Monday, August 3, 2009

మీ సత్తా గురుంచి మీకేపాటి ఎరుక?

Self Reliance is not about being independent, but interdependent.

రవీంద్రనాథ్ ఠాగూర్ఠాగూర్ గీతాంజలిలోని ఓ పద్యాన్ని చూద్దాం. స్వర్గీయ ఇందిరాగాంధీ సైతం తన బల్ల మీద ఆ కవితా పంక్తులను పట్టం(frame) కట్టించుకొని పెట్టుకుందట. ఆ కవితా పంక్తులు…తెలుగులో…..
ఒక్కరైనా నీ కేకవిని
ఓ యని రాకున్నా…
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే
ఒక్కడవే బయలుదేరు.

జీవితం ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడామే ముఖ్యం కాదు…అప్పటికి ముసలివాళ్లమో, సాధించినదాన్ని మనసారా ఆశ్వాధించలేని పెద్దవాళ్లమో అయిపోవచ్చు కూడా. అందుకే ప్రయాణం మొత్తాన్ని ఆశ్వాధించడం నేర్చుకోండి.

సంతోషమైనా, విషాదమైనా…
ప్రశ్న అయినా, జవాబైనా…
మీకు మీరే!


అలాంటి మనస్తత్వం మీలో‌ఎంతగా పెంపొందితే అంతగా మీరు మిగతా ప్రపంచంలో మమేకమవుతున్నట్టు. కాని ఒక్కటి మాత్రం మరవకండి.

Being independent is not enough, be interdependent.

మీ గురుంచి కొన్ని విషయాలు:

౧. మీ గురుంచి మీరు బాగా తెలుసుకోవడమన్నది జీవితానికి చాలా ఉపయోగపడే అంశంగా గుర్తించండి.
౨. మీకు మీరే ‘ఆప్త మిత్రుడు’. మీకు మేరే ‘బద్ద శత్రువు’.
౩. చాలా సందర్భాలలో మీకు మీరే సాయం చేసుకోవాల్సి వుంటుంది. మీకు మీరే ధైర్యం చెప్పుకోవల్సి వుంటుంది. మీకు మీరే ఉత్సాహం కల్పించుకోవాల్సి వుంటుంది.
౪. అసలు మీకు మీరెంతగా తెలుసు? కష్టసుఖాల్లో… సమస్యల్లో …మీమీద, మీ ఆలోచనా శక్తి మీదే మీరేమేరకు ఆధారపడవచ్చో సరైన అంచనాకు రండి.
౫. మీ జీవన ప్రయాణంలో అనుభవాల ‘పదనిసలు’ మీవే. గెలుపు, ఓటముల మజిలీల దగ్గర మీ మానసికస్థాయి ఎప్పుడూ పొంగిపొర్లిపోయే వృధా వాగునీరు కాకూడదు.

మీ సత్తా గురుంచి మీకేపాటి ఎరుక?

Self Reliance is not about being independent, but interdependent.

రవీంద్రనాథ్ ఠాగూర్ఠాగూర్ గీతాంజలిలోని ఓ పద్యాన్ని చూద్దాం. స్వర్గీయ ఇందిరాగాంధీ సైతం తన బల్ల మీద ఆ కవితా పంక్తులను పట్టం(frame) కట్టించుకొని పెట్టుకుందట. ఆ కవితా పంక్తులు…తెలుగులో…..
ఒక్కరైనా నీ కేకవిని
ఓ యని రాకున్నా…
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే
ఒక్కడవే బయలుదేరు.

జీవితం ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడామే ముఖ్యం కాదు…అప్పటికి ముసలివాళ్లమో, సాధించినదాన్ని మనసారా ఆశ్వాధించలేని పెద్దవాళ్లమో అయిపోవచ్చు కూడా. అందుకే ప్రయాణం మొత్తాన్ని ఆశ్వాధించడం నేర్చుకోండి.

సంతోషమైనా, విషాదమైనా…
ప్రశ్న అయినా, జవాబైనా…
మీకు మీరే!


అలాంటి మనస్తత్వం మీలో‌ఎంతగా పెంపొందితే అంతగా మీరు మిగతా ప్రపంచంలో మమేకమవుతున్నట్టు. కాని ఒక్కటి మాత్రం మరవకండి.

Being independent is not enough, be interdependent.

మీ గురుంచి కొన్ని విషయాలు:

౧. మీ గురుంచి మీరు బాగా తెలుసుకోవడమన్నది జీవితానికి చాలా ఉపయోగపడే అంశంగా గుర్తించండి.
౨. మీకు మీరే ‘ఆప్త మిత్రుడు’. మీకు మేరే ‘బద్ద శత్రువు’.
౩. చాలా సందర్భాలలో మీకు మీరే సాయం చేసుకోవాల్సి వుంటుంది. మీకు మీరే ధైర్యం చెప్పుకోవల్సి వుంటుంది. మీకు మీరే ఉత్సాహం కల్పించుకోవాల్సి వుంటుంది.
౪. అసలు మీకు మీరెంతగా తెలుసు? కష్టసుఖాల్లో… సమస్యల్లో …మీమీద, మీ ఆలోచనా శక్తి మీదే మీరేమేరకు ఆధారపడవచ్చో సరైన అంచనాకు రండి.
౫. మీ జీవన ప్రయాణంలో అనుభవాల ‘పదనిసలు’ మీవే. గెలుపు, ఓటముల మజిలీల దగ్గర మీ మానసికస్థాయి ఎప్పుడూ పొంగిపొర్లిపోయే వృధా వాగునీరు కాకూడదు.

నశించిపోయే ప్రతి ఒక వృక్షం

నశించిపోయే ప్రతి ఒక వృక్షం....జీవకోటిదహనానికి అది ఒక కాష్టం


నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

వర్షరహిత్యముతో బీళ్ళయిపోయే పొలాలు
విషతుల్యముతో నిండిపోయే గాలులు
అధికధరలతో మండిపోయే సరుకులు
విపరీతవేడితో అల్లాడిపోయే జీవులు
ప్రాణభయముతో వణికిపోయే మనుషులు

వస్తున్నాయి ఆరోజులు తెలుసుకో
కుదిపేస్తాయి జీవితాలు మేలుకో

నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

తగ్గించాలి ప్లాస్టిక్ పదార్దాల వాడకం
కట్టిపెట్టాలి అతి ప్రయాణాల ఇంధనం
పొదుపుచేయాలి అనవసర విద్యుతుల వినియోగం
ఆపివేయాలి మధ్యమందు సీసాల విసిరివేయటం
నిర్వహించాలి వ్యర్ధ పదార్ధాల సేకరణం
కదిలిపో అలుపెరుగని కార్యాచరణతో
ఉండిపో తరిగిపోని పచ్చదనము తో
నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం
తరిగిపోతున్న వ్యవసాయ భూములు
కృంగిపోతున్న భూగర్భ జలరాశులు
కురుస్తున్న అతినీలలోహిత కిరణాలు
కనుమరుగైపోతున్న విస్తృతజంతు జీవరాశులు
ప్రభలిపోతున్న విస్తృతరోగకారక వైరస్
వినిపించుటలేదా ఆ ప్రమాద ఘంటికలు
తలపించుటలేదా యమ పద ఘట్టనలు
నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం
సస్యశ్యామలముగా మారాలి బంజరుభూములు
పుష్కలముగా కావాలి భూగర్భ జలరాశులు
నిరంతరముగా చేయాలి వృక్ష ప్రణాళికలు
పరిమితముగా వాడాలి కాగితపు ఉత్పత్తులు
ప్రళయవేగంగా రావాలి ప్రకృతిరక్షణపధకాలు

విద్యార్దులంతా....
ఉపాద్యాయులంతా....
ఉద్యోగులంతా ....
వ్యాపారులంతా ....
వ్యవసాయదారులంతా ....
నాయకులంతా....
విజ్ఞానవేత్తలంతా....
కలిసి నడించాలి ఈ హరిత విప్లవం....
కలిసి ఆపాలి రాబోయే ఆ క్షామం.
----------------------ప్రభాకర రావు కోటపాటి

నశించిపోయే ప్రతి ఒక వృక్షం

నశించిపోయే ప్రతి ఒక వృక్షం....జీవకోటిదహనానికి అది ఒక కాష్టం


నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

వర్షరహిత్యముతో బీళ్ళయిపోయే పొలాలు
విషతుల్యముతో నిండిపోయే గాలులు
అధికధరలతో మండిపోయే సరుకులు
విపరీతవేడితో అల్లాడిపోయే జీవులు
ప్రాణభయముతో వణికిపోయే మనుషులు

వస్తున్నాయి ఆరోజులు తెలుసుకో
కుదిపేస్తాయి జీవితాలు మేలుకో

నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

తగ్గించాలి ప్లాస్టిక్ పదార్దాల వాడకం
కట్టిపెట్టాలి అతి ప్రయాణాల ఇంధనం
పొదుపుచేయాలి అనవసర విద్యుతుల వినియోగం
ఆపివేయాలి మధ్యమందు సీసాల విసిరివేయటం
నిర్వహించాలి వ్యర్ధ పదార్ధాల సేకరణం
కదిలిపో అలుపెరుగని కార్యాచరణతో
ఉండిపో తరిగిపోని పచ్చదనము తో
నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం
తరిగిపోతున్న వ్యవసాయ భూములు
కృంగిపోతున్న భూగర్భ జలరాశులు
కురుస్తున్న అతినీలలోహిత కిరణాలు
కనుమరుగైపోతున్న విస్తృతజంతు జీవరాశులు
ప్రభలిపోతున్న విస్తృతరోగకారక వైరస్
వినిపించుటలేదా ఆ ప్రమాద ఘంటికలు
తలపించుటలేదా యమ పద ఘట్టనలు
నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం
సస్యశ్యామలముగా మారాలి బంజరుభూములు
పుష్కలముగా కావాలి భూగర్భ జలరాశులు
నిరంతరముగా చేయాలి వృక్ష ప్రణాళికలు
పరిమితముగా వాడాలి కాగితపు ఉత్పత్తులు
ప్రళయవేగంగా రావాలి ప్రకృతిరక్షణపధకాలు

విద్యార్దులంతా....
ఉపాద్యాయులంతా....
ఉద్యోగులంతా ....
వ్యాపారులంతా ....
వ్యవసాయదారులంతా ....
నాయకులంతా....
విజ్ఞానవేత్తలంతా....
కలిసి నడించాలి ఈ హరిత విప్లవం....
కలిసి ఆపాలి రాబోయే ఆ క్షామం.
----------------------ప్రభాకర రావు కోటపాటి

మట్టి వాసన

మట్టి వాసన


పసిపిల్లలకు అభం సుభం తెలియవు అంటుంది లోకం. 'భం' అంటే తార లేదా నక్షత్రం అని అర్థం. మంచి గుణాన్ని 'సు'గుణం అన్నట్లే, మంచి నక్షత్రాన్ని 'సు'భం అంటారు. సంపత్తార, మిత్రతార, క్షేమతార... వగైరాలు కలిసొచ్చే నక్షత్రాలు. సుభాలు. సుభానికి విరుద్ధమైనది 'అభం'. విపత్తార వంటి కీడు తెచ్చే నక్షత్రాలు అభాలు. ఈ తేడాలు, వివరాలు అంతగా తెలియవు కాబట్టి పసిపిల్లలను అభం సుభం ఎరుగనివాళ్ళని అనడం లోకంలో పరిపాటి. అభము సుభమ్ములం దెలియక ఆర్చెడి దేబెలు మాకు లెక్కయే?... అన్న తిరుపతి వేంకటకవుల ప్రయోగం ఈ అర్థంలోదే! అభం సుభం తెలియకపోవడమే బాల్యానికి అలంకారం. 'నా హృదయంలో నిదురించే చెలీ, పాటలో 'నీ వెచ్చని నీడ' అని ప్రయోగించారు కదా... నీడ ఎక్కడైనా వెచ్చగా ఉంటుందా?' అని శ్రీశ్రీని ఒక కుర్రవాడు ప్రశ్నించాడు. శ్రీశ్రీ అతణ్ని తేరిపార చూసి 'అభం సుభం తెలియని పసివాడివి... పెద్దయ్యాక నీకే తెలుస్తుందిలే' అని బదులిచ్చారు. పెద్దయ్యాక కన్యాశుల్కంలో గిరీశంలా తయారయ్యే అవకాశవాదులు సైతం బాల్యంలో అభం సుభం తెలియని పసివాళ్ళే కావడం ఈ సృష్టిలోని విశేషం. కల్లాకపటం ఎరుగని వయసు, కల్మషం తెలియని మనసు బాల్యానికి సహజసిద్ధమైన కవచకుండలాలు. తేడాలు పాటించకపోవడం అనేది బాల్యంలోనే సాధ్యం. ఒకే కంచం, ఒకే మంచం అనే మాట ఒక్క బాల్యానికే సరిగ్గా నప్పుతుంది. పక్కవాడి కంచంలోని వూరగాయను గబుక్కున తినేసి 'కావాలంటే నా నోరు చూడు' అని అడ్డంగా బుకాయించే బాల్యాన్ని భాగవతంలో అద్భుతంగా వర్ణించాడు బమ్మెర పోతన. అలాంటి నిష్కల్మషమైన పనులు పెద్దయ్యాక సాధ్యంకావు. అందుకే బాల్యం అమూల్యం! బాల్యంలో అనుభవాలు మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మనస్తత్వ నిపుణులు చెబుతారు. గాఢమైన చేదు అనుభవాలు ఆ వయసును గాయపరిస్తే- పెద్దయ్యాక ఆ వ్యక్తి సంఘ వ్యతిరేక శక్తిగా మారే అవకాశం బాగా ఎక్కువ.

చెరువుల్లో ఈతలు, నదీతీరాల్లో ఇసుక గూళ్ళు, జామచెట్లపై కోతి కొమ్మచ్చులు, మైదానాల్లో గాలిపటాలు, వర్షం నీటిలో కాగితం పడవలు, లేగదూడలతో సయ్యాటలు, తూనీగలతో సరాగాలు, పక్షులతో పరాచకాలు... ఇవీ మన సంప్రదాయ క్రీడావినోదాలు! కేవలం బాల్య వినోదాలే కావు- మనిషిలో కలివిడితనానికీ ఇవే పునాదులు. నేలతో నెయ్యం, నింగితో స్నేహం, నీటితో సావాసం, పంచభూతాలతో జట్టుకట్టడం, ప్రపంచంతో ప్రకృతితో కలిసికట్టుగా జీవించడం... ఇవే సిసలైన బాల్యానికి గీటురాళ్లు. మనిషితనానికి ఆనవాళ్ళు. నిజానికి లోకజ్ఞానం అక్కడినుంచే అలవడుతుంది. వికాసం అప్పుడే మొదలవుతుంది. బొమ్మల కొలువులు, వామన గుంటలు, గవ్వలాటలు, చెమ్మచెక్కలు, కాకి ఎంగిలి మామిడి ముక్కలపై ఉప్పూ, కారం అద్దుకు తినడం... వంటివి లేకపోతే బాల్యానికి అందమూ లేదు, అర్థమూ లేదు. అద్దాల మేడల్లో అబ్బురంగా పెరిగే అసూర్యంపశ్యలకు ఆ బాపతు బాల్యంతోను, కమ్మని మట్టివాసనతోను పరిచయం ఉండదు. ఒంటరిగా కూర్చుని నిత్యం యంత్రాలతో సావాసం చేసే పిల్లల శరీరాలు ఎదుగుతాయేగాని, మనసులు ఎదగవు. వెనకటికో ముని సుఖంగా తపస్సు చేసుకుంటుంటే హంతకుడొకడు వచ్చి తన పిడిబాకును దాచిపెట్టమని అడిగాడు. నిత్యం దాన్ని పరిశీలించడం, దాని గురించి ఆలోచించడం అలవాటై ముని స్వభావంలో క్రమంగా నేర ప్రవృత్తి అంకురించిన కథ మనకు తెలుసు. బాల్యంలో బొమ్మ పిస్తోళ్ళ ఆటలతోనే తప్ప సజీవమైన పిట్టల పాటలతో పరిచయం లేని పిల్లల విషయంలోనూ అదే జరుగుతుంది. మట్టిలో తెగ ఆడి ఒళ్ళంతా దుమ్ముకొట్టుకుపోయిన బాలకృష్ణుణ్ని చూస్తే- కైలాసంలో ఒంటినిండా విభూది పూసుకున్న శివుడు గుర్తొచ్చాడు పోతన్నకు! బయట నుంచి వచ్చినప్పుడల్లా రకరకాల కాలుష్యాలు పులుముకుని వస్తున్న పిల్లలను చూస్తుంటే దెయ్యాలు గుర్తొస్తున్నాయి మనకు!

ఇసుకతో గుడి కడతారు... తీరిగ్గా అలంకారాలు అద్దుతారు... తోచినంతసేపూ హాయిగా ఆడుకుంటారు... పొద్దుపోయేసరికి కట్టడాలను చులాగ్గా కూలగొట్టి పిల్లలు నిశ్చింతగా ఇంటిదారి పడతారు. బెంగలూ దుఃఖాలూ ఏమీ ఉండవు. సృజనాత్మకత అనే కాదు, మనిషిలో తాత్విక స్వభావానికీ అంకురారోపణ జరిగే సన్నివేశమది. నిర్జీవమైన యంత్రాలతో ఆట నైరాశ్యాన్ని నింపుతుంది. సజీవమైన పశువులతో, పక్షులతో ఆడుకునే పిల్లల హృదయాల్లో మానవీయ విలువలు స్థిరపడతాయి. అందుకే మన పెద్దలు సాహిత్యంలో సైతం విరివిగా జంతువులను సృష్టించారు. పశువూపక్షీ పిల్లామేకా పెట్టాపుంజూ చెట్టూచేమా- అన్నీ మనిషికి తోబుట్టువులేనన్న భావాన్ని మనసుల్లోకి చొప్పించారు. అవీ మానవ పరివారంలో భాగమేనని బోధించారు. పెంపకంలోనూ, సాహిత్యం ద్వారానూ ప్రకృతితో మనిషి బంధాన్ని పటిష్ఠం చేశారు. అలాగే జంతువుల బొమ్మలను ఆట వస్తువులుగా అందించారు. ఈ రకమైన సంప్రదాయ క్రీడావిధానాలు, ఆట వస్తువుల మూలంగా మనిషి వికాసానికి ఎంతో మేలు జరుగుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన బాల్య వికాస నిపుణుడు, మనస్తత్వవేత్త డాక్టర్‌ జాన్‌ జురైదిని పరిశోధనలో తరతరాల సంప్రదాయ ఆటపాటలు మనిషిలో సృజనాత్మకతకు, వికాసానికి, చలాకీతనానికి కారణం అవుతున్నాయని తేలింది. ఎలక్ట్రానిక్‌ ఆట వస్తువులు, కంప్యూటర్‌ క్రీడలు- పిల్లల్లోని భావుకతకు, ఊహాశాలితకు హానిచేస్తున్నాయనీ రుజువైంది. పిల్లల్లో నేరప్రవృత్తికి అవి దోహదపడుతున్నాయని డాక్టర్‌ జాన్‌ ప్రకటించారు. మరో శాస్త్రవేత్త కారెన్‌ స్టాగ్నిటి సంప్రదాయ క్రీడారీతులు, ఆటపాటలు, వస్తువులు- పిల్లలకు సహజత్వాన్ని నేర్పుతున్నాయన్నారు. సామాజిక జీవన కౌశలం, భాషాపటిమ, సమగ్రవికాసం వంటివాటికి అవే పునాదులుగా చెబుతున్నారు. ఎంతసేపూ పిల్లలను మేధావులుగా తీర్చిదిద్దాలని తపించే తల్లిదండ్రులు ఇకపై వారిని సమర్థులుగా రూపొందించే ప్రయత్నాలు చెయ్యాలన్నది వారందరి హెచ్చరిక!

మట్టి వాసన

మట్టి వాసన


పసిపిల్లలకు అభం సుభం తెలియవు అంటుంది లోకం. 'భం' అంటే తార లేదా నక్షత్రం అని అర్థం. మంచి గుణాన్ని 'సు'గుణం అన్నట్లే, మంచి నక్షత్రాన్ని 'సు'భం అంటారు. సంపత్తార, మిత్రతార, క్షేమతార... వగైరాలు కలిసొచ్చే నక్షత్రాలు. సుభాలు. సుభానికి విరుద్ధమైనది 'అభం'. విపత్తార వంటి కీడు తెచ్చే నక్షత్రాలు అభాలు. ఈ తేడాలు, వివరాలు అంతగా తెలియవు కాబట్టి పసిపిల్లలను అభం సుభం ఎరుగనివాళ్ళని అనడం లోకంలో పరిపాటి. అభము సుభమ్ములం దెలియక ఆర్చెడి దేబెలు మాకు లెక్కయే?... అన్న తిరుపతి వేంకటకవుల ప్రయోగం ఈ అర్థంలోదే! అభం సుభం తెలియకపోవడమే బాల్యానికి అలంకారం. 'నా హృదయంలో నిదురించే చెలీ, పాటలో 'నీ వెచ్చని నీడ' అని ప్రయోగించారు కదా... నీడ ఎక్కడైనా వెచ్చగా ఉంటుందా?' అని శ్రీశ్రీని ఒక కుర్రవాడు ప్రశ్నించాడు. శ్రీశ్రీ అతణ్ని తేరిపార చూసి 'అభం సుభం తెలియని పసివాడివి... పెద్దయ్యాక నీకే తెలుస్తుందిలే' అని బదులిచ్చారు. పెద్దయ్యాక కన్యాశుల్కంలో గిరీశంలా తయారయ్యే అవకాశవాదులు సైతం బాల్యంలో అభం సుభం తెలియని పసివాళ్ళే కావడం ఈ సృష్టిలోని విశేషం. కల్లాకపటం ఎరుగని వయసు, కల్మషం తెలియని మనసు బాల్యానికి సహజసిద్ధమైన కవచకుండలాలు. తేడాలు పాటించకపోవడం అనేది బాల్యంలోనే సాధ్యం. ఒకే కంచం, ఒకే మంచం అనే మాట ఒక్క బాల్యానికే సరిగ్గా నప్పుతుంది. పక్కవాడి కంచంలోని వూరగాయను గబుక్కున తినేసి 'కావాలంటే నా నోరు చూడు' అని అడ్డంగా బుకాయించే బాల్యాన్ని భాగవతంలో అద్భుతంగా వర్ణించాడు బమ్మెర పోతన. అలాంటి నిష్కల్మషమైన పనులు పెద్దయ్యాక సాధ్యంకావు. అందుకే బాల్యం అమూల్యం! బాల్యంలో అనుభవాలు మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మనస్తత్వ నిపుణులు చెబుతారు. గాఢమైన చేదు అనుభవాలు ఆ వయసును గాయపరిస్తే- పెద్దయ్యాక ఆ వ్యక్తి సంఘ వ్యతిరేక శక్తిగా మారే అవకాశం బాగా ఎక్కువ.

చెరువుల్లో ఈతలు, నదీతీరాల్లో ఇసుక గూళ్ళు, జామచెట్లపై కోతి కొమ్మచ్చులు, మైదానాల్లో గాలిపటాలు, వర్షం నీటిలో కాగితం పడవలు, లేగదూడలతో సయ్యాటలు, తూనీగలతో సరాగాలు, పక్షులతో పరాచకాలు... ఇవీ మన సంప్రదాయ క్రీడావినోదాలు! కేవలం బాల్య వినోదాలే కావు- మనిషిలో కలివిడితనానికీ ఇవే పునాదులు. నేలతో నెయ్యం, నింగితో స్నేహం, నీటితో సావాసం, పంచభూతాలతో జట్టుకట్టడం, ప్రపంచంతో ప్రకృతితో కలిసికట్టుగా జీవించడం... ఇవే సిసలైన బాల్యానికి గీటురాళ్లు. మనిషితనానికి ఆనవాళ్ళు. నిజానికి లోకజ్ఞానం అక్కడినుంచే అలవడుతుంది. వికాసం అప్పుడే మొదలవుతుంది. బొమ్మల కొలువులు, వామన గుంటలు, గవ్వలాటలు, చెమ్మచెక్కలు, కాకి ఎంగిలి మామిడి ముక్కలపై ఉప్పూ, కారం అద్దుకు తినడం... వంటివి లేకపోతే బాల్యానికి అందమూ లేదు, అర్థమూ లేదు. అద్దాల మేడల్లో అబ్బురంగా పెరిగే అసూర్యంపశ్యలకు ఆ బాపతు బాల్యంతోను, కమ్మని మట్టివాసనతోను పరిచయం ఉండదు. ఒంటరిగా కూర్చుని నిత్యం యంత్రాలతో సావాసం చేసే పిల్లల శరీరాలు ఎదుగుతాయేగాని, మనసులు ఎదగవు. వెనకటికో ముని సుఖంగా తపస్సు చేసుకుంటుంటే హంతకుడొకడు వచ్చి తన పిడిబాకును దాచిపెట్టమని అడిగాడు. నిత్యం దాన్ని పరిశీలించడం, దాని గురించి ఆలోచించడం అలవాటై ముని స్వభావంలో క్రమంగా నేర ప్రవృత్తి అంకురించిన కథ మనకు తెలుసు. బాల్యంలో బొమ్మ పిస్తోళ్ళ ఆటలతోనే తప్ప సజీవమైన పిట్టల పాటలతో పరిచయం లేని పిల్లల విషయంలోనూ అదే జరుగుతుంది. మట్టిలో తెగ ఆడి ఒళ్ళంతా దుమ్ముకొట్టుకుపోయిన బాలకృష్ణుణ్ని చూస్తే- కైలాసంలో ఒంటినిండా విభూది పూసుకున్న శివుడు గుర్తొచ్చాడు పోతన్నకు! బయట నుంచి వచ్చినప్పుడల్లా రకరకాల కాలుష్యాలు పులుముకుని వస్తున్న పిల్లలను చూస్తుంటే దెయ్యాలు గుర్తొస్తున్నాయి మనకు!

ఇసుకతో గుడి కడతారు... తీరిగ్గా అలంకారాలు అద్దుతారు... తోచినంతసేపూ హాయిగా ఆడుకుంటారు... పొద్దుపోయేసరికి కట్టడాలను చులాగ్గా కూలగొట్టి పిల్లలు నిశ్చింతగా ఇంటిదారి పడతారు. బెంగలూ దుఃఖాలూ ఏమీ ఉండవు. సృజనాత్మకత అనే కాదు, మనిషిలో తాత్విక స్వభావానికీ అంకురారోపణ జరిగే సన్నివేశమది. నిర్జీవమైన యంత్రాలతో ఆట నైరాశ్యాన్ని నింపుతుంది. సజీవమైన పశువులతో, పక్షులతో ఆడుకునే పిల్లల హృదయాల్లో మానవీయ విలువలు స్థిరపడతాయి. అందుకే మన పెద్దలు సాహిత్యంలో సైతం విరివిగా జంతువులను సృష్టించారు. పశువూపక్షీ పిల్లామేకా పెట్టాపుంజూ చెట్టూచేమా- అన్నీ మనిషికి తోబుట్టువులేనన్న భావాన్ని మనసుల్లోకి చొప్పించారు. అవీ మానవ పరివారంలో భాగమేనని బోధించారు. పెంపకంలోనూ, సాహిత్యం ద్వారానూ ప్రకృతితో మనిషి బంధాన్ని పటిష్ఠం చేశారు. అలాగే జంతువుల బొమ్మలను ఆట వస్తువులుగా అందించారు. ఈ రకమైన సంప్రదాయ క్రీడావిధానాలు, ఆట వస్తువుల మూలంగా మనిషి వికాసానికి ఎంతో మేలు జరుగుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన బాల్య వికాస నిపుణుడు, మనస్తత్వవేత్త డాక్టర్‌ జాన్‌ జురైదిని పరిశోధనలో తరతరాల సంప్రదాయ ఆటపాటలు మనిషిలో సృజనాత్మకతకు, వికాసానికి, చలాకీతనానికి కారణం అవుతున్నాయని తేలింది. ఎలక్ట్రానిక్‌ ఆట వస్తువులు, కంప్యూటర్‌ క్రీడలు- పిల్లల్లోని భావుకతకు, ఊహాశాలితకు హానిచేస్తున్నాయనీ రుజువైంది. పిల్లల్లో నేరప్రవృత్తికి అవి దోహదపడుతున్నాయని డాక్టర్‌ జాన్‌ ప్రకటించారు. మరో శాస్త్రవేత్త కారెన్‌ స్టాగ్నిటి సంప్రదాయ క్రీడారీతులు, ఆటపాటలు, వస్తువులు- పిల్లలకు సహజత్వాన్ని నేర్పుతున్నాయన్నారు. సామాజిక జీవన కౌశలం, భాషాపటిమ, సమగ్రవికాసం వంటివాటికి అవే పునాదులుగా చెబుతున్నారు. ఎంతసేపూ పిల్లలను మేధావులుగా తీర్చిదిద్దాలని తపించే తల్లిదండ్రులు ఇకపై వారిని సమర్థులుగా రూపొందించే ప్రయత్నాలు చెయ్యాలన్నది వారందరి హెచ్చరిక!

Tuesday, July 21, 2009

ఎవరిని ధ్యానించాలి

ఎవరిని ధ్యానించాలి?

- ఆచార్య మసన చెన్నప్ప

కర్మ చేయడంలో మనం స్వతంత్రులం. కాని, కర్మఫలాన్ని అనుభవించడంలో అస్వతంత్రులం. దీన్నిబట్టి కర్మఫలాలు ఇచ్చేవాడు ఒకడున్నాడని తెలుస్తుంది. అతనికే పరమాత్మ అని పేరు.

ఎవరు ఈ మానవజన్మతో పాటు, సమస్త శక్తుల్ని మనకు ప్రసాదిస్తున్నారో, ఎవరిని ఈ విశ్వమంతా ఎల్లవేళల ఉపాసిస్తుందో, ఎవరి ఆజ్ఞను సమస్త దేవతలు శిరసా వహిస్తున్నారో, ఎవరిని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుందో, ఎవరిని ఆశ్రయించకపోతే మళ్లీమళ్లీ జన్మలెత్తవలసి వస్తుందో- అట్టి
దేవుణ్నే మొక్కాలని వేదం చెబుతుంది.

అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని; చీకటిని విడిచిపెట్టి ప్రకాశాన్ని; మృత్యువును విడిచిపెట్టి అమృతాన్ని చేరుకోవాలని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి.

'సత్‌', 'జ్యోతి', 'అమృత' శబ్దాలు పరమాత్మకే వర్తిస్తాయి. ప్రపంచం అసత్తు. అనగా సత్యం కానిది. పరమాత్మ సత్యం. కనుక అతడు సత్యస్వరూపుడు. అజ్ఞానమే చీకటి. పరమాత్మ పూర్ణజ్ఞానం కలిగినవాడు. అతని జ్ఞానమనే వెలుగులో మన అజ్ఞానమనే చీకటి పటాపంచలమవుతుంది. కనుక పరమాత్మ 'చిత్‌' స్వరూపుడు. మనం మర్త్యులం. అనగా మృత్యు ముఖంలో ఉన్నవారం. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇలాంటి మృత్యువు నుంచి మనం బయటపడాలి. కనుక అమృతసిద్ధి పొందాలి. అమృతం అంటే శాశ్వతానందం. అది పరమాత్మలోనే ఉంది. కనుకనే ఆయన ఆనందస్వరూపుడు. అందుకే మనం ఎల్లవేళలా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మనే ధ్యానించాలి.

కనిపించే ఈ స్థూల ప్రపంచానికి మూలకారణమైన
ప్రకృతి కూడా సత్‌ పదార్థమేకాని, అది జ్ఞానరహితమైనది. అనగా దానికి తెలివిలేదు. కనుక పరమాత్మకు బదులుగా ఈ జడ ప్రకృతిని ఎవరు ధ్యానిస్తారో వారు దుఃఖరూపమైన అంధకారంలో పడిపోతారని వేదం చెబుతుంది.

సర్వజ్ఞుడైన పరమాత్మ జడప్రకృతి కంటే భిన్నమైనవాడు.
ప్రకృతి కారణంగా కలిగిన విశ్వానికి ఆకారం ఉంది. కాని అతనికి లేదు.

పరమాత్మ సర్వాంతర్యామి కనుక అతనిని పిలువలేం. సర్వాధారుడు కనుక అతనికెలాంటి ఆసనం ఇవ్వజాలం. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాడు కనుక అర్ఘ్య పాద్యాదులు సమర్పించలేమని శంకర భగవత్పాదులు 'పరాపూజా' అనే గ్రంథంలో శ్లోక రూపేణా రాశారు.

జడానికి బదులు జ్ఞానాన్ని ఆశ్రయించడం వల్లనే ముక్తి లభిస్తుందని సాంఖ్య దర్శనం చెబుతుంది.

ఈ దర్శనంలోనే ధ్యానమంటే ఏమిటో స్పష్టంగా ఉంది.

విషయరహితమైన మనస్సుకే ధ్యానం అని పేరు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే అయిదూ విషయాలు. వీటి నుంచి మనస్సు పూర్తిగా వైదొలగినప్పుడే ధ్యానానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆత్మ మనస్సు నుంచి కూడా విడివడి పరమాత్మ ధ్యానంలో మునిగిపోవాలి.

మనం ఎవరిని లక్ష్యంగా చేసుకొని ధ్యానిస్తున్నామో, ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే ప్రవాహరూపంలో ఉండాలి.
పరమాత్మ సర్వ వ్యాపకుడైనప్పటికీ కేవలం మన హృదయంలో ఉన్న ఆత్మలోనే ఆయన దర్శనమివ్వగలడు. దీన్నే ఈశ్వర సాక్షాత్కారమని మన పెద్దలు చెప్పినారు. పరమాత్మ జడపదార్థం కాడు కనుక కనిపించడు. కాని, మన అనుభవంలోకి వస్తాడు. ఇదే ఈశ్వర సాక్షాత్కారం. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకు మనం చేయవలసిందల్లా ఆత్మకు పాపపంకిలాన్ని అంటకుండా జాగ్రత్తపడటమే.

నీటిమీద చెత్తాచెదారం ఉంటే చంద్రుణ్ని ఎలా చూడలేమో, అలాగే
ఆత్మకు పాపం అంటుకుంటే పరమాత్మను కూడా అనుభవంలోకి తెచ్చుకోలేం.
(ఈనాడు, అంతర్యామి, ౨౦:౦౭:౨౦౦౯)

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070