జీవనం ఆయనకు ప్రాప్తించింది.

నిత్యం తన భార్యలను తీసుకొని గంగానది ఒడ్డున ఉన్న అందమైన ఇసుక తిన్నెల మీద పూలతోటల్లో సరోవర తీరాలలోనూ హాయిగా విహరిస్తుండేవాడు. ఇలా విహరిస్తున్న రోజుల్లో ఓ రోజున స్వరోచి అందమైన చందన వృక్షాల సమీపంలో ఉన్న ఒక సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సరస్సులో ఆనందంగా విహరిస్తున్న ఓ ఆడహంస అక్కడికి సమీపంలో విహరిస్తున్న ఆడ చక్రవాక పక్షిని తన వద్దకు రమ్మని రహస్యంగా పిలిచింది. స్వరోచిని.. అతడి భార్యలను చూపించింది. ఇలా ఏ భేదమూ లేకుండా ముగ్గురు స్త్రీలు ఒక పురుషుడితో జత కూడి వినోదించటమంటే ఎంత అదృష్టమోగదా, వారు పూర్వ జన్మలలో ఎంత గొప్ప తపస్సు చేశారో కదా అని అంది.

అలాగే భార్యకు భర్తపైన, భర్తకు భార్యపైన వలపు కలగటం లోకసామాన్యమైన విషయమే కానీ భార్యాభర్తలిద్దరికీ ఒకరిమీద మరొకరికి కొద్దిగా కూడా తేడా లేకుండా వలపు సమానంగా ఉండటం మాత్రం పూర్వజన్మ పుణ్యఫలమనే నా భావన. ఈ ముగ్గురు స్త్రీల మీద రాజుకు ప్రేమ ఉన్నట్లే ఆ రాజుపై కూడా స్త్రీలకు సమాన ప్రేమ ఉంది. పువ్వు, పరిమళం పరస్పరం కలిసి ఉన్నట్టే వీరి ప్రేమానురాగాలు నాకు కనిపిస్తున్నాయి అని అంది ఆడహంస.

అప్పుడు చక్రవాకం హంసికి వాస్తవం ఏంటో నిర్మొహమాటంగా తెలియజెప్పాలనుకొని ఇలా అంది. 'చూడు హంసి.. పైపైకి కన్పిస్తున్న ఈ భోగాల మెరుగులు చూసి ఇవన్నీ గత జన్మపుణ్య ఫలాలని అనుకోవటం నాకు వింతగా అనిపిస్తుంది. ఈ రాజు ఒక స్త్రీతో మిగిలిన ఇద్దరిముందూ రమిస్తున్నా ఆ ఇద్దరూ వారిని ఏవగించటం, కోపగించటం ఏమీ చేయటం లేదు. ఆత్మ గౌరవాన్ని వదిలి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ప్రేమను నీవు కూడా సమర్థిస్తూ స్తుతించటం ఏమీ బాగాలేదు. ఇలాంటిది కపట ప్రేమ తప్ప మరేమీ కాదు.

ఒక పురుషుడికి అనేక స్త్రీల మీద, అనేక స్త్రీలకు ఒక పురుషుడి మీద అనురాగం కలగటంలో ఎప్పుడూ పారదర్శకత ఉండదు. స్వరోచికి అతడి భార్య మీదకానీ, భార్యలకు స్వరోచిపై కానీ నిజమైన ప్రేమ కొంచెం కూడా లేదన్నది నా భావన. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను విను. రాజు తనను సేవించే పరివారం అందరితో అనుకూలంగానే మాట్లాడినా అందరి మీదా అతడికి స్వచ్ఛమైన అనురాగం ఉండదు. అలాగే ఎంతమంది భార్యలున్నా మగవాడికి ఆ అందరి మీద గాఢానురాగం ఉండదు.

తన భర్త మరొక స్త్రీని తన ఎదుటే కలిస్తే ఏ స్త్రీ కూడా ఆ భర్తపై మమకారంతో మెలగదు. ఇది అక్షర సత్యం. కనుక ఈ స్త్రీలకు ఈ రాజుమీద అభిమానం, మమకారం అనేవి ఉండనే ఉండవు. మరి ఎందుకిలా కలిసి ఉన్నారంటావా? అదంతా ధనాన్ని ఆశించి మాత్రమే. దాసదాసీ జనం ధనవంతుడిని చేరినట్లే వీరూ అలా చేరారు. అందుకనే వీరి దాంపత్యాన్ని నేను గొప్ప దాంపత్యం అని అనడం లేదు. ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద, ఒక స్త్రీకి ఒక పురుషుడి మీద మాత్రమే కలిగిన అనురాగం శ్రేష్టమైంది. స్త్రీలలో నేను, పురుషుల్లో నా భర్త ఈ వాస్తవాన్ని గ్రహించి అలా మెలుగుతున్నాం కనుకనే మాది ఆదర్శ దాంపత్యం అయింది. ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఉంటేనే అన్ని విధాలా శ్రేయోదాయకం' అని ఆడ చక్రవాక పక్షి హంసితో చెప్పింది.


ఏనాడో పెద్దన చేతుల్లో రూపొందిన మనుచరిత్రలో ఈనాటి వారిక్కూడా ఆచరణ యోగ్యమైన నైతిక విలువలతో కూడిన ఒక జీవన సూత్రం ఇలా ఇక్కడ కనిపిస్తోంది. స్త్రీ లౌల్యాన్ని నిరసిస్తూ రెండు పక్షుల మాటల్లో అల్లసాని పెద్దన ఇంత చక్కటి సందేశాన్ని మానవాళికి అందించాడు.

ఆదర్శదాంపత్యం ఎలా ఉండాలి?

ఆదర్శదాంపత్యం ఎలా ఉండాలి? (అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర)

ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలి? అనే విషయాన్ని ఓ రెండు పక్షుల మాటల్లో మనుచరిత్రలో పెద్దన ఎంతో అందంగా, సందేశాత్మకంగా వివరించి చెప్పాడు. మార్కండేయ పురాణం ఆధారంగా రూపొందిన మనుచరిత్ర ఆరో ఆశ్వాసంలో హంసి చక్రవాక సంవాదం అనే ఓ కథ ఉంది. ఇందులో చక్రవాక పక్షి హంసి (ఆడహంస)కి భార్యాభర్తల బంధం విలువను ఇలా తెలియజెప్పింది.

పూర్వం స్వరోచి అనే రాజు ఉండేవాడు. ఆయన విద్యావంతుడు, బుద్ధిమంతుడై ఉండి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుండేవాడు. అలాంటి స్వరోచి ఓ సంఘటనలో ఒకేసారి ముగ్గురిని పెళ్ళాడాల్సి వచ్చింది. తొలిగా మనోరమను, ఆ తర్వాత ఆమె స్నేహితురాళ్ళయిన విభావసి, కళావతి అనే మరో ఇద్దరు కన్యలనూ వివాహమాడాడు. మనోరమను వివాహమాడినందుకు ఆమె తండ్రి నుంచి ఆయుర్వేద విద్యను, విభావసి వల్ల మృగ, పక్షి జాతుల సంభాషణలను తెలుసుకొనే విద్యలను, కళావతి వల్ల సర్వ అభీష్టాలు తీర్చే పద్మినీ అనే విద్యను పొందాడు స్వరోచి. పద్మినీ విద్య ప్రభావంతో సంమృద్ధిగా అన్నపానీయాలు, వస్త్రాభరణాలు తరగని సర్వసంపదలను సొంతం చేసుకున్నాడు. నిరంతర సుఖ జీవనం ఆయనకు ప్రాప్తించింది.

నిత్యం తన భార్యలను తీసుకొని గంగానది ఒడ్డున ఉన్న అందమైన ఇసుక తిన్నెల మీద పూలతోటల్లో సరోవర తీరాలలోనూ హాయిగా విహరిస్తుండేవాడు. ఇలా విహరిస్తున్న రోజుల్లో ఓ రోజున స్వరోచి అందమైన చందన వృక్షాల సమీపంలో ఉన్న ఒక సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సరస్సులో ఆనందంగా విహరిస్తున్న ఓ ఆడహంస అక్కడికి సమీపంలో విహరిస్తున్న ఆడ చక్రవాక పక్షిని తన వద్దకు రమ్మని రహస్యంగా పిలిచింది. స్వరోచిని.. అతడి భార్యలను చూపించింది. ఇలా ఏ భేదమూ లేకుండా ముగ్గురు స్త్రీలు ఒక పురుషుడితో జత కూడి వినోదించటమంటే ఎంత అదృష్టమోగదా, వారు పూర్వ జన్మలలో ఎంత గొప్ప తపస్సు చేశారో కదా అని అంది.

అలాగే భార్యకు భర్తపైన, భర్తకు భార్యపైన వలపు కలగటం లోకసామాన్యమైన విషయమే కానీ భార్యాభర్తలిద్దరికీ ఒకరిమీద మరొకరికి కొద్దిగా కూడా తేడా లేకుండా వలపు సమానంగా ఉండటం మాత్రం పూర్వజన్మ పుణ్యఫలమనే నా భావన. ఈ ముగ్గురు స్త్రీల మీద రాజుకు ప్రేమ ఉన్నట్లే ఆ రాజుపై కూడా స్త్రీలకు సమాన ప్రేమ ఉంది. పువ్వు, పరిమళం పరస్పరం కలిసి ఉన్నట్టే వీరి ప్రేమానురాగాలు నాకు కనిపిస్తున్నాయి అని అంది ఆడహంస.

అప్పుడు చక్రవాకం హంసికి వాస్తవం ఏంటో నిర్మొహమాటంగా తెలియజెప్పాలనుకొని ఇలా అంది. 'చూడు హంసి.. పైపైకి కన్పిస్తున్న ఈ భోగాల మెరుగులు చూసి ఇవన్నీ గత జన్మపుణ్య ఫలాలని అనుకోవటం నాకు వింతగా అనిపిస్తుంది. ఈ రాజు ఒక స్త్రీతో మిగిలిన ఇద్దరిముందూ రమిస్తున్నా ఆ ఇద్దరూ వారిని ఏవగించటం, కోపగించటం ఏమీ చేయటం లేదు. ఆత్మ గౌరవాన్ని వదిలి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ప్రేమను నీవు కూడా సమర్థిస్తూ స్తుతించటం ఏమీ బాగాలేదు. ఇలాంటిది కపట ప్రేమ తప్ప మరేమీ కాదు.

ఒక పురుషుడికి అనేక స్త్రీల మీద, అనేక స్త్రీలకు ఒక పురుషుడి మీద అనురాగం కలగటంలో ఎప్పుడూ పారదర్శకత ఉండదు. స్వరోచికి అతడి భార్య మీదకానీ, భార్యలకు స్వరోచిపై కానీ నిజమైన ప్రేమ కొంచెం కూడా లేదన్నది నా భావన. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను విను. రాజు తనను సేవించే పరివారం అందరితో అనుకూలంగానే మాట్లాడినా అందరి మీదా అతడికి స్వచ్ఛమైన అనురాగం ఉండదు. అలాగే ఎంతమంది భార్యలున్నా మగవాడికి ఆ అందరి మీద గాఢానురాగం ఉండదు.

తన భర్త మరొక స్త్రీని తన ఎదుటే కలిస్తే ఏ స్త్రీ కూడా ఆ భర్తపై మమకారంతో మెలగదు. ఇది అక్షర సత్యం. కనుక ఈ స్త్రీలకు ఈ రాజుమీద అభిమానం, మమకారం అనేవి ఉండనే ఉండవు. మరి ఎందుకిలా కలిసి ఉన్నారంటావా? అదంతా ధనాన్ని ఆశించి మాత్రమే. దాసదాసీ జనం ధనవంతుడిని చేరినట్లే వీరూ అలా చేరారు. అందుకనే వీరి దాంపత్యాన్ని నేను గొప్ప దాంపత్యం అని అనడం లేదు. ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద, ఒక స్త్రీకి ఒక పురుషుడి మీద మాత్రమే కలిగిన అనురాగం శ్రేష్టమైంది. స్త్రీలలో నేను, పురుషుల్లో నా భర్త ఈ వాస్తవాన్ని గ్రహించి అలా మెలుగుతున్నాం కనుకనే మాది ఆదర్శ దాంపత్యం అయింది. ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఉంటేనే అన్ని విధాలా శ్రేయోదాయకం' అని ఆడ చక్రవాక పక్షి హంసితో చెప్పింది.


ఏనాడో పెద్దన చేతుల్లో రూపొందిన మనుచరిత్రలో ఈనాటి వారిక్కూడా ఆచరణ యోగ్యమైన నైతిక విలువలతో కూడిన ఒక జీవన సూత్రం ఇలా ఇక్కడ కనిపిస్తోంది. స్త్రీ లౌల్యాన్ని నిరసిస్తూ రెండు పక్షుల మాటల్లో అల్లసాని పెద్దన ఇంత చక్కటి సందేశాన్ని మానవాళికి అందించాడు.

Thursday, October 29, 2009

వాళ్ళ కోసమే..

నెలల పసిపాపల్ని తల్లిపాలకి దూరం చేసి
తెలిసీ తిలియక ముందే క్రష్ ల పాలు చేసి

మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

అమ్మ కి నాన్న కి మధ్య ఆదమరచి నిద్రపోవాల్సిన వేళ లో
విసుగుతోనొ అలసటతోనో అర్దరాత్రి ఆఫీస్ లోనో ఉండి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

పాలబువ్వలు పెట్టే తీరిక లేక ప్రోసెస్డ్ తిండి అలవాటు చేసి
దాగుడు మూతలాడలేక ప్లే స్కూల్ కి పంపి
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించలేక
ట్యూషన్ కని ఉదయపు లేత నిద్రపై నీళ్ళు చల్లి
ఇదంతా చేసి
అమాయకపు బాల్యాన్నంతా దోచేసి
మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?

* Nothing else in this world can be better than a non-working mother అని ఎక్కడో చదివాను. నిజమేనేమో!!

వాళ్ళ కోసమే..

నెలల పసిపాపల్ని తల్లిపాలకి దూరం చేసి
తెలిసీ తిలియక ముందే క్రష్ ల పాలు చేసి

మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

అమ్మ కి నాన్న కి మధ్య ఆదమరచి నిద్రపోవాల్సిన వేళ లో
విసుగుతోనొ అలసటతోనో అర్దరాత్రి ఆఫీస్ లోనో ఉండి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

పాలబువ్వలు పెట్టే తీరిక లేక ప్రోసెస్డ్ తిండి అలవాటు చేసి
దాగుడు మూతలాడలేక ప్లే స్కూల్ కి పంపి
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించలేక
ట్యూషన్ కని ఉదయపు లేత నిద్రపై నీళ్ళు చల్లి
ఇదంతా చేసి
అమాయకపు బాల్యాన్నంతా దోచేసి
మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?

* Nothing else in this world can be better than a non-working mother అని ఎక్కడో చదివాను. నిజమేనేమో!!

అమ్మ అలిగింది

అమ్మ అలిగింది !

నాముసలి తల్లి....

పసిపిల్ల చేష్టలా అలిగింది !

నాన్న_అమ్మ నానుకొని కూర్చున్నందుకు,

చిట్టి చెల్లి_అమ్మవడి జేరినందుకు,

తమ్ముడు_అమ్మ భుజాలెక్కినందుకు,

కుళ్ళి కుళ్ళి నేనలిగినప్పుడు ......



బుంగమూతి ముడిచి

బుజ్జి చేతులు ముఖమ్మీద వాల్చి

కన్నీరు మున్నీరయినప్పుడు

నన్నెత్తుకుని, గుండెలకి హత్తుకుని,

ప్రాణాలు తోడేస్తున్నంత

ప్రేమించి,లాలించిన అమ్మ....

ఇప్పుడు అలిగింది !



కడుపున కన్నవాళ్ళు

కసురుకున్నందుకు,

పేగు చించుకు పుట్టినవాళ్ళు

ప్రేమ భిక్షరాల్చనందుకు



ఎదిగిన బిడ్డలమద్య

ఏకాకి అయినందుకు

పసిపిల్ల చేష్టలా....అమ్మ అలిగింది !



అమ్మను లాలించడానికిప్పుడు

అమ్మకు "అమ్మ" లేదు !

అమ్మని బులిపించడానికిప్పుడు

అమ్మకి "నాన్న" లేడు

అమ్మ వేదనను పంచుకోడానికిప్పుడు

అమ్మకి "మా నాన్న" లేడు 1

బ్రతుకు యుద్ధం ముగించి,

అశాంతితో ఒంటరి యుద్ధంతో అలసి

భద్రత కోల్పోతున్నప్పటి పసిపాప చేష్టలా

అమ్మ అలిగితే ....నాకు

లాలించే తీరికెక్కడిది ?

ప్రాణం పోసి కన్న మా అమ్మను

పెంచి పోషించి _పొద్దు వాల్చేస్తున్న

మా అమ్మను _బుజ్జగించే

వ్యవధి ఎక్కడిది??

ముసలి వెతలు భరించే

ఓపికెక్కడిది??

బ్రతుకు వేగంలో...పరిగెట్టీ, పరిగెట్టి

కాల చక్రంలో కస్సున నలుగుతున్నవాణ్ణి

కడుపుకింత రాల్చి

కృతజ్ఞత చూపించానన్న

ఆత్మవంచన-నరనరాన

జీర్ణించుకున్నవాణ్ణి!

ముసలి అమ్మను .......తీరికెక్కడిది?!



ఈ కవిత స్త్రీవాద కవితా సంకలనం" నీలిమేఘాలు" లోనిది." రచయిత్రి "రావులపల్లి సునీత" gaaru

కాని ఈ కవితలో వున్నది వట్టి స్త్రీవాదం అని కొట్టేయగలరా.. ఇది 1988 లో వచ్చిన కవిత. అప్పటికీ ఇప్పటికీ "అమ్మ " పరిస్తితి ఏమన్నా మారిందా! దయచేసి కవిత బావుందని తేల్చి పారేయకండి . కవితలో భావం గూర్చి ఆలోచించండి .అమ్మ అలక తీర్చే ప్రయత్నం చేయండి . ప్రేమికుల రోజున



_ పుట్టగానే,చూపులతోనే ప్రేమజడి కురిపించి నుదిటిమీద చల్లని ముద్దు పెట్టి తొలి ప్రేమను రుచి చూపించిన అమ్మను ఒకసారి ప్రత్యేకంగా ప్రేమగా పలకరించండి .

దానికీ ఓ రోజుందిగా అంటారా.....అదిగో ఆ లెక్కలే వద్దనేది. అమ్మకి ప్రేమని పంచే ఏ అవకాసాన్ని వదులోకండి. అమ్మకు ,అలిగే అవసరం రానీయకండి . 

అమ్మ అలిగింది

అమ్మ అలిగింది !

నాముసలి తల్లి....

పసిపిల్ల చేష్టలా అలిగింది !

నాన్న_అమ్మ నానుకొని కూర్చున్నందుకు,

చిట్టి చెల్లి_అమ్మవడి జేరినందుకు,

తమ్ముడు_అమ్మ భుజాలెక్కినందుకు,

కుళ్ళి కుళ్ళి నేనలిగినప్పుడు ......



బుంగమూతి ముడిచి

బుజ్జి చేతులు ముఖమ్మీద వాల్చి

కన్నీరు మున్నీరయినప్పుడు

నన్నెత్తుకుని, గుండెలకి హత్తుకుని,

ప్రాణాలు తోడేస్తున్నంత

ప్రేమించి,లాలించిన అమ్మ....

ఇప్పుడు అలిగింది !



కడుపున కన్నవాళ్ళు

కసురుకున్నందుకు,

పేగు చించుకు పుట్టినవాళ్ళు

ప్రేమ భిక్షరాల్చనందుకు



ఎదిగిన బిడ్డలమద్య

ఏకాకి అయినందుకు

పసిపిల్ల చేష్టలా....అమ్మ అలిగింది !



అమ్మను లాలించడానికిప్పుడు

అమ్మకు "అమ్మ" లేదు !

అమ్మని బులిపించడానికిప్పుడు

అమ్మకి "నాన్న" లేడు

అమ్మ వేదనను పంచుకోడానికిప్పుడు

అమ్మకి "మా నాన్న" లేడు 1

బ్రతుకు యుద్ధం ముగించి,

అశాంతితో ఒంటరి యుద్ధంతో అలసి

భద్రత కోల్పోతున్నప్పటి పసిపాప చేష్టలా

అమ్మ అలిగితే ....నాకు

లాలించే తీరికెక్కడిది ?

ప్రాణం పోసి కన్న మా అమ్మను

పెంచి పోషించి _పొద్దు వాల్చేస్తున్న

మా అమ్మను _బుజ్జగించే

వ్యవధి ఎక్కడిది??

ముసలి వెతలు భరించే

ఓపికెక్కడిది??

బ్రతుకు వేగంలో...పరిగెట్టీ, పరిగెట్టి

కాల చక్రంలో కస్సున నలుగుతున్నవాణ్ణి

కడుపుకింత రాల్చి

కృతజ్ఞత చూపించానన్న

ఆత్మవంచన-నరనరాన

జీర్ణించుకున్నవాణ్ణి!

ముసలి అమ్మను .......తీరికెక్కడిది?!



ఈ కవిత స్త్రీవాద కవితా సంకలనం" నీలిమేఘాలు" లోనిది." రచయిత్రి "రావులపల్లి సునీత" gaaru

కాని ఈ కవితలో వున్నది వట్టి స్త్రీవాదం అని కొట్టేయగలరా.. ఇది 1988 లో వచ్చిన కవిత. అప్పటికీ ఇప్పటికీ "అమ్మ " పరిస్తితి ఏమన్నా మారిందా! దయచేసి కవిత బావుందని తేల్చి పారేయకండి . కవితలో భావం గూర్చి ఆలోచించండి .అమ్మ అలక తీర్చే ప్రయత్నం చేయండి . ప్రేమికుల రోజున



_ పుట్టగానే,చూపులతోనే ప్రేమజడి కురిపించి నుదిటిమీద చల్లని ముద్దు పెట్టి తొలి ప్రేమను రుచి చూపించిన అమ్మను ఒకసారి ప్రత్యేకంగా ప్రేమగా పలకరించండి .

దానికీ ఓ రోజుందిగా అంటారా.....అదిగో ఆ లెక్కలే వద్దనేది. అమ్మకి ప్రేమని పంచే ఏ అవకాసాన్ని వదులోకండి. అమ్మకు ,అలిగే అవసరం రానీయకండి . 

Wednesday, October 28, 2009

అమ్మ



మదర్స్ డే రోజు తప్పితే అమ్మ విలువ ఇంకెప్పుడు గుర్తురాదు కాబోలు వీళ్ళకు. ఇదంతా మార్కెటింగ్ మహిమ. సృష్టిలో మానవుడికే కాదు ప్రతి ప్రాణికి అమ్మ వుంది. ఎవరికైనా అమ్మ అమ్మే. ప్రతి అమ్మ తన బిడ్డని ఒక వయసు వచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అది ప్రకృతి సహజం కూడా! ఎవరి మన్ననల కోసమో, బిరుదుల కోసమో, మెప్పుల మేకతోళ్ళ కోసమో అమ్మ తన పిల్లలిని లాలించదు పాలించదు. అది తన ధర్మంగా చేస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దయినట్లు బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డ బ్రతకదని తెలిసినా చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో. ఏమి ఆశించి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? అలాంటి అమ్మని ఈ ఒక్క రోజే గుర్తు చేసుకోవటం అంత ఆత్మవంచన ఇంకొకటి వుండదేమో.

అమ్మని ఏ అనాధాశ్రమంలోనో పడేసి ఏడాదికొకసారి ఒక గ్రీటింగ్ ముక్కో, ఓ కేకు ముక్కో పడేస్తే సరిపోతుందనుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇదా మనకు మన చదువులు నేర్పిన సంస్కారం!! ఇదా మనకు మన సంపదలు తెచ్చిన వైభోగం!!!

అమ్మ కోరేది ఈ ఒక్క రోజు ఆర్భాటపు వేడుకలని, బహుమతులిని, ప్రశంసలిని కాదు. రోజూ ఆప్యాయంగా అమ్మా అన్న ఒక పిలుపుని, ముదిమిలో లాలనని పాలనని, నీకు నేనున్నాను నీ జీవితమంతా తోడుంటాను అన్న ఒక భరోసాని . అంతకన్న మననుండి ఆమె ఏ పట్టుపీతాంబరాలని, కాంచన మణిమాణిక్యాదులని ఆశించదు.

అమ్మ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన రెండు వ్యాక్యాలు....


అమ్మ.....

ఆకలివేళ అక్షయ పాత్ర
ఆపద వేళ ధైర్యం మాత్ర.

ఈ రోజుమదర్స్ డే ని ఘనంగా ఆర్భాటంగా జరుపుకోవాలి అని నొక్కి వక్కాణిస్తుంది. ఇలా వక్కాణించేవాళ్ళు ఎంతమంది తమ అమ్మలిని అత్తలిని ప్రేమగా చూసుకుంటున్నారంటారు?

అమ్మ



మదర్స్ డే రోజు తప్పితే అమ్మ విలువ ఇంకెప్పుడు గుర్తురాదు కాబోలు వీళ్ళకు. ఇదంతా మార్కెటింగ్ మహిమ. సృష్టిలో మానవుడికే కాదు ప్రతి ప్రాణికి అమ్మ వుంది. ఎవరికైనా అమ్మ అమ్మే. ప్రతి అమ్మ తన బిడ్డని ఒక వయసు వచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అది ప్రకృతి సహజం కూడా! ఎవరి మన్ననల కోసమో, బిరుదుల కోసమో, మెప్పుల మేకతోళ్ళ కోసమో అమ్మ తన పిల్లలిని లాలించదు పాలించదు. అది తన ధర్మంగా చేస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దయినట్లు బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డ బ్రతకదని తెలిసినా చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో. ఏమి ఆశించి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? అలాంటి అమ్మని ఈ ఒక్క రోజే గుర్తు చేసుకోవటం అంత ఆత్మవంచన ఇంకొకటి వుండదేమో.

అమ్మని ఏ అనాధాశ్రమంలోనో పడేసి ఏడాదికొకసారి ఒక గ్రీటింగ్ ముక్కో, ఓ కేకు ముక్కో పడేస్తే సరిపోతుందనుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇదా మనకు మన చదువులు నేర్పిన సంస్కారం!! ఇదా మనకు మన సంపదలు తెచ్చిన వైభోగం!!!

అమ్మ కోరేది ఈ ఒక్క రోజు ఆర్భాటపు వేడుకలని, బహుమతులిని, ప్రశంసలిని కాదు. రోజూ ఆప్యాయంగా అమ్మా అన్న ఒక పిలుపుని, ముదిమిలో లాలనని పాలనని, నీకు నేనున్నాను నీ జీవితమంతా తోడుంటాను అన్న ఒక భరోసాని . అంతకన్న మననుండి ఆమె ఏ పట్టుపీతాంబరాలని, కాంచన మణిమాణిక్యాదులని ఆశించదు.

అమ్మ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన రెండు వ్యాక్యాలు....


అమ్మ.....

ఆకలివేళ అక్షయ పాత్ర
ఆపద వేళ ధైర్యం మాత్ర.

ఈ రోజుమదర్స్ డే ని ఘనంగా ఆర్భాటంగా జరుపుకోవాలి అని నొక్కి వక్కాణిస్తుంది. ఇలా వక్కాణించేవాళ్ళు ఎంతమంది తమ అమ్మలిని అత్తలిని ప్రేమగా చూసుకుంటున్నారంటారు?

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070